NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / చిరుధన్యాల పిండి ప్యాకెట్లపై 5శాతమే పన్ను.. భారీగా తగ్గించిన జీఎస్టీ కౌన్సిల్
    తదుపరి వార్తా కథనం
    చిరుధన్యాల పిండి ప్యాకెట్లపై 5శాతమే పన్ను.. భారీగా తగ్గించిన జీఎస్టీ కౌన్సిల్
    చిరుధన్యాల పిండి ప్యాకెట్లపై 5శాతం పన్ను.. జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం

    చిరుధన్యాల పిండి ప్యాకెట్లపై 5శాతమే పన్ను.. భారీగా తగ్గించిన జీఎస్టీ కౌన్సిల్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 08, 2023
    11:47 am

    ఈ వార్తాకథనం ఏంటి

    చిరుధాన్యల పిండిని ప్యాకెట్లలో, లేబుళ్లతో అమ్మితే 5శాతం జీఎస్టీ వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

    ఈ మేరకు జీఎస్టీ కౌన్సిల్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు.

    ఇక లూజుగా విక్రయించే 70శాతం త్రుణ ధాన్యాల పిండిపై ఎలాంటి పన్నులు ఉండవని ఆమె స్పష్టం చేశారు.

    అదే ప్యాకేజీ రూపంలో లేబుల్‌తో విక్రయించే పిండిపై మాత్రం 5శాతం పన్ను ఉంటుందని తెలిపారు.

    ఈ పిండి అమ్మకాలపై ఇంతకుముందున్న 18శాతం పన్ను ఉండేది. ఇప్పుడు 5శాతానికి తగ్గించారు. దీంతో ఇప్పుడు పన్నురేటు బాగా తగ్గడం గమనార్హం.

    Details

    నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జీఎస్టీ మండలి సమావేశం

    శనివారం నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జీఎస్‌టీ మండలి 52వ సమావేశం జరిగింది.

    జీఎస్‌టీ అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ ప్రెసిడెంట్‌కు గరిష్ఠ వయస్సు పరిమితిని 70 ఏళ్లుగాను, సభ్యులకు 67 ఏళ్లుగా ఉండాలని ఈ సమావేశంలో నిర్ధారించారు.

    మరోవైపు మొలాసిస్‌పై కూడా జీఎస్టీని 28శాతం నుంచి 5శాతానికి జీఎస్టీ మండలి తగ్గించింది.

    పరిశ్రమలు ఉపయోగించే ఆల్కహాల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకు రావాలని నిర్ణయించారు. ఇక మానవ అవసరాలకు వాడే ఆల్కహాల్‌కు మాత్రం జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఇచ్చారు.

    ఆన్ లైన్ గేమింగ్, కేసినోలకు పాత తేదీల నుంచి 28శాతం జీఎస్టీ చెల్లించాలంటూ కంపెనీలకు పన్ను నోటీసులు చెల్లించడంపై దిల్లీ, గోవా రాష్ట్రాలు అభ్యతరం వ్యక్తం చేశాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నిర్మలా సీతారామన్
    జీఎస్టీ

    తాజా

    Operation Sindoor: ఉగ్రవాదం నిర్మూలనకే 'ఆపరేషన్‌ సిందూర్‌' : భారత సైన్యం భారత సైన్యం
    INDw vs SLw: మహిళల ముక్కోణపు వన్డే టైటిల్ భారత్‌దే స్మృతి మంధాన
    operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్  ఆపరేషన్‌ సిందూర్‌
    HYD Metro: ప్రపంచానికి బ్లూప్రింట్‌గా హైదరాబాద్ మెట్రో.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రశంసలు! హైదరాబాద్

    నిర్మలా సీతారామన్

    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అస్వస్థత.. హుటాహుటిన ఎయిమ్స్‌లో చేరిక భారతదేశం
    'మేక్ ఇన్ ఇండియా" ఆశయాలు 2023 బడ్జెట్ తీరుస్తుందా? భారతదేశం
    బడ్జెట్ 2023: మధ్యతరగతి వర్గంపై కొత్త పన్నులు విధంచలేదు: ఆర్థిక మంత్రి ఆర్థిక శాఖ మంత్రి
    కొత్త విధానంతో ఆదాయపు పన్ను రేట్లను తగ్గించే ఆలోచనలో కేంద్రం ఫైనాన్స్

    జీఎస్టీ

    ద్రవ రూపంలో ఉండే బెల్లం, పెన్సిల్ షార్పనర్‌లపై పన్ను తగ్గించిన జిఎస్‌టి కౌన్సిల్ ఆర్థిక శాఖ మంత్రి
    Gaming Industry: 28శాతం జీఎస్టీ నిర్ణయం, భారత ఆన్‌లైన్ గేమింగ్‌ పరిశ్రమ నాశనాన్ని శాసిస్తుందా?  ఆన్‌లైన్ గేమింగ్
    జీఎస్టీ సవరణ బిల్లుకు లోక్‌సభ గ్రీన్ సిగ్నల్.. క్యాసినోపై 28 శాతం పన్ను బిజినెస్
    రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలు.. ఆగస్టు నెలలో ఎంత వసూలైందో తెలుసా ఆర్థిక సంవత్సరం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025