
Stock market: వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల మధ్య ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు ఆ తరువాత పుంజుకుని రాణించాయి.
ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్లు ఊపందుకోవడంతో మార్కెట్కు మద్దతు లభించింది. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ఠానికి చేరడంతో ఆర్బీఐ రెపో రేటును మరింతగా తగ్గించే అవకాశం ఉందన్న అంచనాలు ఈ కోణంలో సహకరించాయి.
మరోవైపు అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలపై కొనసాగుతున్న అనిశ్చితి కారణంగా ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, మన మార్కెట్లు మాత్రం లాభాల్లో నిలిచాయి.
ఉదయం 76,996.78 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ (మునుపటి ముగింపు: 76,734.89) ఇంట్రాడేలో 77,110.23 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది.
Details
స్టాక్ల పనితీరు
చివరకు 309.40 పాయింట్ల లాభంతో 77,044.29 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 119.05 పాయింట్లు పెరిగి 23,447.60 వద్ద స్థిరపడింది.
విదేశీ మారకంలో రూపాయి విలువ డాలరుతో పోలిస్తే 85.67 వద్ద నమోదైంది.
సెన్సెక్స్ 30 షేర్లలో ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్ ప్రధాన లాభదాయక షేర్లుగా నిలిచాయి.
అదే సమయంలో మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, ఎల్అండ్టీ, ఎన్టీపీసీ నష్టాలు నమోదు చేశాయి.
అంతర్జాతీయ మార్కెట్లు
బ్రెంట్ క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా బ్యారెల్కు 65 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి. బంగారం ధర మరింత పెరిగి, ఔన్సుకు 3,317 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.