NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / 8th Pay Commission:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలక నిర్ణయం 
    తదుపరి వార్తా కథనం
    8th Pay Commission:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలక నిర్ణయం 
    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

    8th Pay Commission:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలక నిర్ణయం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 30, 2024
    04:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నరేంద్ర మోదీ ప్రభుత్వం త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించనున్నట్లు సమాచారం.

    8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి కీలకమైన దశ ప్రారంభం కానుందని సమాచారం అందుతోంది.

    ప్రతి పదేళ్లకోసారి వేతన సంఘం ఏర్పాటు చేస్తారు. ఈ సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, అలవెన్సులు, ఇతర సౌకర్యాలను సమీక్షిస్తుంది.

    అలాగే, కాలానుగుణంగా డీఏ పెంపుపై సిఫార్సులు చేస్తుంది. గతంలో 7వ వేతన సంఘం 2016 జనవరి 1న అమల్లోకి వచ్చింది, 2026 జనవరి 1న 8వ వేతన సంఘం అమలయ్యే అవకాశం ఉంది.

    ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడనప్పటికీ, అధికారుల సమాచారం మేరకు 8వ వేతన సంఘం ఏర్పాటుకు తొలి అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది.

    వివరాలు 

    8వ వేతన సంఘంలో ఫిట్మెంట్ పెంపు..

    ఉద్యోగ సంఘాలు కూడా కేంద్రాన్ని,8వ వేతన సంఘంపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.

    7వ వేతన సంఘంలో కనీస వేతనం 7,000 నుంచి 18,000 రూపాయలకు పెరిగింది.అలాగే,కనీస పెన్షన్ 3,500 రూపాయల నుంచి 9,000 రూపాయలకు పెరిగింది.

    గరిష్ట వేతనం 2.5 లక్షలు కాగా, గరిష్ట పెన్షన్ 1.25 లక్షలుగా నిర్ణయించారు.ఉద్యోగులు 8వ వేతన సంఘంలో ఫిట్మెంట్ పెంపును,అలాగే పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకుని వేతనాలు పెంచాలని కోరుతున్నారు.

    కేంద్ర సహాయ ఆర్థిక మంత్రి పంకజ్ చౌదరి,రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో, వేతన సంఘంపై నిర్ణయం ఇంకా తీసుకోలేదని,త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిపారు.

    2014లో 7వ వేతన సంఘం సమీక్షించినట్టు, 2024లో 8వ వేతన సంఘం ఏర్పాటుకు అవకాశం ఉందని భావిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Vande Bharat: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    Miss World 2025: నేటి నుంచి మిస్‌ వరల్డ్‌ కాంటినెంటల్‌ ఫినాలే తెలంగాణ
    Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై కీలక సమాచారం.. నేరుగా లబ్దిదారుల ఆకౌంట్లలోకి నిధులు తెలంగాణ
    Stock Market: స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు  స్టాక్ మార్కెట్

    కేంద్ర ప్రభుత్వం

    Goldy Brar: గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం  ఖలిస్థానీ
    Truck, bus drivers protest : దేశవ్యాప్తంగా డ్రైవర్లు సమ్మె.. హైవేలు దిగ్బంధనం.. పెట్రోల్ బంకులకు పోటెత్తిన జనం  మధ్యప్రదేశ్
    Hit And Run Law : హిట్ రన్ నిబంధనపై కేంద్ర కీలక నిర్ణయం.. ముగిసిన ట్రక్కర్ల ఆందోళన ఇండియా
    ఫార్మా కంపెనీలకు కొత్త ప్రమాణాలను నిర్దేశించిన కేంద్రం  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025