Page Loader
iPhones: ఇక 2026 చివరి నాటికి భారతదేశంలోనే ఐఫోన్‌ల తయారీ..  
ఇక 2026 చివరి నాటికి భారతదేశంలోనే ఐఫోన్‌ల తయారీ..

iPhones: ఇక 2026 చివరి నాటికి భారతదేశంలోనే ఐఫోన్‌ల తయారీ..  

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 25, 2025
03:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-చైనా దేశాల మధ్య పరస్పర సుంకాల విధానాలు తీవ్ర రూపం దాల్చడంతో వాణిజ్య యుద్ధానికి దారి తెరిచాయి. ఈ పరిస్థితుల్లో టారిఫ్‌ లాంటి భారం నుంచి తప్పించుకునే దిశగా ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ (Apple) ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లుతోంది. ఇందుకోసం కంపెనీ ప్రస్తుతం అమెరికా మార్కెట్‌లో విక్రయించే ఐఫోన్ల (iPhone) తయారీని పూర్తిగా భారత్‌ (India)కి మారుస్తే ఎలా ఉంటుందన్న దిశగా పరిశీలన సాగిస్తోంది. విశ్వసనీయ వర్గాల ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం, పలు ప్రముఖ ఆంగ్ల వార్తా సంస్థలు ఈ విషయాన్ని నివేదికల రూపంలో వెలిబుచ్చాయి.

వివరాలు 

80 శాతం ఐఫోన్లు చైనాలోనే

ఈ నివేదికల ప్రకారం,2026 నాటికి అమెరికాలో విక్రయించబడే అన్ని ఐఫోన్ల తయారీ భారత్‌ ఆధారంగా జరిగేలా యాపిల్‌ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అమెరికా వెలుపల తయారవుతున్నఐఫోన్లలో భారత్‌ వాటా సుమారు 14 శాతంగా ఉండగా, మిగిలిన భారీ భాగమైన దాదాపు 80 శాతం ఐఫోన్లు చైనాలోనే ఉత్పత్తి అవుతున్నాయి. అయితే తాజా సుంకాల నేపథ్యంలో యాపిల్‌ కంపెనీపై భారీ భారాలు పడే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా చైనాలో తయారైన ఐఫోన్లను అమెరికాకు దిగుమతి చేసుకుంటే,కంపెనీకి 145 శాతం సుంకం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో చైనా,భారత్‌లో తయారయ్యే ఐఫోన్ల ధరల మధ్య అమెరికా మార్కెట్లో గణనీయమైన వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది.

వివరాలు 

అమెరికా మార్కెట్లో 'మేక్ ఇన్ ఇండియా' ఐఫోన్లు

ఈ నేపథ్యంలో భారత్‌లోనే తయారీని పెంచడమే ఉత్తమ మార్గమని ఆపిల్ భావిస్తోంది. ఇది అమలైతే.. ఇక అమెరికా మార్కెట్లో 'మేక్ ఇన్ ఇండియా' ఐఫోన్లు ప్రధానంగా దర్శనమిస్తాయి. ఇక ఈ వాణిజ్య వివాదానికి బీజం పడినదే ట్రంప్‌ తొలిసారిగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలోనే. అప్పటినుండి చైనాపై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు అమెరికా చర్యలు ప్రారంభించింది. ఫలితంగా యాపిల్‌తోపాటు పలు బహుళజాతి సంస్థలు చైనాకు ప్రత్యామ్నాయంగా కొత్త తయారీ కేంద్రాలపై దృష్టి పెట్టాయి.

వివరాలు 

 భారత్‌లో ఐఫోన్ల అసెంబ్లింగ్‌ 

ఇదే సమయంలో భారత ప్రభుత్వం 2020లో మొబైల్‌ ఫోన్ల తయారీకి ఉత్సాహాన్ని కలిగించే విధంగా పలు ప్రోత్సాహక పథకాలను ప్రకటించింది. దీంతో యాపిల్‌ భారత్‌లో ఐఫోన్ల అసెంబ్లింగ్‌ ప్రక్రియను మొదలుపెట్టింది. ఇక గత ఆర్థిక సంవత్సరంలోనే యాపిల్‌ భారత్‌లో 22 బిలియన్‌ డాలర్ల విలువైన ఐఫోన్లను తయారు చేసింది. వాటిలో 18 బిలియన్‌ డాలర్ల విలువైన ఐఫోన్లను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది.