ఇండియాలో యాపిల్ ఆదాయం చూస్తే మతిపోవాల్సిందే.. అన్ని వేల కోట్లా!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఆదాయంలో దూసుకెళ్తుతోంది. భారత్లో ఆ సంస్థ వ్యాపారం రూ. 50వేల కోట్లకు చేరువలో ఉన్నట్లు తెలిసింది. 2022-23 దేశీయంగా యాపిల్ ఉత్పత్తుల అమ్మకాలు 48శాతం వృద్ధితో ఆదాయం రూ.49,321 కోట్లకు చేరింది. ఇక నెట్ ప్రాఫిట్ సైతం 76శాతం పెరిగి రూ.2,229గా నమోదైనట్లు రెగ్యూలరేటరీ ఫైలింగ్లో యాపిల్ ధ్రువీకరించింది. ఇండియాలో గత ఐదేళ్ల నుంచి యాపిల్ వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేనంతంగా ఈసారి బిజినెస్తో పాటు అమ్మకాలు కూడా జరిగాయి.
జోరుగా యాపిల్ 15 అమ్మకాలు
మరోవైపు యాపిల్ ప్రొడెక్ట్ ల తయారీ కోసం ఉపయోగించి విడి భాగాల ధరల తగ్గింపులో న్యూజనరేషన్ ప్రొడెక్ట్లు మాక్, హోం ప్యాడ్, ఐఫోన్ 15ల అమ్మకాల షేర్, మార్జిన్ సేల్స్ పెరిగినట్లు పలు నివేదకలు తెలిపాయి. ఇక ఈ ఏడాదిలో యాపిల్ రూ.45వేల కంటే విలువైన ఐఫోన్లు 59శాతం షేరును సాధించాయి. ఇక షిఫ్మెంట్ 56శాతం పెరిగింది. నిర్వహణ ఖర్చు 5.4 శాతంతో, ప్రొడెక్ట్ల అమ్మకాలు 94.6శాతంతో జరిగినట్లు యాపిల్ రెగ్యూలరేటరీలో ఫైల్ చేసింది. గతేడాది 2022తో పోలిస్తే విదేశీ మారకపు అవుట్ ఫ్లో 2023లో 2శాతం పెరిగి రూ.18,140కి, విదేశీయ మారక ఆదాయం 39శాతంతో రూ.2,262గా నమోదైంది.