US pilot: ఇరాన్లో చిక్కుకున్న అమెరికన్ పైలట్ రక్షణ.. ట్రంప్ ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధంలో అగ్రరాజ్యానికి చెందిన యుద్ధ విమానం F-15E స్ట్రైక్ ఈగిల్ ఇటీవల కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గల్లంతైన రెండో అమెరికన్ పైలట్ను తాజాగా గుర్తించి సురక్షితంగా రక్షించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దేశ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన రక్షణ చర్యలలో ఇది ఒకటిగా నిలిచిందని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ పైలట్ అమెరికా సైనిక బలగాల ఆధీనంలో సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ఇరాన్లోని ప్రమాదకర పర్వత ప్రాంతాల్లో అతడిని గుర్తించినట్లు వెల్లడించారు.
వివరాలు
అమెరికా బలగాలు 24 గంటలూ పర్యవేక్షించాయి
ఒకవైపు శత్రు దళాలు అతడిని వెతుకుతుండగా, మరోవైపు అతని కదలికలను కమాండర్ ఇన్ చీఫ్, యుద్ధ కార్యదర్శి, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్తో పాటు ఇతర అమెరికా బలగాలు 24 గంటలూ పర్యవేక్షించాయని ట్రంప్ వివరించారు. ఈ ఆపరేషన్ కోసం తాను డజన్ల కొద్దీ విమానాలను పంపించినట్లు తెలిపారు. అయితే రక్షణ చర్యలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఈ విషయాన్ని ముందుగా బహిర్గతం చేయలేదని స్పష్టం చేశారు. శత్రు భూభాగంలోకి ప్రవేశించి ఒక ఎయిర్మెన్ను రక్షించడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి అని ట్రంప్ అన్నారు. ఇరాన్ గగనతలంపై తమకు తిరుగులేని ఆధిపత్యం ఉందని ఈ ఘటన స్పష్టంగా చూపించిందని ట్రంప్ వ్యాఖ్యానించారు.