Trump: భారత్ ఎన్నికల విధానం భేష్.. అమెరికాకు ట్రంప్ కీలక సూచనలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా ఎన్నికల్లో ఓటరు గుర్తింపు, పౌరసత్వ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని డొనాల్డ్ ట్రంప్ కొంతకాలంగా పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో 'సేవ్ అమెరికా యాక్ట్'ను వెంటనే ఆమోదించాల్సిన అవసరం ఉందని మరోసారి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా భారత్, అమెరికా ఎన్నికల విధానాలను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్కుమార్ ఇటీవల అమెరికా ఎన్నికల నిర్వహణ తీరుపై ప్రశ్నలు లేవనెత్తారని ట్రంప్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఓటరు గుర్తింపు కార్డు లేకుండానే అమెరికాలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించినట్లు తెలిపారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్లో ఎన్నికల నిర్వహణ విధానం అమెరికాకు ఆదర్శంగా ఉండాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
వివరాలు
భారత్ ఎన్నికల విధానాన్ని అమెరికా పరిశీలించాలి: ట్రంప్
2024లో భారత్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 64.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ట్రంప్ పేర్కొన్నారు.
వారిలో ఒక శాతం కంటే తక్కువ మంది మాత్రమే మెయిల్ ద్వారా ఓటు వేసినట్లు తెలిపారు.
భారత్లో ప్రతి ఓటరుకు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
భారత్లో అమలవుతున్న ఎన్నికల విధానాన్ని అమెరికా కూడా పరిశీలించాలని ట్రంప్ సూచించారు.
ఎన్నికల ప్రక్రియలో ఓటరు గుర్తింపును మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ.. 'సేవ్ అమెరికా యాక్ట్'ను తక్షణమే ఆమోదించాలని కోరారు.
ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమ వేదిక 'ట్రూత్ సోషల్'లో ట్రంప్ పోస్టు చేశారు.
వివరాలు
ఎన్నికల్లో ఓటరు గుర్తింపు, పౌరసత్వానికి సంబంధించిన నిబంధనలను కఠినతరం
అమెరికా ఎన్నికల్లో ఓటరు గుర్తింపు, పౌరసత్వానికి సంబంధించిన నిబంధనలను కఠినతరం చేసేందుకు ట్రంప్ గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో భారత్లోని ఎన్నికల విధానాన్ని అమెరికా వ్యవస్థతో పోల్చుతూ తన వాదనకు మరింత బలం చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారు.
భారత్లో ఓటరు గుర్తింపునకు ఉన్న ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ.. అమెరికాలోనూ ఇలాంటి కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆయన కోరుతున్నారు.