NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / నోయిడాలో తయారు చేస్తున్న ఆ రెండు దగ్గు సిరప్‌లను పిల్లలకు ఉపయోగించొద్దు : డబ్ల్యూహెచ్‌ఓ
    అంతర్జాతీయం

    నోయిడాలో తయారు చేస్తున్న ఆ రెండు దగ్గు సిరప్‌లను పిల్లలకు ఉపయోగించొద్దు : డబ్ల్యూహెచ్‌ఓ

    నోయిడాలో తయారు చేస్తున్న ఆ రెండు దగ్గు సిరప్‌లను పిల్లలకు ఉపయోగించొద్దు : డబ్ల్యూహెచ్‌ఓ
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 12, 2023, 12:00 pm 1 నిమి చదవండి
    నోయిడాలో తయారు చేస్తున్న ఆ రెండు దగ్గు సిరప్‌లను పిల్లలకు ఉపయోగించొద్దు : డబ్ల్యూహెచ్‌ఓ
    'మారియన్ బయోటెక్' దగ్గు సిరప్‌లను ఉపయోగించొద్దు డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సు

    నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన రెండు దగ్గు సిరప్‌లను పిల్లలకు ఉపయోగించొద్దని ఉజ్బెకిస్థాన్‌ ప్రభుత్వానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సిఫార్సు చేసింది. మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన అంబ్రోనాల్, డాక్-1 దగ్గు సిరప్‌లలో నాణ్యతా ప్రమాణాలు లోపించాయని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. భద్రత విషయంలో కూడా మారియన్ బయోటెక్ కంపెనీ విఫలమైనట్లు చెప్పింది. స్పెసిఫికేషన్స్ విషయంలో కూడా తమ అంచనాలను అందుకోలేదని వివరించింది. అంబ్రోనాల్, డాక్-1 దగ్గు సిరప్‌ నమూనాలను ఉజ్బెకిస్తాన్ జాతీయ నాణ్యత నియంత్రణ ప్రయోగశాలలో పరీక్షించగా.. ఆ రెండింటిలోనూ ఆమోదయోగ్యం కాని మొత్తంలో డైథైలీన్ గ్లైకాల్ లేదా ఇథిలీన్ గ్లైకాల్ కలుషితాలు ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేసింది.

    ఆ సిరప్‌లతో పిల్లల ప్రాణాలకు ముప్పు ఉంటుందని హెచ్చరిక

    మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన అంబ్రోనాల్, డాక్-1 దగ్గు సిరప్‌లకు కొన్ని దేశాల్లో మార్కెంటింగ్ ఉండవచ్చని, అక్కడి నుంచి ఉజ్బెకిస్థాన్‌‌తో పాటు ఇతర ప్రాంతాలకు అనధికారిక మార్కెట్ల ద్వారా పంపిణీ చేయబడి ఉండొచ్చని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. అయితే ఈ నాసిరకం ఉత్పత్తుల వాడకం సురక్షిత కాదని, ముఖ్యంగా పిల్లల్లో ఇవి తీవ్రమైన అనారోగ్యానికి, మరణానికి దారితీయొచ్చని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది. అంబ్రోనాల్, డాక్-1 దగ్గు సిరప్‌లు తాగి ఉజ్బెకిస్థాన్‌లో 18మంది చనిపోయారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఆ దేశ ప్రభుత్వం భారత్‌ను సంప్రదించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఈ ఘటనపై సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ విచారణ జరుపుతున్నట్లు.. ఇప్పటికే దగ్గు సిరప్ తయారీని నిలిపివేసినట్లు భారత్ తెలిపింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    ప్రపంచ ఆరోగ్య సంస్థ
    ఉజ్బెకిస్తాన్

    తాజా

    ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం; టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం ఎమ్మెల్సీ
    మారుతీ సుజుకి ఏప్రిల్ నుంచి మోడల్ రేంజ్ ధరలను పెంచనుంది ఆటో మొబైల్
    ఉబర్ యాప్ లో తప్పులు కనిపెట్టి 4.6లక్షలు రివార్డు అందుకున్న ఆనంద్ ప్రకాష్ జీవనశైలి
    భారత్ 6G విజన్: భారతదేశంలో త్వరలోనే 6G రానుంది టెక్నాలజీ

    ప్రపంచ ఆరోగ్య సంస్థ

    యాంటీబయాటిక్ మందులతో లైంగికంగా సంక్రమించే జబ్బులను నిరోధించచ్చు టెక్నాలజీ
    కరోనా గురించి ఎవరెవరికి ఏం తెలుసో తెలియజేయండి; ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్‌ఓ పిలుపు అమెరికా
    ఎబోలాను పోలిన వైరస్: ఈక్వటోరియల్ గినియాలో 9మంది మృతి; డబ్ల్యూహెచ్‌ఓ అలర్ట్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్/ సీఏఆర్
    కలుషిత మందులపై తక్షణమే చర్యలు తీసుకోండి: డబ్ల్యూహెచ్ఓ ఇండోనేషియా

    ఉజ్బెకిస్తాన్

    బాంబు బెదిరింపు: రష్యా నుంచి గోవా వస్తున్న విమానం ఉజ్బెకిస్థాన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ విమానం
    'ఆ దగ్గు సిరప్ తయారీని నిలిపేశాం'.. ఉజ్బెకిస్తాన్‌‌లో పిల్లల మరణాలపై స్పందించిన కేంద్రం భారతదేశం

    అంతర్జాతీయం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    World Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023