NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / Penalties on Carmakers:ఉద్గార ఉల్లంఘనపై హ్యుందాయ్, మహీంద్రా, కియా కంపెనీలకు రూ.7,300 కోట్ల జరిమానా
    తదుపరి వార్తా కథనం
    Penalties on Carmakers:ఉద్గార ఉల్లంఘనపై హ్యుందాయ్, మహీంద్రా, కియా కంపెనీలకు రూ.7,300 కోట్ల జరిమానా
    ఉద్గార ఉల్లంఘనపై హ్యుందాయ్, మహీంద్రా, కియా కంపెనీలకు రూ.7,300 కోట్ల జరిమానా

    Penalties on Carmakers:ఉద్గార ఉల్లంఘనపై హ్యుందాయ్, మహీంద్రా, కియా కంపెనీలకు రూ.7,300 కోట్ల జరిమానా

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 28, 2024
    12:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రముఖ ఆటోమొబైల్‌ తయారీ సంస్థలు హ్యుందాయ్‌, మహీంద్రా, కియా సహా 8 కంపెనీలకు కేంద్రం భారీ జరిమానా విధించే అవకాశం ఉందని సమాచారం.

    ఈ సంస్థలపై దాదాపు రూ.7,300 కోట్ల పెనాల్టీ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థల వాహనాల్లో ఉద్గారాలు అధికంగా ఉండటమే దీనికి ప్రధాన కారణంగా చెప్పబడుతోంది. ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

    2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ తన నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది.

    ఇందులో భాగంగా, కార్ల కంపెనీలు విక్రయించే ప్రతి యూనిట్‌కు 100 కిలోమీటర్ల ప్రయాణానికి 4.78 లీటర్ల ఇంధన వినియోగం, కర్బన ఉద్గారాలు కిలోమీటరుకు 113 గ్రాముల పైగా ఉండరాదని ఆదేశాలు ఇచ్చింది.

    వివరాలు 

    నిబంధనలను ఉల్లంఘించిన 8 ఆటోమొబైల్‌ కంపెనీలు  

    అయితే, ఆ ఆర్థిక సంవత్సరంలో 8 ఆటోమొబైల్‌ కంపెనీలు ఈ నిబంధనలను ఉల్లంఘించాయని కేంద్రం గుర్తించింది. దీంతో, ఈ సంస్థలపై పెనాల్టీ విధించే అవకాశం ఉంది.

    ప్రభుత్వ అంచనాల ప్రకారం, ఈ 8 సంస్థలకు మొత్తం రూ.7,290.8 కోట్ల జరిమానా పడే అవకాశముందని తెలుస్తోంది.

    ఇందులో అత్యధికంగా హ్యుందాయ్‌కు రూ.2,837.8 కోట్ల జరిమానా, మహీంద్రాకు రూ.1,788.4 కోట్ల జరిమానా, కియాకు రూ.1,346.2 కోట్ల జరిమానా విధించనున్నట్లు సమాచారం.

    వివరాలు 

    ఆటో పరిశ్రమ, కేంద్రం మధ్య చర్చలు

    ఇతర సంస్థలకు కూడా జరిమానా విధించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. హోండాకు రూ.457.7 కోట్ల, రెనాల్ట్‌కు రూ.438.3 కోట్ల, స్కోడాకు రూ.248.3 కోట్ల, నిస్సాన్‌కు రూ.172.3 కోట్ల, ఫోర్స్ మోటార్‌కు రూ.1.8 కోట్ల జరిమానా విధించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.

    అయితే, ఈ చర్యలు, నిబంధనలను అమలు చేయడంపై ఆటో పరిశ్రమ, కేంద్రం మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

    2023 జనవరి 1 నుండి కొత్త నిబంధనలు కఠినంగా అమలు అవుతున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఆటో మొబైల్

    First Flying Car: ఎగిరే కారులో మొదటి ప్రయాణీకుడు ఇతనే..ఎగిరే కారు గరిష్ట వేగం 189 కి.మీ ఆటోమొబైల్స్
    Tourbillon: బుగట్టి మొట్టమొదటి సరికొత్త కారు టూర్‌బిల్లాన్‌ ఆవిష్కరణ  ఆటోమొబైల్స్
    Lexus : 600hpతో త్వరలో రానున్న లెక్సస్ V8-ఇంజిన్ స్పోర్ట్స్‌కార్‌  ఆటోమొబైల్స్
    TVS Apache : గంటకు 200కిమీల వేగంతో రయ్ రయ్ మంటోన్న Apache RTE   ఆటోమొబైల్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025