NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Accenture: ఐటీ సంస్థలకు మంచి రోజులు..! ఆదాయ అంచనాలు పెంచిన యాక్సెంచర్‌
    తదుపరి వార్తా కథనం
    Accenture: ఐటీ సంస్థలకు మంచి రోజులు..! ఆదాయ అంచనాలు పెంచిన యాక్సెంచర్‌
    ఐటీ సంస్థలకు మంచి రోజులు..! ఆదాయ అంచనాలు పెంచిన యాక్సెంచర్‌

    Accenture: ఐటీ సంస్థలకు మంచి రోజులు..! ఆదాయ అంచనాలు పెంచిన యాక్సెంచర్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 27, 2024
    09:29 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కొత్త ప్రాజెక్టులు తగ్గుముఖం పట్టడంతో లాభాలు తగ్గి, ఉద్యోగుల సంఖ్యలో కోత విధించిన ఐటీ సంస్థలకు, మంచి రోజులు తిరిగి వచ్చే సూచనలు కనబడుతున్నాయి.

    అమెరికాలో వడ్డీరేట్లు తగ్గటంతో, వ్యాపార సంస్థలు ఐటీకి ఖర్చు చేయడం పెరుగుతుందని భావిస్తున్న అంచనాలు నిజం అవుతాయని అంచనా వేస్తున్నారు.

    ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ సేవలలో అతిపెద్ద సంస్థ అయిన యాక్సెంచర్‌ 2025 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి అంచనాను 3-6 శాతంగా ప్రకటించడం దీనికి సంకేతం.

    2024 ఆర్థిక సంవత్సరానికి 1.5-2.5 శాతం ఆదాయ వృద్ధిని అంచనా వేసినా, కేవలం 1 శాతం మాత్రమే వృద్ధి సాధించింది.

    నాస్‌డాక్‌లో నమోదైన యాక్సెంచర్‌ సెప్టెంబర్-ఆగస్టు ఆర్థిక సంవత్సరాన్ని అనుసరిస్తుంది.

    వివరాలు 

    పరిశ్రమ అంచనాలను మించి ఆదాయాన్నిసాధించిన కాగ్నిజెంట్‌

    నాస్‌డాక్‌లో ఉన్న మరో సంస్థ, కాగ్నిజెంట్‌ టెక్నాలజీస్‌ కూడా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పరిశ్రమ అంచనాలను మించి ఆదాయాన్ని సాధించడం గమనార్హం.

    2024 చివరి త్రైమాసికంలో యాక్సెంచర్‌ తన ఆదాయ అంచనాను 16.38 బిలియన్ డాలర్లుగా పెట్టగా, 16.41 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని సాధించింది.

    2025 ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికానికి 16.85-17.45 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని అంచనా వేసింది.

    సంస్థ ఇతర సంస్థల కొనుగోలుకు 3 బిలియన్‌ డాలర్లు వెచ్చిస్తుందని చెప్పింది, ఇది 2024 ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసిన మొత్తం కంటే సగం తక్కువ.

    అదనంగా, 4 బిలియన్‌ డాలర్లతో షేర్‌ బైబ్యాక్‌ పథకాన్ని ప్రకటించింది.

    వివరాలు 

    జెనరేటివ్‌ ఏఐ ఆధారిత కొత్త ప్రాజెక్టుల విలువ 1 బిలియన్‌ డాలర్లు

    ఏఐ ప్రాజెక్టులు: 2024లో యాక్సెంచర్‌ 81.2 బిలియన్‌ డాలర్ల ప్రాజెక్టులను సాధించింది.

    వీటిలో జెనరేటివ్‌ ఏఐ ఆధారిత కొత్త ప్రాజెక్టుల విలువ 1 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇప్పటివరకు టీసీఎస్ మాత్రమే ఏఐ ప్రాజెక్టుల ద్వారా ఆదాయం సంపాదించినట్లు తెలిపింది.

    దేశీయ ఐటీ కంపెనీల ఫలితాలు కూడా ఈ బాటలోనే ఉన్నాయి. యాక్సెంచర్‌ ఫలితాలు భారతీయ ఐటీ రంగానికి సంకేతాలుగా పరిగణించబడతాయి, దాంతో భారతీయ ఐటీ కంపెనీల ఫలితాలు మంచి స్థాయిలో ఉంటాయనే ఆశలు ఉన్నాయి.

    జులై-సెప్టెంబర్ ఆర్థిక ఫలితాల సీజన్‌ అక్టోబరు 10న టీసీఎస్‌ ఫలితాలతో ప్రారంభం కానుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Operation Sindoor: 'మా యుద్ధవిమానం నేలకూలింది'.. పాకిస్థాన్  పాకిస్థాన్
    Operation Sindoor: ఉగ్రవాదం నిర్మూలనకే 'ఆపరేషన్‌ సిందూర్‌' : భారత సైన్యం భారత సైన్యం
    INDw vs SLw: మహిళల ముక్కోణపు వన్డే టైటిల్ భారత్‌దే స్మృతి మంధాన
    operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్  ఆపరేషన్‌ సిందూర్‌
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025