NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / నోయిడాలో తయారు చేస్తున్న ఆ రెండు దగ్గు సిరప్‌లను పిల్లలకు ఉపయోగించొద్దు : డబ్ల్యూహెచ్‌ఓ
    తదుపరి వార్తా కథనం
    నోయిడాలో తయారు చేస్తున్న ఆ రెండు దగ్గు సిరప్‌లను పిల్లలకు ఉపయోగించొద్దు : డబ్ల్యూహెచ్‌ఓ
    'మారియన్ బయోటెక్' దగ్గు సిరప్‌లను ఉపయోగించొద్దు డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సు

    నోయిడాలో తయారు చేస్తున్న ఆ రెండు దగ్గు సిరప్‌లను పిల్లలకు ఉపయోగించొద్దు : డబ్ల్యూహెచ్‌ఓ

    వ్రాసిన వారు Stalin
    Jan 12, 2023
    12:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన రెండు దగ్గు సిరప్‌లను పిల్లలకు ఉపయోగించొద్దని ఉజ్బెకిస్థాన్‌ ప్రభుత్వానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సిఫార్సు చేసింది.

    మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన అంబ్రోనాల్, డాక్-1 దగ్గు సిరప్‌లలో నాణ్యతా ప్రమాణాలు లోపించాయని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. భద్రత విషయంలో కూడా మారియన్ బయోటెక్ కంపెనీ విఫలమైనట్లు చెప్పింది. స్పెసిఫికేషన్స్ విషయంలో కూడా తమ అంచనాలను అందుకోలేదని వివరించింది.

    అంబ్రోనాల్, డాక్-1 దగ్గు సిరప్‌ నమూనాలను ఉజ్బెకిస్తాన్ జాతీయ నాణ్యత నియంత్రణ ప్రయోగశాలలో పరీక్షించగా.. ఆ రెండింటిలోనూ ఆమోదయోగ్యం కాని మొత్తంలో డైథైలీన్ గ్లైకాల్ లేదా ఇథిలీన్ గ్లైకాల్ కలుషితాలు ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేసింది.

    డబ్ల్యూహెచ్‌ఓ

    ఆ సిరప్‌లతో పిల్లల ప్రాణాలకు ముప్పు ఉంటుందని హెచ్చరిక

    మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన అంబ్రోనాల్, డాక్-1 దగ్గు సిరప్‌లకు కొన్ని దేశాల్లో మార్కెంటింగ్ ఉండవచ్చని, అక్కడి నుంచి ఉజ్బెకిస్థాన్‌‌తో పాటు ఇతర ప్రాంతాలకు అనధికారిక మార్కెట్ల ద్వారా పంపిణీ చేయబడి ఉండొచ్చని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.

    అయితే ఈ నాసిరకం ఉత్పత్తుల వాడకం సురక్షిత కాదని, ముఖ్యంగా పిల్లల్లో ఇవి తీవ్రమైన అనారోగ్యానికి, మరణానికి దారితీయొచ్చని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది.

    అంబ్రోనాల్, డాక్-1 దగ్గు సిరప్‌లు తాగి ఉజ్బెకిస్థాన్‌లో 18మంది చనిపోయారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఆ దేశ ప్రభుత్వం భారత్‌ను సంప్రదించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఈ ఘటనపై సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ విచారణ జరుపుతున్నట్లు.. ఇప్పటికే దగ్గు సిరప్ తయారీని నిలిపివేసినట్లు భారత్ తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉజ్బెకిస్తాన్
    ప్రపంచ ఆరోగ్య సంస్థ

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    ఉజ్బెకిస్తాన్

    'ఆ దగ్గు సిరప్ తయారీని నిలిపేశాం'.. ఉజ్బెకిస్తాన్‌‌లో పిల్లల మరణాలపై స్పందించిన కేంద్రం భారతదేశం

    ప్రపంచ ఆరోగ్య సంస్థ

    హెటిరో కరోనా ఔషధం 'నిర్మాకామ్'కు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం కోవిడ్
    చైనాపై పెరుగుతున్న ఆంక్షలు.. మరణాలపై తాజా డేటా ఇవ్వాలని కోరిన డబ్ల్యూహెచ్ఓ చైనా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025