LOADING...
Apple retail store: ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. పూణేలో కొత్త ఆపిల్ రిటైల్ 
ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. పూణేలో కొత్త ఆపిల్ రిటైల్

Apple retail store: ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. పూణేలో కొత్త ఆపిల్ రిటైల్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 26, 2025
10:39 am

ఈ వార్తాకథనం ఏంటి

దిగ్గజ టెక్ కంపెనీ ఆపిల్‌ (Apple) భారత్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. ఐఫోన్లతో పాటు ఇతర ఉత్పత్తుల కోసం భారత్‌ ఒక ప్రధాన మార్కెట్‌గా మారిన నేపథ్యంలో, దేశంలో తయారీ,విక్రయ కార్యకలాపాలను వేగవంతంగా విస్తరిస్తుంది. ఇప్పటికే ఢిల్లీలో,ముంబైలో ఆపిల్ రిటైల్‌ స్టోర్లు (Apple Retail Stores) ప్రారంభించగా, కంపెనీ మూడవ స్టోర్‌ను బెంగళూరులో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నది. ఈ అంశాన్ని ఆపిల్ గత వారం అధికారికంగా వెల్లడించింది. సెప్టెంబర్‌ 2న బెంగళూరులో తొలి రిటైల్‌ స్టోర్‌ను ప్రారంభించనుంది. ఇక తాజాగా, నాలుగో రిటైల్‌ స్టోర్‌ను పూణే (Pune)లో కోరెగావ్‌ పార్క్‌ ప్రాంతంలో సెప్టెంబర్‌ 4న ప్రారంభించే యాపిల్‌ అధికారికంగా ప్రకటించింది.

వివరాలు 

యాపిల్‌ సంస్థ బెంగళూరు ఆఫీస్‌ స్థలానికి నెలకు రూ.6.3 కోట్ల అద్దె

భారతదేశంలో తన తయారీ, విక్రయ కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తున్నఆపిల్‌.. బెంగళూరులో భారీ ఆఫీస్‌ స్థలాన్ని అద్దెకు తీసుకోవడం ఇటీవల వార్తల్లో వచ్చిన విషయం. రియల్‌ ఎస్టేట్ అనలిటిక్స్ సంస్థ ప్రాప్‌స్టాక్‌ ప్రకారం,యాపిల్‌ బెంగళూరులోని ఎంబసీ జెనిత్‌ భవనంలో 2.7 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని 10 ఏళ్ల లీజు కోసం అద్దెకు తీసుకుంది. ఈ కమర్షియల్‌ ప్రాజెక్టు ఎంబసీ గ్రూప్‌ (Embassy Group)కి చెందినది. ఈ ఆఫీస్‌ స్థలం 9 అంతస్తుల వరకు (5వ నుండి 13వ అంతస్తు వరకు) విస్తరించి ఉంది. యాపిల్‌ సంస్థ ఈ ఆఫీస్‌ స్థలానికి నెలకు రూ.6.3 కోట్ల అద్దె చెల్లించనుంది.

వివరాలు 

లీజు ఒప్పందంలో భాగంగా యాపిల్‌ రూ.31.57 కోట్ల డిపాజిట్‌

ఏడాదికి 4.5 శాతం రేటు పెంపుతో, అలాగే పార్కింగ్‌, మెయింటెనెన్స్‌ చార్జీలను కలిపి, ఈ 10 ఏళ్ల కాలంలో మొత్తం రూ.1,000 కోట్లకు పైగా అద్దె చెల్లించాల్సి ఉంటుంది. లీజు ఒప్పందం 2025 ఏప్రిల్‌ 3 నుండి అమల్లోకి వచ్చింది. అలాగే, ఈ లీజు ఒప్పందంలో భాగంగా యాపిల్‌ రూ.31.57 కోట్ల డిపాజిట్‌ను కూడా చెల్లించింది. మరోవైపు, 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో యాపిల్‌ అతి పెద్ద మొబైల్‌ ఫోన్ల ఎగుమతిదారుగా నిలిచింది. సుమారు రూ.1.5 లక్షల కోట్ల విలువైన ఫోన్లను భారతదేశం నుంచి ఎగుమతి చేసింది.