Trump: ఇరాన్ చమురుపై అమెరికా కన్ను.. ఖర్గ్ ద్వీపం లక్ష్యంగా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై దాడులను కొనసాగిస్తున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారి తీశాయి. ఇరాన్లోని చమురు వనరులను స్వాధీనం చేసుకోవాలన్న తన ఉద్దేశాన్ని ట్రంప్ బహిరంగంగా వెల్లడించడం గమనార్హం. అలాగే, ఇరాన్కు ప్రధాన చమురు ఎగుమతి కేంద్రంగా ఉన్న ఖర్గ్ ద్వీపాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఫైనాన్షియల్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ,"ఇరాన్ చమురును స్వాధీనం చేసుకోవడం నాకు ఎంతో ఇష్టమైన విషయం"అని చెప్పారు. దీనిపై అమెరికాలో కొందరు విమర్శలు చేస్తున్నప్పటికీ, అలాంటి అభిప్రాయాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇప్పటివరకు ఇరాన్లో 13,000 లక్ష్యాలపై దాడులు జరిపినట్లు, ఇంకా 3,000 లక్ష్యాలు మిగిలి ఉన్నాయని తెలిపారు.
వివరాలు
ఇరాన్లో పాలనా మార్పు
పెంటగాన్ పలు ప్రస్తుతం వివిధ సైనిక వ్యూహాలను పరిశీలిస్తోందని కూడా వెల్లడించారు. ఖర్గ్ ద్వీపంలో ఇరాన్ రక్షణ వ్యవస్థలపై ప్రశ్నించగా, ట్రంప్ స్పందిస్తూ అక్కడ గణనీయమైన రక్షణ లేదని, దాన్ని సులభంగా స్వాధీనం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇదే సమయంలో, ఇరాన్లో పాలనా మార్పు జరిగిందని కూడా ఆసక్తికరంగా ప్రకటించారు. పాకిస్తాన్ ద్వారా జరుగుతున్న పరోక్ష చర్చల్లో కొంత పురోగతి ఉందని వెల్లడించారు.
వివరాలు
అమెరికాకే ముప్పు?
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రంగా మారుతున్నాయి. మధ్యప్రాచ్య ప్రాంతానికి వేలాది అమెరికన్ సైనికులను తరలిస్తున్నారు. వ్యూహాత్మకంగా కీలకమైన ఖర్గ్ ద్వీపం ఈ సంఘర్షణలో ప్రధాన పాత్ర పోషించే అవకాశముందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇరాన్ చమురు ఎగుమతుల్లో అత్యధిక భాగం ఖర్గ్ ద్వీపం నుంచే జరుగుతుంది. ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం యుద్ధ వ్యూహంలో కీలక అడుగుగా భావిస్తున్నారు. అయితే, దీనిపై దాడి చేయడం అత్యంత ప్రమాదకరమని సైనిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది అమెరికా సైనికుల ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని, అలాగే ప్రపంచంలో కీలకమైన చమురు సరఫరా మార్గాలపై ప్రభావం చూపవచ్చని పేర్కొంటున్నారు.
వివరాలు
భారీగా సైనిక మోహరింపు
ఇరాన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన చర్యల్లో భాగంగా సుమారు 10,000 మంది సైనికులను మోహరించేందుకు పెంటగాన్ ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. దాదాపు 2,200 మంది మెరైన్స్తో సహా 3,500 మంది సిబ్బంది ఇప్పటికే సంఘర్షణ ప్రాంతానికి చేరుకున్నారు. మరో 2,200 మంది మెరైన్స్ మార్గంలో ఉన్నారు. అదనంగా, 82nd వైమానిక దళ విభాగంకు చెందిన వేలాది మంది సైనికులను కూడా మోహరించేందుకు చర్యలు చేపట్టారు. పెరుగుతున్న మరణాలు ఈ యుద్ధం ప్రభావంతో మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇరాన్లో ఇప్పటివరకు 1,900 మందికి పైగా మరణించగా, ఇజ్రాయెల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్లో 1,100 మందికి పైగా మరణించినట్లు అధికారులు వెల్లడించారు.