NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / మైక్రోసాఫ్ట్‌లో మరోసారి భారీ తొలగింపులు.. కొనసాగుతున్న లేఆఫ్‌ ప్రక్రియ
    తదుపరి వార్తా కథనం
    మైక్రోసాఫ్ట్‌లో మరోసారి భారీ తొలగింపులు.. కొనసాగుతున్న లేఆఫ్‌ ప్రక్రియ
    మైక్రోసాఫ్ట్‌లో మరోసారి భారీ తొలగింపులు.. కొనసాగుతున్న లేఆఫ్ ప్రక్రియ

    మైక్రోసాఫ్ట్‌లో మరోసారి భారీ తొలగింపులు.. కొనసాగుతున్న లేఆఫ్‌ ప్రక్రియ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 11, 2023
    01:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మేరకు ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ మరోసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించింది.

    ఈ ఏడాది జనవరిలో దాదాపు 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తామన్న టెకీ సంస్థ, వాటికి అదనంగా తాజాగా మరిన్ని కోతలు పెట్టింది.

    2023- 2024 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తొలివారం నుంచే తొలగింపు ప్రక్రియ ప్రారంభమైనట్లు టెక్‌ దిగ్గజం స్పష్టం చేసింది.

    అమెరికాలోని వాషింగ్టన్‌ కార్యాలయంలో ఉన్న ఉద్యోగుల్లో 276 మందిని తీసేసి భారం తగ్గించుకుంది. అందులో 66 మంది వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో పని చేస్తున్నవారు ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ వెల్లడించింది.

    ఉద్యోగాలు కోల్పోయిన వారిలో సేల్స్‌, కస్టమర్‌ సక్సెస్‌ రిప్రజెంటేటివ్స్‌ ఉన్నారు.

    DETAILS

    ఖర్చులను తగ్గించుకునేందుకే లేఆఫ్‌లు తెచ్చాం : మైక్రోసాఫ్ట్‌

    ఈ క్రమంలోనే సదరు ఉద్యోగలు తాము కొలువులు కోల్పోయినట్లు సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు. క్లౌడ్ కంప్యూటింగ్ బిల్లులో ఖర్చులను తగ్గించుకునేందుకే లేఆఫ్‌లు తెచ్చామని మైక్రోసాఫ్ట్‌ స్పష్టం చేసింది.

    రాబోయే కాలంలో ఉద్యోగుల తొలగింపులు భారీగా ఉంటాయని సంస్థ ప్రకటించింది. అయితే ఆ సంఖ్యను వెల్లడించేందుకు సముఖత చూపించలేదు. సంస్థాగత, శ్రామిక సర్దుబాట్లు తమ వ్యాపార నిర్వహణలో సాధారణమేనని తెలిపింది.

    తమ సంస్థ భవిష్యత్తు కోసం కస్టమర్లకు మద్దతుగా వ్యూహాత్మక వృద్ధి రంగాలకు ప్రాధాన్యమిస్తామని సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు.

    ప్రపంచ ఆర్థిక అస్థిరతలు, మాంద్యంతో కంపెనీలన్నీ వ్యయ నియంత్రణ చర్యలను వేగం చేస్తున్నాయి. ఈ మేరకు అమెజాన్‌, గూగుల్‌, ట్విట్టర్ సహా ప్రముఖ టెక్‌ సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగాలపై కోత పెడుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా
    మైక్రోసాఫ్ట్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    అమెరికా

    అమెరికా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    టైటానిక్ శిథిలాలు చూసేందుకు వెళ్లిన టూరిస్ట్ జలాంతర్గామి గల్లంతు అంతర్జాతీయం
    వెజ్ వెరైటీలు, గ్రామీ విజేత వయోలిన్; ప్రధాని మోదీ కోసం వైట్‌హౌస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు నరేంద్ర మోదీ
    బైజూస్‌లో ఆగని ఉద్యోగాల కోత; మరో 1,000 మంది తొలగింపు  బైజూస్‌

    మైక్రోసాఫ్ట్

    సత్య నాదెళ్లను కలిసిన కేటీఆర్: బిజినెస్, హైదరాబాద్ బిర్యానీపై చర్చ సత్య నాదెళ్ల
    గూగుల్, మైక్రోసాఫ్ట్ సరసన చేరిన Spotify, 6% ఉద్యోగులు తొలగింపు వ్యాపారం
    10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో OpenAIతో ఒప్పందం కుదుర్చుకోనున్న మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    నాల్గవ త్రైమాసికంలో 12% తగ్గిన మైక్రో సాఫ్ట్ లాభం, ఆర్ధిక అనిశ్చితే కారణం ఆదాయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025