NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / Satellite based toll:మే 1 నుంచి ఉపగ్రహ ఆధారిత టోలింగ్ వ్యవస్థ అమలుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ! 
    తదుపరి వార్తా కథనం
    Satellite based toll:మే 1 నుంచి ఉపగ్రహ ఆధారిత టోలింగ్ వ్యవస్థ అమలుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ! 
    మే 1 నుంచి ఉపగ్రహ ఆధారిత టోలింగ్ వ్యవస్థ అమలుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ!

    Satellite based toll:మే 1 నుంచి ఉపగ్రహ ఆధారిత టోలింగ్ వ్యవస్థ అమలుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ! 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 18, 2025
    03:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశవ్యాప్తంగా శాటిలైట్ ఆధారిత టోల్ విధానాన్నిమే 1వ తేదీ నుంచి అమలు చేయనున్నట్టు కొన్ని మీడియా సంస్థలు ప్రచురించిన వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

    ఈ విధానాన్ని మే 1నుంచి అమలు చేయాలన్నఅంశంపై ఇప్పటికీ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని కేంద్ర రవాణా,జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

    శుక్రవారం ఈ మేరకు అధికారికంగా ఒక ప్రకటనను విడుదల చేసింది.

    ఆప్రకటన ప్రకారం,వాహనాల నుంచి టోల్ వసూలు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు, టోల్‌ప్లాజాల వద్ద వాహనాలను ఆపాల్సిన అవసరం లేకుండా,ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR)టెక్నాలజీని ప్రయోగాత్మకంగా కొన్ని ఎంపిక చేసిన టోల్ ప్లాజాల వద్ద అమలు చేయనున్నారు.

    ఈవిధానంలో ఫాస్టాగ్ వ్యవస్థతోపాటు ANPR కెమెరాల సాంకేతికతను సమిష్టిగా ఉపయోగిస్తారు.

    వివరాలు 

    నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు ఈ-నోటీసులు

    వాహనాల నంబర్ ప్లేట్లను ANPR కెమెరాలు స్కాన్ చేసి గుర్తిస్తాయి.

    అనంతరం, వాహనాలు ఆగకుండానే, ఫాస్టాగ్ ద్వారా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సాంకేతికత ఉపయోగించి టోల్ వసూలు చేస్తారు.

    ఈ ప్రక్రియలో నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు ఈ-నోటీసులు జారీ చేయడం జరుగుతుంది.

    అలాగే, అవసరమైతే వారి ఫాస్టాగ్‌ను రద్దు చేయడం, జరిమానాలు విధించడం వంటి చర్యలు తీసుకుంటారు.

    ఇంకా ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయాలన్న అంశంపై తుదినిర్ణయం తీసుకోలేదని, పరిశీలన దశలోనే ఉందని రవాణా శాఖ పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Motivation : ప్రయత్నం నీదైతే… గెలుపు కూడా నీదే! జీవితం
    Kiran Abbavaram: తండ్రైన మరో నటుడు .. మగబిడ్డకు జన్మనిచ్చిన రహస్య .. ఫొటో షేర్‌ చేసిన నటుడు కిరణ్ అబ్బవరం
    Bitcoin: దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. 1,11,000 డాలర్లకు బిట్‌కాయిన్‌ క్రిప్టో కరెన్సీ
    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్

    కేంద్ర ప్రభుత్వం

    #NewsBytesExplainer: ఉచితాలు vs అభివృద్ధి.. దిల్లీలో పరిస్థితి ఎలా ఉంది? దిల్లీ
    Jaishankar: ఉగ్రవాదమే ఆ దేశాన్ని తినేస్తోంది.. పాకిస్థాన్‌పై మరోసారి మండిపడ్డ జైశంకర్ విదేశాంగశాఖ
    Farmer Protest: నిరసన చేస్తున్న రైతులతో ఫిబ్రవరి 14న కేంద్రం చర్చలు భారతదేశం
    Grants: తెలంగాణకు కేంద్రం నుంచి నిధుల జాప్యం.. ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న రాష్ట్రం తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025