NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Paytm: పేటీఎం వ్యవస్థాపకులు, డైరెక్టర్లకు సెబీ షోకాజ్ నోటీసులు
    తదుపరి వార్తా కథనం
    Paytm: పేటీఎం వ్యవస్థాపకులు, డైరెక్టర్లకు సెబీ షోకాజ్ నోటీసులు
    పేటీఎం వ్యవస్థాపకులు, డైరెక్టర్లకు సెబీ షోకాజ్ నోటీసులు

    Paytm: పేటీఎం వ్యవస్థాపకులు, డైరెక్టర్లకు సెబీ షోకాజ్ నోటీసులు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 26, 2024
    04:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ పేటియం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ షేర్లు నేడు మార్కెట్‌లో భారీగా క్షీణించాయి.

    కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్‌శేఖర్‌ శర్మకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వెలువడటంతో ఈ క్షీణత చోటుచేసుకుంది.

    ఈ నేపథ్యంలో సోమవారం పేటీఎం షేర్లు బీఎస్‌ఈలో ఒక దశలో 8.88 శాతం తగ్గిపోయి 505.25 రూపాయలకు చేరాయి. అనంతరం షేర్లు కొంతమేర కోలుకున్నాయి.

    2021లో పేటీఎం ఐపీఓ విడుదలైంది.

    ప్రమోటర్ క్లాసిఫికేషన్ నిబంధనలు పాటించలేదని ఆర్‌బీఐ ఇచ్చిన ఇన్‌పుట్స్‌ ఆధారంగా సెబీ విజయ్‌శేఖర్‌ శర్మకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు 'మనీకంట్రోల్' వెల్లడించింది.

    Details

    మాజీ బోర్డు మెంబర్లకు నోటీసులు

    ఈ నోటీసులు సంస్థ మాజీ బోర్డు మెంబర్లకు కూడా జారీ చేసినట్లు తెలిసింది.

    2021లో పేటీఎం షేర్లు రూ.2150 ఇష్యూ ధరతో విడుదలైనప్పటికీ, 9 శాతం డిస్కౌంట్‌తో రూ.1995 వద్ద లిస్టయ్యాయి. ఆ సమయంలోనే ఇన్వెస్టర్లకు నిరాశను కలిగించాయి.

    తర్వాత ఈ షేర్లు ఎప్పటికీ ఆ స్థాయిని తిరిగి చేరుకోలేకపోయాయి.

    ప్రస్తుతం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ చర్యల నేపథ్యంలో ఈ ఏడాది షేరు ధర రూ.310 వద్ద కనిష్టాన్ని తాకింది. తాజా షాక్ ఈ షేర్లను మరింత ఒత్తిడికి గురిచేస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పేటియం
    సెబీ

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    పేటియం

    UPI LITEని మొదలుపెట్టిన పేటియం పేమెంట్స్ బ్యాంక్ ప్లాన్
    ఇకపై అన్ని UPI QRలు, ఆన్‌లైన్ వ్యాపారులకు ఉపయోగపడునున్న పేటియం ప్రకటన
    paytm stock: 11శాతం పెరిగిన పేటిఎం స్టాక్.. కారణం ఇదే  తాజా వార్తలు
    Paytm Layoffs: Paytm ఉద్యోగులకు భారీ షాక్.. 1,000 మంది ఉద్యోగుల తొలగింపు  బిజినెస్

    సెబీ

    అదానీ గ్రూప్‌ దర్యాప్తుపై అప్‌డేట్‌ అందించడానికి నిర్మలా సీతారామన్‌ను కలవనున్న సెబీ అధికారులు నిర్మలా సీతారామన్
    ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్ అదానీ గ్రూప్
    మనీలాండరింగ్ కేసు విచారణలో రానా కపూర్‌కు చుక్కెదురు.. బెయిల్‌ నిరాకరించిన సుప్రీంకోర్టు   సుప్రీంకోర్టు
    అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టుకు తుది నివేదికను సమర్పించనున్న సెబీ సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025