Loading...
US Strikes: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్‌పై అమెరికా, సౌదీ సంయుక్త వైమానిక దాడులు
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు..

US Strikes: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్‌పై అమెరికా, సౌదీ సంయుక్త వైమానిక దాడులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2026
08:00 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులకు ప్రయత్నించిందని అమెరికా ఆరోపించింది. ఇరాన్ ప్రయోగించిన పలువురు క్షిపణులను తమ బలగాలు విజయవంతంగా అడ్డుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (యూఎస్ సెంట్‌కామ్) వెల్లడించింది. ఇదే సమయంలో ఇరాక్‌లో ఇరాన్ మద్దతు ఉన్న సాయుధ దళాలు కార్యకలాపాలు నిర్వహిస్తున్న లాజిస్టిక్స్, ఆయుధ నిల్వ కేంద్రాలపై అమెరికా, సౌదీ అరేబియా యుద్ధ విమానాలు సంయుక్తంగా వైమానిక దాడులు నిర్వహించినట్లు సెంట్‌కామ్ తెలిపింది. ఇరాన్‌తో పాటు దానికి మద్దతు ఇస్తున్న బలగాలు వెంటనే దాడులను నిలిపివేయాలని, లేకపోతే మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అమెరికా హెచ్చరించింది.

వివరాలు 

72గంటల్లో30కుపైగా డ్రోన్ దాడులు

గత 72గంటల్లో తమ బలగాలపై 30కుపైగా డ్రోన్ దాడులు జరిగిన నేపథ్యంలో ప్రతీకార చర్యగా ఈదాడులు చేపట్టినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.

తూర్పు ఇరాక్‌లోని పలు ఉగ్రవాద లాజిస్టిక్స్ కేంద్రాలు, ఆయుధ స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని అమెరికా,సౌదీ యుద్ధవిమానాలు దాడులు నిర్వహించినట్లు పేర్కొంది.

మరోవైపు, చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాక్ నుంచి ప్రయోగించిన డ్రోన్లను వరుసగా రెండోరోజూ కూల్చివేసినట్లు సౌదీ అరేబియా ప్రకటించింది.

సోమవారం కూడా ఇదే తరహా డ్రోన్ దాడి జరిగినట్లు ఆరోపించింది.

ఈపరిణామాల నేపథ్యంలో ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఇరాక్ ప్రధాని అలీ అల్-జైదీ భద్రతా సంస్థలను ఆదేశించారు.

ప్రాంతంలో ఉద్రిక్తపరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉండటంతో పరిస్థితిని సంబంధిత దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.

ADVERTISEMENT