NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Cognizant: దిగ్గజ ఐటీ కంపెనీలో కీలక మార్పు.. పదవీ విరమణ వయస్సు పెంచుతూ ఉత్తర్వులు!
    తదుపరి వార్తా కథనం
    Cognizant: దిగ్గజ ఐటీ కంపెనీలో కీలక మార్పు.. పదవీ విరమణ వయస్సు పెంచుతూ ఉత్తర్వులు!
    దిగ్గజ ఐటీ కంపెనీలో కీలక మార్పు.. పదవీ విరమణ వయస్సు పెంచుతూ ఉత్తర్వులు!

    Cognizant: దిగ్గజ ఐటీ కంపెనీలో కీలక మార్పు.. పదవీ విరమణ వయస్సు పెంచుతూ ఉత్తర్వులు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 11, 2025
    05:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతున్నట్లు స్పష్టం చేసింది.

    ప్రస్తుతం ఉన్న 58 సంవత్సరాల వయసును 60కి పెంచింది. ఈ విషయాన్ని కంపెనీ ఉద్యోగులకు అంతర్గత మెమో ద్వారా తెలియజేసినట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

    ఈ నిర్ణయం భారత్‌లోని అన్ని కాగ్నిజెంట్‌ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వర్తిస్తుందని సమాచారం. ఐటీ రంగంలో అనేక సంస్థలు తమ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్లుగా కొనసాగిస్తున్నాయి.

    అయితే కాగ్నిజెంట్‌ ఈ వయస్సును 60కి పెంచుతూ, అనుభవజ్ఞులైన నిపుణుల సేవలను మరింత సద్వినియోగం చేసుకోవడం కోసం ఈ మార్పు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

    Details

    కాగ్నిజెంట్‌లో 2.50 లక్షలమంది ఉద్యోగులు

    గ్లోబల్‌ టెక్నాలజీ ల్యాండ్‌స్కేప్‌లో భారత్‌ ప్రాధాన్యత పెరుగుతున్న విషయంపై కాగ్నిజెంట్‌ సీఈఓ రవి కుమార్‌ వ్యాఖ్యానించారు.

    'కాగ్నిజెంట్‌కు భారత్‌లో 2.50 లక్షల మంది ఉద్యోగులన్నారని, మునుపటి వరకు కాగ్నిజెంట్‌ కార్యాలయాలు పెద్ద నగరాల్లోనే ఉండేవన్నారు. ఇప్పుడు చిన్న పట్టణాలకూ కూడా విస్తరిస్తున్నామన్నారు.

    ఇందౌర్‌లో కూడా కార్యాలయం ప్రారంభించామని, భారత్‌ కంపెనీ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. రాబోయే దశాబ్దంలో భారత్‌ ప్రపంచ సాంకేతిక కేంద్రంగా మారనుందని రవి కుమార్‌ అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాగ్నిజెంట్

    తాజా

    Earthquake: గ్రీస్‌లోని రోడ్స్ సమీపంలో 6.2 తీవ్రతతో భూకంపం.. టర్కీ, ఈజిప్ట్, సిరియాలో ప్రకంపనలు  భూకంపం
    China-US: యూఎస్ చైనా వాణిజ్య యుద్ధం.. వారం చివర్లో ట్రంప్, జిన్ పింగ్ చర్చలు.. అమెరికా
    Waqf Act: ఆరు నెలల్లో వక్ఫ్ ఆస్తుల నమోదు పూర్తి చేయాలి: కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం
    Amaravati : రాజధాని అమరావతి రెండోదశ ప్రాజెక్టు కోసం 40-45 వేల ఎకరాలు భూసమీకరణ.. మంత్రి నారాయణ వెల్లడి  అమరావతి

    కాగ్నిజెంట్

    Cognizant: రిటర్న్-టు-ఆఫీస్ ఆదేశాలను ధిక్కరించినందుకు ఉద్యోగులకు దిగ్గజ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025