LOADING...
US-Iran: ఇరాన్‌తో చర్చల పునఃప్రారంభానికి రెండు కొత్త షరతులు విధించిన అమెరికా
ఇరాన్‌తో చర్చల పునఃప్రారంభానికి రెండు కొత్త షరతులు విధించిన అమెరికా

US-Iran: ఇరాన్‌తో చర్చల పునఃప్రారంభానికి రెండు కొత్త షరతులు విధించిన అమెరికా

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 15, 2026
10:59 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇరాన్‌తో చర్చలను మళ్లీ ప్రారంభించాలంటే రెండు కఠిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని అమెరికా స్పష్టం చేసింది. పాకిస్థాన్‌లో జరగనున్న తదుపరి దశ చర్చలకు ముందుగానే ఈ షరతులను ముందుకు తీసుకొచ్చింది. మరోవైపు,రెండు రోజుల్లో చర్చలు పునఃప్రారంభమయ్యే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంకేతాలు ఇచ్చినా, తాజా నిబంధనలు అనిశ్చితిని పెంచుతున్నాయి. దౌత్య వర్గాల సమాచారం మేరకు,అమెరికా పెట్టిన మొదటి నిబంధన హర్మూజ్ జలసంధిని ఎలాంటి ఆంక్షలు లేకుండా పూర్తిగా తెరవడం. ఇరాన్ తమ నౌకలు, చమురు రవాణా నౌకల రాకపోకలను అడ్డుకుంటే, తాము కూడా ఇరాన్ నౌకలను కదలనివ్వబోమని అమెరికా హెచ్చరించింది. దీనివల్ల ప్రతిస్పందన తప్పదనే స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి.

వివరాలు 

ఇరాన్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు

రెండో నిబంధనగా,చర్చలకు హాజరయ్యే ఇరాన్ ప్రతినిధి బృందానికి ఒప్పందాలను ఖరారు చేసే సంపూర్ణ అధికారం ఉండాలని అమెరికా కోరుతోంది. ముఖ్యంగా ప్రభుత్వంలోని అన్ని కీలక విభాగాల అనుమతి పొందే అధికారాన్ని ఆ బృందానికి కల్పించాలని తెలిపింది. ఇస్లామాబాద్‌లో కుదిరే ఏ ఒప్పందానికైనా ఉన్నత స్థాయి అధికారుల సమ్మతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఇరాన్ ప్రభుత్వంలో ప్రస్తుతం అంతర్గత విభేదాలు తీవ్రమైన స్థాయికి చేరినట్లు సమాచారం. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ వంటి రాజకీయ నాయకత్వానికి, సైనిక ప్రభావం కలిగిన విభాగాల మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు సూచిస్తున్నాయి. ఇటీవలి చర్చల సమయంలో ఇరాన్ రాజకీయ ప్రతినిధులను సమాధానం ఇవ్వకుండా అడ్డుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.

వివరాలు 

పది సంవత్సరాల తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య నేరుగా చర్చలు

దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి రక్షించాల్సిన అవసరాన్ని అధ్యక్షుడు పార్లమెంట్ నాయకత్వానికి తెలియజేసినట్లు సమాచారం. ఈ పరిస్థితుల దృష్ట్యా, పూర్తి అధికారంతో వచ్చే ప్రతినిధులతోనే చర్చలు జరపాలని అమెరికా నిర్ణయించింది. గత వారాంతంలో పాకిస్థాన్‌లో జరిగిన తొలి దశ చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. దాదాపు పది సంవత్సరాల తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య నేరుగా చర్చలు జరగడం ఇదే తొలిసారి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఈ వారంలోనే రెండో దశ చర్చలు జరిగే అవకాశముందని వార్తలు చెబుతున్నప్పటికీ, దీనిపై అమెరికా ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

Advertisement