Trump's China Tour: ట్రంప్ చైనా పర్యటనలో ఉద్రిక్తతలు.. అమెరికా ప్రతినిధులపై కఠిన ఆంక్షల ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
చైనాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన కొనసాగుతున్న వేళ తెరవెనుక పలు ఉద్రిక్త పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అమెరికా ప్రతినిధి బృందంపై చైనా అధికారులు అనధికారికంగా కఠిన నియంత్రణలు అమలు చేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా జర్నలిస్టులు, భద్రతా సిబ్బంది, ఇతర అధికారుల కదలికలపై కఠిన పరిమితులు విధిస్తున్నట్లు తెలుస్తోంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ట్రంప్ ద్వైపాక్షిక సమావేశం సందర్భంగా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సమావేశ వేదిక వద్ద చైనా మీడియా ప్రతినిధులు దురుసుగా ప్రవర్తించారని అమెరికా వర్గాలు ఆరోపిస్తున్నాయి.
వివరాలు
'టెంపుల్ ఆఫ్ హెవెన్' వద్ద కూడా ఇరు దేశాల అధికారుల మధ్య వాగ్వాదం
వైట్ హౌస్కు చెందిన ఓ జర్నలిస్టును చైనా రిపోర్టర్లు బలంగా తోసుకుంటూ ముందుకు వెళ్లినట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. ఈ ఘటనలో పెద్ద గాయాలు కాకపోయినా.. వారి ప్రవర్తనపై అమెరికా అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. బీజింగ్లోని 'టెంపుల్ ఆఫ్ హెవెన్' వద్ద కూడా ఇరు దేశాల అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆయుధం వెంట తీసుకువెళ్తున్నాడనే కారణంతో అమెరికా రహస్య భద్రతా విభాగానికి చెందిన ఓ ఏజెంట్ను లోపలికి అనుమతించలేదని తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడి భద్రతా సిబ్బంది ఎప్పుడూ ఆయుధాలతో సిద్ధంగా ఉండటం నిబంధన కావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
వివరాలు
పర్యటన ప్రారంభమైన నాటి నుంచి అనేక పరిమితులు
దాదాపు అరగంట పాటు చర్చలు, వాగ్వాదం కొనసాగిన తర్వాత ఇప్పటికే లోపలికి వెళ్లిన మరో ఏజెంట్ వచ్చి మీడియా ప్రతినిధులను కార్యక్రమ స్థలానికి తీసుకెళ్లినట్లు సమాచారం. అధ్యక్షుడి వాహన శ్రేణిలో జర్నలిస్టులకు ప్రవేశం కల్పించే విషయంలోనూ ఇలాంటి ఘర్షణలు చోటుచేసుకున్నాయని తెలుస్తోంది. పర్యటన ప్రారంభమైన నాటి నుంచి అమెరికా ప్రతినిధి బృందం, ముఖ్యంగా మీడియా సిబ్బంది అనేక పరిమితులు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. చివరకు మరుగుదొడ్ల వినియోగం విషయంలో కూడా చైనా అధికారులు అతిగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
vivaralu
తాత్కాలిక ఈమెయిల్ ఖాతాలను మాత్రమే వినియోగించాలని ఆదేశం
ఇక భద్రతాపరమైన అంశాలపై కూడా అమెరికా వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పర్యటనకు వెళ్లిన అధికారులు, జర్నలిస్టులు ప్రత్యేక తాత్కాలిక మొబైల్ ఫోన్లు ఉపయోగించాలని అమెరికా ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. అలాగే తాత్కాలిక ఈమెయిల్ ఖాతాలను మాత్రమే వినియోగించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. లేకపోతే సైబర్ దాడులు, గూఢచర్యం, సమాచార చోరీ ప్రమాదం ఉందని హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.