US War Crimes: ఇరాన్పై అమెరికా దాడుల్లో యుద్ధ నేరాలు.. ఆధారాలు ఉన్నాయన్న ఐరాస బృందం
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్పై దాడుల సమయంలో అమెరికా యుద్ధ నేరాలకు పాల్పడిందా? ఈ ప్రశ్నపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి (UNHRC) నియమించిన అంతర్జాతీయ నిజనిర్ధారణ బృందం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరాన్లో జరిగిన రెండు దాడులకు సంబంధించి అమెరికా యుద్ధ నేరాలకు పాల్పడినట్లు సూచించే ఆధారాలు తమకు లభించాయని తెలిపింది. ఈ ఘటనల్లో మహిళలు, చిన్నారులు సహా దాదాపు 178 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. నిజనిర్ధారణ బృందం పరిశీలించిన ఘటనల్లో ఒకటి మినాబ్లోని పాఠశాలపై జరిగిన తోమహాక్ క్షిపణి దాడి. రెండోది లామెర్డ్ నగరంలోని క్రీడా సముదాయం, దానికి సమీపంలోని నివాస ప్రాంతంపై జరిగిన వైమానిక దాడి. ఇరాన్లో భద్రతా బలగాలు మారణకాండకు పాల్పడినట్లు కూడా బృందం ఆరోపించింది.
వివరాలు
మినాబ్ పాఠశాలపై దాడి..
సొంత ప్రభుత్వం నుంచి హక్కుల ఉల్లంఘనలు, మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలు ఎదురవుతుండగా.. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్లతో కొనసాగుతున్న యుద్ధం మధ్య ఇరాన్ పౌరులు చిక్కుకుపోయారని పేర్కొంది.
పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన సమయంలో మినాబ్లోని పాఠశాలపై జరిగిన దాడి అంతర్జాతీయంగా తీవ్ర దిగ్భ్రాంతికి కారణమైంది.
ఫిబ్రవరి 28న ఇరాన్లోని ఐఆర్జీసీ స్థావరాలపై అమెరికా దాడులు కొనసాగుతున్న సమయంలో.. మినాబ్లోని ఓ పాఠశాలను క్షిపణి తాకింది.
వివరాలు
మినాబ్ పాఠశాలపై దాడి..
ఈ ఘటనలో 168 మంది మృతి చెందినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నట్లు తెలిపింది.
మరోవైపు.. లామెర్డ్ నగరంపై జరిగిన దాడికి తాము బాధ్యులం కాదని అమెరికా సెంట్రల్ కమాండ్ ఇప్పటికే స్పష్టం చేసింది.
ఈ ఘటనపై అమెరికా నుంచి బాధ్యతను నిరాకరించే ప్రకటన వెలువడినప్పటికీ, నిజనిర్ధారణ బృందం దానిని తన పరిశీలనలో ప్రస్తావించింది.