LOADING...
Toll gates: సంక్రాంతికి ఇంటికెళ్లే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. టోల్‌గేట్ల వద్ద నో బ్రేక్‌ విధానం!
సంక్రాంతికి ఇంటికెళ్లే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. టోల్‌గేట్ల వద్ద నో బ్రేక్‌ విధానం!

Toll gates: సంక్రాంతికి ఇంటికెళ్లే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. టోల్‌గేట్ల వద్ద నో బ్రేక్‌ విధానం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 05, 2026
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

సంక్రాంతి పండుగ సమయం దగ్గరపడుతున్న వేళ, ఇంటికెళ్లే ప్రయాణికులతో తెలుగు రాష్ట్రాల్లోని టోల్‌గేట్లు ఏటా కిక్కిరిసి కనిపించడం పరిపాటిగా మారింది. వాహనాల రద్దీ అధికంగా ఉండటంతో టోల్‌గేట్ల వద్ద క్లియరెన్స్‌ రావడానికి గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనివల్ల ప్రతేడాది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్‌లో దీర్ఘకాలం వెయిట్‌ చేయలేక ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్‌ నుంచి తెలంగాణలోని ఇతర జిల్లాలకు, అలాగే ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద సంఖ్యలో వాహనాలు బయల్దేరుతుంటాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ రద్దీ మరింత పెరిగే అవకాశాలు ఉండటంతో సమస్యకు చెక్‌ పెట్టేందుకు హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (HGCL) కీలక నిర్ణయం తీసుకుంది.

Details

బూస్టర్‌ లైన్ల ఏర్పాటు

టోల్‌గేట్ల వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు 'బూస్టర్‌ లైన్ల' విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. సంక్రాంతికి వేల సంఖ్యలో వాహనాలు ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై రాకపోకలు సాగించనున్న నేపథ్యంలో అక్కడి టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్‌ తీవ్రంగా ఏర్పడే అవకాశం ఉంది. దీనిని నివారించేందుకు టోల్‌ప్లాజాల వద్ద బూస్టర్‌ లైన్లను ప్రవేశపెట్టాలని హెచ్‌జీసీఎల్‌ నిర్ణయించింది. ఈ లైన్లను శంషాబాద్‌, బొంగలూరు, పెద్ద అంబర్‌పేట టోల్‌ప్లాజాల వద్ద ఏర్పాటు చేయనున్నారు. బూస్టర్‌ బారియర్ల ద్వారా ఫాస్టాగ్‌ ఉన్న వాహనాలు ఇక టోల్‌ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా నేరుగా వెళ్లే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ప్రతి టోల్‌ప్లాజా వద్ద రెండు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయనున్నారు.

Details

టోల్‌ప్లాజాల్లో 12 నుంచి 15 టోల్‌ బూత్‌లు

వీటి ద్వారా వాహనాలు ఆగకుండా వేగంగా ముందుకు సాగవచ్చు. ప్రస్తుతం ఆయా టోల్‌ప్లాజాల్లో 12 నుంచి 15 టోల్‌ బూత్‌లు ఉన్నప్పటికీ, పండుగ రద్దీ సమయంలో అవి సరిపోవడం లేదని అధికారులు చెబుతున్నారు. అందుకే ఈ బూస్టర్‌ బారియర్లను పైలట్‌ ప్రాజెక్ట్‌గా అమలు చేయాలని భావిస్తున్నారు.

Advertisement

Details

టోల్‌ ఫ్రీపై ఆశలు

మరోవైపు సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటికెళ్లే వాహనదారుల నుంచి టోల్‌ ఫీజు వసూలు చేయకుండా ఉచితంగా అనుమతించాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రానికి లేఖలు రాశాయి. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విషయమై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి లేఖ పంపారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేష్ కూడా టోల్‌ ఫీజు మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. జనవరి 9 నుంచి 18 వరకు టోల్‌ ఫీజు వసూలు చేయకుండా అనుమతించాలన్న ప్రతిపాదనపై కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని సమాచారం. ఇది అమలైతే సంక్రాంతి పండుగకు ఇంటికెళ్లే ప్రయాణికులకు భారీ ఊరట లభించనుంది.

Advertisement

Details

వాహనదారులకు ఉపశమనం

సాధారణంగా టోల్‌ ఫీజు చెల్లించేందుకు టోల్‌గేట్ల వద్ద గంటల పాటు ఆగాల్సి వస్తుండటంతో ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడుతుంటాయి. అదే టోల్‌ ఫీజు మినహాయింపు లభిస్తే వాహనాలు ఆగకుండా ముందుకు సాగగలవు. దీని వల్ల ట్రాఫిక్‌ రద్దీ గణనీయంగా తగ్గి, వాహనదారులకు ఉపశమనం కలిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

Advertisement