NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Tesla : త్వరలో భారత మార్కెట్లోకి టెస్లా.. రూ.20 లక్షలతో ధర ప్రారంభం
    తదుపరి వార్తా కథనం
    Tesla : త్వరలో భారత మార్కెట్లోకి టెస్లా.. రూ.20 లక్షలతో ధర ప్రారంభం
    Tesla : త్వరలో భారత మార్కెట్లోకి టెస్లా.. రూ.20 లక్షలతో ధర ప్రారంభం

    Tesla : త్వరలో భారత మార్కెట్లోకి టెస్లా.. రూ.20 లక్షలతో ధర ప్రారంభం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 13, 2023
    01:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అనుకున్నట్లు జరిగితే త్వరలోనే భారత మార్కెట్లోకి టెస్లా రానుంది.ఈ మేరకు ఇండియన్ రోడ్లపై ఈవీ కారు పరుగులు పెట్టనుంది. భారతదేశంలో తయారీ ప్లాంట్‌ కోసం సదరు సంస్థ చర్చలు ప్రారంభించింది.

    ఒక్కో కారును రూ. 20 లక్షల ధర నుంచే విక్రయించేందుకు సన్నాహకాలు చేస్తోంది.

    భారత ఆటోమోబైల్ మార్కెట్లోకి త్వరలోనే అడుగుపెట్టాలని ఎలక్ట్రికల్ కార్ల దిగ్గజం టెస్లా ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే కార్ల ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు కావాల్సిన పెట్టుబడులను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సంస్థ అంటోంది.

    ఈ సందర్భంగానే కేంద్రంతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏటా 5 లక్షల విద్యుత్తు వాహనాలను తయారు చేయాలని సంస్థ భావిస్తోంది.

    Details

    టెస్లా ప్రారంభ ధర రూ.20 లక్షలు

    ఇందుకు అవసరమైన ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు టెస్లా సన్నద్ధం అవుతోంది. ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి చేసిన కార్లను భారత్‌ కేంద్రంగా ఇండో-పసిఫిక్‌ దేశాలకు ఎక్స్ పోర్ట్ చేయాలని ఎలాన్‌ మస్క్‌ ప్రణాళికలు రచించినట్లు సమాచారం.

    భారత్‌లో విద్యుత్తు వాహనాల (EV) ప్రారంభ ధర రూ.20 లక్షలుగా ఉండనుందని కంపెనీ వర్గాలు అంటున్నాయి.

    ఇటీవలే ప్రధాన మంత్రి మోదీ అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే.

    ఈ సందర్భంగా టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ మోదీతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో మాట్లాడిన ఎలాన్ మస్క్ త్వరలోనే ఇండియాలో టెస్లా ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ప్రకటించారు.

    details

    విలాసవంతమైన కార్లపై 100 శాతం సుంకం

    మరోవైపు దేశంలోకి దిగుమతి అయ్యే లగ్జరీ కార్లపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో సుంకాలు విధిస్తోంది. 'కాస్ట్‌ ఇన్సూరెన్స్‌ ఫ్రెయిట్‌' విలువ 40 వేల డాలర్లు దాటిన కార్లపై 100 శాతం సుంకాన్ని వర్తింపజేయనుంది.

    అయితే టెస్లా కారు మోడళ్లన్నీ ఖరీదైన, విలాసవంతమైన కేటగిరీలోకే వస్తున్నాయి. ఈ మేరకు పన్నులను తగ్గించాలని భారత ప్రభుత్వాన్ని మస్క్ కోరుతున్నారు.

    మేకిన్ ఇండియాలో భాగంగా స్థానికంగా తయారు చేస్తేనే ఖర్చు తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం అంటోంది.

    విడి భాగాలను భారత్‌లోనే అసెంబుల్‌ చేయడంపై దృష్టి సారించాలని సూచించింది. దీంతో కొంతకాలం స్తబ్ధుగా ఉన్న టెస్లా తాజాగా మరోసారి చర్చలనువేగవంతం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    భారతదేశం

    ప్రపంచ ఖరీదైన 25నగరాల జాబితాలో భారతదేశ నగరానికి దక్కిన స్థానం  భారతదేశం
    ఉగ్రవాది సాజిద్ మీర్‌కు అండగా చైనా; భారత్ ఆగ్రహం ఐక్యరాజ్య సమితి
    WEF report 2023: లింగ సమానత్వంలో ఎనిమిది స్థానాలు మెరుగుపడ్డ భారత్: ఈ ఏడాది ర్యాంకు ఎంతంటే?  పాకిస్థాన్
    భారత్ రక్షణకు అమెరికా కీలక సహకారం.. స్ట్రైకర్ ఆర్మర్డ్ వాహనాలకు గ్రీన్ సిగ్నల్ అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025