Page Loader
Trump-Putin: పుతిన్‌పై ఆగ్రహంగా ట్రంప్.. తనకు కోపం తెప్పించే పనులు చేయొద్దని హితవు
పుతిన్‌పై ఆగ్రహంగా ట్రంప్.. తనకు కోపం తెప్పించే పనులు చేయొద్దని హితవు

Trump-Putin: పుతిన్‌పై ఆగ్రహంగా ట్రంప్.. తనకు కోపం తెప్పించే పనులు చేయొద్దని హితవు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 31, 2025
09:26 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇటీవల వరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై తీవ్ర విమర్శలు చేసిన ట్రంప్, ఇప్పుడు తన దృష్టిని మార్చుకున్నారు. తాజాగా, ఆయన పుతిన్‌పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్, ఉక్రెయిన్ విషయంలో పుతిన్ తీసుకుంటున్న నిర్ణయాలను ఖండించారు. ముఖ్యంగా, ఉక్రెయిన్‌లో శాంతి చర్చలు జరగాలంటే జెలెన్‌స్కీ తన పదవికి రాజీనామా చేయాలని పుతిన్ చేసిన వ్యాఖ్యలు ట్రంప్‌ను తీవ్రంగా కోపగించేశాయి.

వివరాలు 

తనకు కోపం తెప్పించే పనులు చేయొద్దని హితవు 

ఉక్రెయిన్‌లో హింస కొనసాగితే, దాని బాధ్యత రష్యాదేనని ట్రంప్ హెచ్చరించారు.రష్యా సమాధానం ఇవ్వకపోతే, భారీ చమురు సుంకాలను విధిస్తామని ఆయన స్పష్టం చేశారు. తన కోపాన్ని పుతిన్ కూడా బాగా తెలుసని,ఇప్పటికీ వారిద్దరి మధ్య మెరుగైన సంబంధాలు ఉన్నప్పటికీ, ఉక్రెయిన్ విషయంలో పుతిన్ సరైన నిర్ణయాలు తీసుకుంటేనే తన ఆగ్రహం తగ్గుతుందని ట్రంప్ అన్నారు.లేకపోతే, దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇటీవల, అమెరికా మధ్యవర్తిత్వంతో సౌదీ అరేబియాలో రష్యాతో శాంతి చర్చలు జరిగాయి. అమెరికా, ఉక్రెయిన్‌లో 30 రోజుల కాల్పుల విరమణకు ప్రతిపాదించింది. అయితే, రష్యా దీన్ని తిరస్కరించింది. తాము నిర్ణయించిన షరతులను మాత్రమే అంగీకరించాల్సిందిగా రష్యా పేర్కొంది.

వివరాలు 

 పరోక్ష చర్చలకు ఆసక్తి చూపిన ఇరాన్

ఈ చర్చల నడుమనే, రష్యా మళ్లీ ఉక్రెయిన్‌పై దాడులు చేపట్టింది. పైగా, జెలెన్‌స్కీ పదవి నుంచి వైదొలగితేనే శాంతి చర్చలు జరుపుతానంటూ పుతిన్ ప్రకటించడం, ట్రంప్ ఆగ్రహానికి కారణమైంది. ఈ పరిణామాలు ఎంత దూరం వెళతాయో చూడాలి. ఇదే సమయంలో, ఇరాన్‌తో అణు ఒప్పందం కుదరకుంటే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే, ప్రత్యక్ష చర్చలకు ఇరాన్ నిరాకరించినప్పటికీ, పరోక్ష చర్చలకు మాత్రం ఆసక్తి చూపిస్తోంది. అమెరికా, ఇరాన్ స్వతంత్ర అణు కార్యక్రమాలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమతో ఒప్పందం కుదరాల్సిందేనని స్పష్టంగా పేర్కొంది. ఫలితంగా, ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.