
PIB Fact Check: ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడి.. భారత గగనతలం వినియోగం నిజమేనా?
ఈ వార్తాకథనం ఏంటి
'ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్' పేరుతో ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా జరిపిన దాడులు ఇటీవలే జరిగాయి. ఈ దాడుల కోసం అమెరికా విమానాలు భారత గగనతలాన్ని ఉపయోగించుకున్నాయని సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే భారత్ ఈ వార్తలను ఖండించింది. వాటిని నకిలీవిగా తేల్చింది. 'ఆపరేషన్' సమయంలో భారత గగనతలం వినియోగం జరగలేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ప్రకటించింది. ఈ దాడుల్లో పాల్గొన్న అమెరికా విమానాల మార్గాలను జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డేనియల్ కెయిన్ మీడియా సమావేశంలో వివరించారని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తెలిపింది.
Details
వీడియో లింక్ షేర్ చేసిన పీఐబీ
సంబంధిత వీడియో లింక్ను కూడా పీఐబీ షేర్ చేసింది. ఇక ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఇప్పటికే కొనసాగుతున్న దాడులతో పశ్చిమాసియాలో పరిస్థితి అత్యంత ఉద్రిక్తతకు చేరింది. తాజాగా అమెరికా దాడుల కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. అమెరికా తమ అణు కేంద్రాలపై దాడులకు పాల్పడడాన్ని 'హద్దులు దాటింది'గా అభివర్ణించిన ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ, తదుపరి పరిణామాలకూ వాషింగ్టన్ పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు. మరోవైపు, ఇరాన్ అధ్యక్షుడు షెజెష్కియాన్తో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్లో మాట్లాడారు. ఉద్రిక్తతలను శాంతియుతంగా, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.