
Fact Check: ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు.. క్లారిటీ ఇచ్చిన నితిన్ గడ్కరీ
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకూ టోల్ ఫీజు వసూలు చేయనున్నట్లు కొన్ని వార్తాలలో వచ్చిన ప్రచారంపై కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. జూలై 15 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని ప్రచారంలో వున్న విషయానికి సంబంధించి ఏ మాత్రం నిజం లేదని స్పష్టంగా తెలిపారు. టూవీలర్లపై టోల్ వసూలు చేయాలన్న ఎలాంటి ఉద్దేశ్యమూ కేంద్ర ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు సమాచారం కొన్ని మీడియా సంస్థలు చల్లరించడాన్ని గడ్కరీ తప్పుబట్టారు. ద్విచక్ర వాహనాలపై టోల్ పన్ను విధించే విషయమై అవాస్తవాలు ప్రచారం చేయడం అనాగరికమని ఆయన విమర్శించారు.
వివరాలు
ప్రకటన విడుదల చేసిన NHAI
ప్రస్తుతం టూవీలర్లకు టోల్ ఫీజు నుండి ఇచ్చిన మినహాయింపే కొనసాగుతుందని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలియకపోయినా, తప్పుడు సమాచారం ప్రచారం చేయడం బాధ్యతలేని చర్య అని పేర్కొన్నారు. ఇదే విషయమై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కూడా ప్రకటన విడుదల చేసింది. టోల్ ఫీజు విధింపు గురించి ఎలాంటి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో పెట్టలేదని స్పష్టంగా ప్రకటించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
PIB ఫాక్ట్ చెక్ చేసిన ట్వీట్
🚨 Toll Charges for Two-Wheelers from July 15?
— PIB Fact Check (@PIBFactCheck) June 26, 2025
Here's the Truth! 🛵💸
Several social media posts claim that two-wheelers will have to pay tolls on highways starting July 15, 2025.#PIBFactCheck
❌This claim is #Fake
✅@NHAI_Official has made NO such announcement
🛣️There… pic.twitter.com/XFr4NtfxrZ