WHO: నిఫా కేసులపై WHO సానుకూల స్పందన: ప్రపంచానికి ప్రమాదం లేదు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్లోని పశ్చిమ బెంగాల్లో ఇటీవల ఇద్దరు వ్యక్తులకు నిఫా వైరస్ (Nipah virus) సోకడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపడుతోంది. అయితే ఈ వార్త విని చైనా, థాయ్లాండ్, నేపాల్, మలేసియా, తైవాన్ వంటి దేశాలు భారత్ నుండి వచ్చే ప్రయాణికులపై నిఫా స్క్రీనింగ్ ప్రారంభించాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పందిస్తూ.. భారత్లో నిఫా ప్రభావం తక్కువగానే ఉందని.. దానితో ప్రమాదమేమీ లేదని ప్రపంచ దేశాలకు తెలిపింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భారత్ వేగవంతమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొంది.
వివరాలు
చైనాలో నిఫా కేసులు నమోదు కాలేదు: వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం
WHO ప్రపంచ దేశాలకు సూచించిన విధంగా, భారత్పై ప్రయాణ, వాణిజ్య పరిమితులు విధించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి నిఫా వైరస్ వ్యక్తి నుండి వ్యక్తికి వేగంగా వ్యాపిస్తున్నట్లుగా ఏ ఆధారాలు లేవు. వ్యాధికి బాధపడిన ఇద్దరు వ్యక్తులు ఎటువంటి ప్రయాణాలు చేయకపోవడం వల్ల, ఇది భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు వ్యాప్తి చెందే ప్రమాదం లేదు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో, పొరుగుదేశం చైనా కూడా అప్రమత్తమైంది. భారత్ సహా వైరస్ ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం చైనా విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ ప్రక్రియ ప్రారంభించింది. అయితే ఇప్పటివరకూ చైనాలో నిఫా కేసులు నమోదు కాలేదని అక్కడి వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం ప్రకటించింది.