Page Loader
భారతదేశంలో 23,500 బుకింగ్‌లను దాటిన మారుతీ-సుజుకి Jimny
ఈ సెగ్మెంట్ లో మహీంద్రా థార్ తో పోటీపడుతుంది

భారతదేశంలో 23,500 బుకింగ్‌లను దాటిన మారుతీ-సుజుకి Jimny

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 24, 2023
03:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆటో ఎక్స్‌పో 2023లో ఆవిష్కరించినప్పటి నుండి మారుతి సుజుకి Jimnyకు 23,500 బుకింగ్‌లు వచ్చాయి, అయితే ఈ భారీ బుకింగ్స్ తో రాబోయే SUV ఈ సెగ్మెంట్ లో తనతో పోటీ పడుతున్న మహీంద్రా థార్‌ను దాటేలా ఉంది. భారతదేశంలో లైఫ్‌స్టైల్ SUV సెగ్మెంట్ లో కొత్త మహీంద్రా థార్ వినియోగదారులను బాగా ఆకర్షించింది., మారుతి సుజుకి జనవరిలో భారతదేశంలో Jimny మోడల్‌ను ప్రకటించినప్పటి నుండి పరిస్థితులు నెమ్మదిగా మారడం ప్రారంభించాయి. మహీంద్రా థార్ నాలుగు-సీట్ల (2+2) లేఅవుట్‌తో వస్తే మారుతీ-సుజుకి Jimny ఐదు-సీట్ల క్యాబిన్‌తో వస్తుంది.

కార్

ప్రయాణికుల భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి

.ఆల్-బ్లాక్ డ్యాష్‌బోర్డ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, కనెక్ట్ అయిన కార్ టెక్నాలజీ, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో ఉన్న 9.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్‌తో వస్తుంది. ప్రయాణికుల భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. మారుతి సుజుకి Jimny 1.5-లీటర్, ఇన్‌లైన్-ఫోర్, K-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది "AllGrip" ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. మారుతి సుజుకి భారతదేశంలో జిమ్నీ ధర, ఇతర వివరాలను ఇంకా ప్రకటించలేదు. మరో నాలుగు నెలల తర్వాత Jimny విడుదల అవుతుంది. అప్పుడు మహీంద్రా థార్ కు మరింత పోటీని ఇచ్చే అవకాశం ఉంది.