Page Loader
USA:యుఎస్'లో అంతర్జాతీయ విద్యార్థులకు వర్క్ పర్మిట్‌లకు ముగింపు..  భారతీయులపై ప్రభావం 
యుఎస్'లో అంతర్జాతీయ విద్యార్థులకు వర్క్ పర్మిట్‌లకు ముగింపు.. భారతీయులపై ప్రభావం

USA:యుఎస్'లో అంతర్జాతీయ విద్యార్థులకు వర్క్ పర్మిట్‌లకు ముగింపు..  భారతీయులపై ప్రభావం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 03, 2025
11:47 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో పని అనుభవం పొందేందుకు ఉపయోగించే ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) ప్రోగ్రామ్‌పై పెరుగుతున్న ఒత్తిడి కొనసాగుతోంది. ఈ ప్రోగ్రాం వల్ల అమెరికా న్యాయవాదులు, కంపెనీలు, ఇతరులు విమర్శలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రోగ్రామ్ కింద విదేశీ విద్యార్థులు అమెరికన్లకు అందుబాటులో ఉండే ఉద్యోగాలను ఎగరేసుకుపోతున్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది వారిని సంప్రదాయ మార్గాలను దాటుకుని, దీర్ఘకాలిక వలసల ప్రేరేపకంగా ఉపయోగిస్తున్నారని సూచిస్తున్నారు. ఓపీటీ ప్రోగ్రామ్ ప్రాథమికంగా విద్యార్థులకు తాత్కాలికంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు ఉపయోగపడుతుంది.

వివరాలు 

అమెరికా టెక్‌ వర్కర్స్‌ గ్రూప్‌ ఈ ప్రోగ్రామ్‌పై అభ్యంతరాలు 

ఈ కార్యక్రమం ద్వారా ఎఫ్‌-1 వీసా కలిగిన విద్యార్థులకు, వారు స్టెమ్‌ (సైకలాజీ,టెక్నాలజీ,ఇంజినీరింగ్‌, మ్యాథమాటిక్స్‌)డిగ్రీలు పూర్తి చేస్తే, 3 సంవత్సరాలపాటు అమెరికాలో పనిచేసే అవకాశం ఇస్తుంది. కానీ ఈ ప్రోగ్రామ్‌కు అనుమతి అమెరికా కాంగ్రెస్‌ నుండి లభించలేదు అని విమర్శకులు తరచుగా వ్యాఖ్యానిస్తారు. అంతేకాదు, విదేశీ విద్యార్థులు ఈ ప్రోగ్రామ్‌ను ఉపయోగించి, అమెరికన్‌ విద్యార్థులతో పాటు ఉద్యోగాల కోసం పోటీపడుతున్నారని ఆరోపిస్తున్నారు కొంతమంది దీన్ని దొడ్డిదారిగా, అమెరికా జాబ్‌ మార్కెట్‌కి హానికరంగా చూడటానికి కారణం అని అభిప్రాయపడుతున్నారు. అమెరికా టెక్‌ వర్కర్స్‌ గ్రూప్‌ ఈ ప్రోగ్రామ్‌పై తీవ్రమైన అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. వారు ఈ ప్రోగ్రామ్‌ను "అతిథి ఉద్యోగుల స్కీమ్‌" అని పిలుస్తున్నారు. దాన్ని విదేశీ విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌ అని ముసుగుతో సమర్ధిస్తున్నారు.

వివరాలు 

ఈ ప్రోగ్రామ్‌ను వ్యతిరేకించిన వాషింగ్టన్‌ అలయన్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ వర్కర్స్‌

ఇంతకుముందు, ట్రంప్‌ కూడా ఈ ప్రోగ్రామ్‌ను నిలిపివేసి, అమెరికాలో ఉన్న విద్యార్థులకు జరుగుతున్న అన్యాయ పోటీని అరికట్టాలని కోరిన సంగతి తెలిసిందే. అలాగే, వాషింగ్టన్‌ అలయన్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ వర్కర్స్‌ 2023లో కోర్టులో ఈ ప్రోగ్రామ్‌ను వ్యతిరేకించింది. వారి అభిప్రాయం ప్రకారం, ఇది అమెరికా ఉద్యోగులకు నష్టాన్ని కలిగిస్తుంది. కానీ, కింది కోర్టు ఈ ప్రోగ్రామ్‌ను సమర్థించి, ఇకపై కూడా ఇది కొనసాగుతుందని నిర్ణయించింది. కొన్ని చట్టసభ సభ్యులు ఈ ప్రోగ్రామ్‌ను పూర్తిగా రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారు. భారత విద్యార్థులు వృత్తిపరమైన అవకాశాలు.. హెచ్‌1బీ వీసాల కోసం ఈ ఓపీటీ ప్రోగ్రామ్‌పైనే ఆధారపడతారు.