Loading...
US: హర్ముజ్‌ వద్ద 20కిపైగా యుద్ధనౌకలు.. ఇరాన్‌కు అమెరికా మరో వార్నింగ్
హర్ముజ్‌ వద్ద 20కిపైగా యుద్ధనౌకలు.. ఇరాన్‌కు అమెరికా మరో వార్నింగ్

US: హర్ముజ్‌ వద్ద 20కిపైగా యుద్ధనౌకలు.. ఇరాన్‌కు అమెరికా మరో వార్నింగ్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 10, 2026
01:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌తో పాక్షిక స్థాయి చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వేళ.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మాత్రం తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికా సైన్యం మరోసారి కీలక హెచ్చరిక చేసింది. ప్రాంతంలో 20కిపైగా యుద్ధనౌకలను ఇప్పటికీ సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించింది. ఈ వివరాలను యూఎస్ సెంట్రల్ కమాండ్ 'ఎక్స్‌' వేదికగా ప్రకటించింది. ఇరాన్‌పై దిగ్బంధనం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 55 వాణిజ్య నౌకలను తమ మార్గాల నుంచి మళ్లించినట్లు తెలిపింది. మరో రెండు కమర్షియల్ నౌకలను నిలిపివేసినట్లు పేర్కొంది. అదేవిధంగా మరో రెండు నౌకల్లోకి తమ సిబ్బంది ఎక్కి దిగ్బంధన నిబంధనలను మరింత కఠినంగా అమలు చేసినట్లు వెల్లడించింది.

vivaralu

పశ్చిమాసియాలో యూఎస్‌ఎస్ రాస్‌తో పాటు 20కిపైగా యుద్ధనౌకల మోహరింపు 

యూఎస్‌ఎస్ రాస్‌ నౌకపై అమెరికా నావికులు నిరంతరం పహారా కాస్తున్నారని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది.

యూఎస్‌ఎస్ రాస్‌తో పాటు 20కిపైగా యుద్ధనౌకలను పశ్చిమాసియాలో మోహరించినట్లు పేర్కొంది.

ఇరాన్‌పై విధించిన దిగ్బంధనాన్ని అత్యంత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేసింది.

మరోవైపు, హోర్ముజ్‌ జలసంధిని తిరిగి తెరవాలంటే అమెరికా తమ డిమాండ్లను అంగీకరించాల్సిందేనని ఇరాన్‌ స్పష్టం చేస్తోంది.

హోర్ముజ్‌లో నౌకల రాకపోకలకు సురక్షితమైన మార్గాలను ఏర్పాటు చేసే విషయంలో ఒమాన్‌తో ఒప్పందం త్వరలో ఖరారయ్యే అవకాశం ఉందని కూడా ఇరాన్‌ వెల్లడించింది.

అయితే అమెరికా తమ షరతులకు అంగీకరించకుండా హోర్ముజ్‌ను పూర్తిగా తెరవబోమని తేల్చిచెబుతోంది.

వివరాలు 

నష్ట పరిహారం చెల్లించాలని ఇరాన్‌ డిమాండ్

ఇరాన్‌పై జరిగిన దాడుల కారణంగా తమ దేశానికి జరిగిన నష్టానికి అమెరికా పరిహారం చెల్లించాలని ఇరాన్‌ డిమాండ్ చేస్తోంది.

అంతేకాకుండా అమెరికా తమపై చేస్తున్న బెదిరింపులను నిలిపివేయాలని పేర్కొంది.

ఈ రెండు అంశాలపై స్పష్టమైన హామీ లభించిన తర్వాతే హోర్ముజ్‌ జలసంధిని మళ్లీ తెరవడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతోంది.

ఇదిలా ఉండగా.. హోర్ముజ్‌ జలసంధిలో రాకపోకలను పునరుద్ధరించేందుకు అమెరికా తన అణు ఒప్పందానికి సంబంధించిన అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

దీంతో ఒకవైపు అమెరికా-ఇరాన్‌ మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. మరోవైపు హోర్ముజ్‌ వద్ద సైనిక మోహరింపులు, దిగ్బంధనం, ఇరాన్‌ డిమాండ్లతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హర్ముజ్‌ వద్ద 20కిపైగా నౌకలతో అమెరికా పహారా

ADVERTISEMENT