Page Loader
Manipur: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. ఐదుగురు మృతి 
మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. ఐదుగురు మృతి

Manipur: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. ఐదుగురు మృతి 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 07, 2024
04:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో కొంతకాలంగా డ్రోన్‌ బాంబు దాడులు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య స్థానికంగా మరోసారి హింస చెలరేగడం కలకలం రేపింది. ఈ ఘటన వల్ల జిరిబామ్‌ జిల్లాలో ఐదుగురు మృతి చెందారు. శనివారం తొలుత ఓ వ్యక్తిని నిద్రలోనే కాల్చి చంపగా.. ఇదికాస్త ఇరువర్గాల మధ్య కాల్పులకు దారితీసింది. ఈ క్రమంలోనే మరో నలుగురు సాయుధులు మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. మరోవైపు చూరాచాంద్‌పుర్‌లో మిలిటెంట్లకు చెందిన మూడు బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. బిష్ణుపుర్‌ జిల్లాలో రాకెట్‌ దాడులను ఇక్కడి నుంచే చేపట్టినట్లు తెలుస్తోంది.

Details

మూడు బంకర్లను ధ్వంసం చేసిన ప్రత్యేక బలగాలు

రాకెట్‌ దాడుల ఘటనల్లో బిష్ణుపుర్‌ జిల్లాలో ఓ వృద్ధుడు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. మొదటి దాడి తెల్లవారుజామున 4.30 గంటలకు ట్రోంగ్లావ్‌బిలో జరిగింది. రెండోవ దాడి మధ్యాహ్నం 3 గంటలకు మొయిరంగ్‌లోని మాజీ సీఎం మైరెంబమ్‌ కొయిరెంగ్‌ నివాస ఆవరణలో రాకెట్‌ పడటంతో అందులో అమర్చిన బాంబు పేలింది. దీంతో ఓ వృద్ధుడు మృతి చెందారు. ఆరుగురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే చూరాచాంద్‌పుర్‌లోని మువాల్‌సంగ్‌, లైకా మువాల్సు గ్రామాల్లో ప్రత్యేక ఆపరేషన్‌‌ను బలగాలు చేపట్టి, మూడు బంకర్లను కూల్చివేశాయి.