NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Myanmar Floods: యాగీ తుపాను భీభత్సం.. మయన్మార్‌లో 226 మంది మృతి
    తదుపరి వార్తా కథనం
    Myanmar Floods: యాగీ తుపాను భీభత్సం.. మయన్మార్‌లో 226 మంది మృతి
    యాగీ తుపాను భీభత్సం.. మయన్మార్‌లో 226 మంది మృతి

    Myanmar Floods: యాగీ తుపాను భీభత్సం.. మయన్మార్‌లో 226 మంది మృతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 17, 2024
    05:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారీ వర్షాల కారణంగా మయన్మార్‌ అతలాకుతలమవుతోంది. యాగీ తుపాను కారణంగా వరదలు, కొండచరియల విరిగిపడటంతో తీవ్ర నష్టం వాటిల్లింది.

    ఇప్పటికే ఈ ఘటనల్లో 226 మంది ప్రాణాలు కోల్పోగా, 77 మంది గల్లంతయ్యారు. లక్షలాది ప్రజలు తమ ఇళ్లను విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు.

    దాదాపు 6.30 లక్షల మంది ఈ ప్రకృతి విపత్తు ప్రభావానికి గురయ్యారని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.

    ఇప్పటికే అంతర్యుద్ధంతో ఇబ్బందులు పడుతున్న మయన్మార్‌లో ఇప్పుడు వరదల కారణంగా వేల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి.

    Details

    ఆహారం, ఆశ్రయం కోసం ఇబ్బంది పడుతున్న ప్రజలు

    రాజధాని నేపిడావ్ సహా పలు ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

    దాదాపు ఐదు లక్షల మంది ప్రజలు తాగునీరు, ఆహారం, ఆశ్రయం కోసం ఇబ్బందులు పడుతున్నారని ఐరాస తెలిపింది.

    రహదారులు, మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో, మయన్మార్‌ సైనిక పాలక వర్గం విదేశీ సాయం కోరినట్లు తెలుస్తోంది.

    యాగీ తుపాను వియత్నాం, థాయ్‌లాండ్, లావోస్‌లలోనూ విధ్వంసం సృష్టించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మయన్మార్
    ప్రపంచం

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    మయన్మార్

    పజిగి గ్రామంపై మయన్మార్ మిలిటరీ వైమానిక దాడి; 100మంది మృతి ఆర్మీ
    తుపానుకు 'మోచా' పేరు ఎలా పెట్టారు? అది ఎప్పుడు తీరాన్ని తాకుతుంది?  ఐఎండీ
    మోచా తుపాను: మయన్మార్‌లో ఆరుగురు మృతి, 700 మందికి గాయాలు  తుపాను
    మయన్మార్ నుంచి సేకరించిన ఆయుధాలతోనే మణిపూర్‌లో హింస: ఇంటెలిజెన్స్ వర్గాలు  మణిపూర్

    ప్రపంచం

    kate middleton: క్యాన్సర్ చికిత్సలో గణనీయమైన పురోగతి సాధించిన బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్  అంతర్జాతీయం
    EU Elections: యూరోపియన్ పార్లమెంట్ సీటు గెలుచుకున్న సైప్రస్ యూట్యూబర్  అంతర్జాతీయం
    Malawis vice president : విమాన ప్రమాదంలో మరణించిన మలావి వైస్ ప్రెసిడెంట్ అంతర్జాతీయం
    EU : ఉక్రెయిన్ ,మోల్డోవాతో సభ్యత్వ చర్చల ప్రారంభం  అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025