NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / iPhones: ఇక 2026 చివరి నాటికి భారతదేశంలోనే ఐఫోన్‌ల తయారీ..  
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    iPhones: ఇక 2026 చివరి నాటికి భారతదేశంలోనే ఐఫోన్‌ల తయారీ..  
    ఇక 2026 చివరి నాటికి భారతదేశంలోనే ఐఫోన్‌ల తయారీ..

    iPhones: ఇక 2026 చివరి నాటికి భారతదేశంలోనే ఐఫోన్‌ల తయారీ..  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 25, 2025
    03:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా-చైనా దేశాల మధ్య పరస్పర సుంకాల విధానాలు తీవ్ర రూపం దాల్చడంతో వాణిజ్య యుద్ధానికి దారి తెరిచాయి.

    ఈ పరిస్థితుల్లో టారిఫ్‌ లాంటి భారం నుంచి తప్పించుకునే దిశగా ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ (Apple) ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లుతోంది.

    ఇందుకోసం కంపెనీ ప్రస్తుతం అమెరికా మార్కెట్‌లో విక్రయించే ఐఫోన్ల (iPhone) తయారీని పూర్తిగా భారత్‌ (India)కి మారుస్తే ఎలా ఉంటుందన్న దిశగా పరిశీలన సాగిస్తోంది.

    విశ్వసనీయ వర్గాల ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం, పలు ప్రముఖ ఆంగ్ల వార్తా సంస్థలు ఈ విషయాన్ని నివేదికల రూపంలో వెలిబుచ్చాయి.

    వివరాలు 

    80 శాతం ఐఫోన్లు చైనాలోనే

    ఈ నివేదికల ప్రకారం,2026 నాటికి అమెరికాలో విక్రయించబడే అన్ని ఐఫోన్ల తయారీ భారత్‌ ఆధారంగా జరిగేలా యాపిల్‌ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

    ప్రస్తుతానికి అమెరికా వెలుపల తయారవుతున్నఐఫోన్లలో భారత్‌ వాటా సుమారు 14 శాతంగా ఉండగా, మిగిలిన భారీ భాగమైన దాదాపు 80 శాతం ఐఫోన్లు చైనాలోనే ఉత్పత్తి అవుతున్నాయి.

    అయితే తాజా సుంకాల నేపథ్యంలో యాపిల్‌ కంపెనీపై భారీ భారాలు పడే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

    ముఖ్యంగా చైనాలో తయారైన ఐఫోన్లను అమెరికాకు దిగుమతి చేసుకుంటే,కంపెనీకి 145 శాతం సుంకం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

    దీంతో చైనా,భారత్‌లో తయారయ్యే ఐఫోన్ల ధరల మధ్య అమెరికా మార్కెట్లో గణనీయమైన వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది.

    వివరాలు 

    అమెరికా మార్కెట్లో 'మేక్ ఇన్ ఇండియా' ఐఫోన్లు

    ఈ నేపథ్యంలో భారత్‌లోనే తయారీని పెంచడమే ఉత్తమ మార్గమని ఆపిల్ భావిస్తోంది.

    ఇది అమలైతే.. ఇక అమెరికా మార్కెట్లో 'మేక్ ఇన్ ఇండియా' ఐఫోన్లు ప్రధానంగా దర్శనమిస్తాయి.

    ఇక ఈ వాణిజ్య వివాదానికి బీజం పడినదే ట్రంప్‌ తొలిసారిగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలోనే.

    అప్పటినుండి చైనాపై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు అమెరికా చర్యలు ప్రారంభించింది.

    ఫలితంగా యాపిల్‌తోపాటు పలు బహుళజాతి సంస్థలు చైనాకు ప్రత్యామ్నాయంగా కొత్త తయారీ కేంద్రాలపై దృష్టి పెట్టాయి.

    వివరాలు 

     భారత్‌లో ఐఫోన్ల అసెంబ్లింగ్‌ 

    ఇదే సమయంలో భారత ప్రభుత్వం 2020లో మొబైల్‌ ఫోన్ల తయారీకి ఉత్సాహాన్ని కలిగించే విధంగా పలు ప్రోత్సాహక పథకాలను ప్రకటించింది.

    దీంతో యాపిల్‌ భారత్‌లో ఐఫోన్ల అసెంబ్లింగ్‌ ప్రక్రియను మొదలుపెట్టింది.

    ఇక గత ఆర్థిక సంవత్సరంలోనే యాపిల్‌ భారత్‌లో 22 బిలియన్‌ డాలర్ల విలువైన ఐఫోన్లను తయారు చేసింది. వాటిలో 18 బిలియన్‌ డాలర్ల విలువైన ఐఫోన్లను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆపిల్

    తాజా

    Israel-Hamas: మళ్లీ గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 66 మంది మృతి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
    IMF: ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. IMF నూతన షరతులతో ఒత్తిడి పెరుగుతోంది ఐఎంఎఫ్
    Brazil : 154 అంతస్తులతో సెన్నా టవర్‌.. ధర తెలిస్తే దిమ్మ తిరుగుతుంది బ్రెజిల్
    Kannappa: అక్షయ్ కుమార్ లుక్ సూపర్బ్… 'కన్నప్ప' రిలీజ్ డేట్ వచ్చేసింది! కన్నప్ప

    ఆపిల్

    Apple Glowtime Event : ఆపిల్ గ్లోటైమ్ ఈవెంట్.. ఆపిల్ వాచ్ అల్ట్రా 2, ఎయిర్‌పాడ్స్ 4 లాంచ్.. ధర, స్పెషిఫికేషన్ల వివరాలివే..! టెక్నాలజీ
    Apple WatchOS 11: AI-సపోర్టెడ్ ఫీచర్‌లను అందిస్తుంది టెక్నాలజీ
    Piyush Pratik: ఐఫోన్ 16ను పరిచయం చేసిన ఐఐటీలో చదువుకున్న పీయూష్ ప్రతీక్ ఎవరు? టెక్నాలజీ
    iPhone 16: యాపిల్ 16 ఈవెంట్‌లో పాల్గొన్న సిద్ధార్థ దంపతులు.. టిమ్ కుక్‌తో ఆసక్తికరమైన సంభాషణ  ఐఫోన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025