NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / EPFO : కోట్లాది మంది వేతన జీవులకు షాక్‌.. తగ్గనున్న పీఎఫ్ వడ్డీ
    తదుపరి వార్తా కథనం
    EPFO : కోట్లాది మంది వేతన జీవులకు షాక్‌.. తగ్గనున్న పీఎఫ్ వడ్డీ
    EPFO : కోట్లాది మంది వేతన జీవులకు షాక్‌.. తగ్గనున్న పీఎఫ్ వడ్డీ

    EPFO : కోట్లాది మంది వేతన జీవులకు షాక్‌.. తగ్గనున్న పీఎఫ్ వడ్డీ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 18, 2023
    10:50 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో డబ్బులు దాచుకునే ఉద్యోగులకు కేంద్రం షాక్ ఇచ్చింది. రానున్న రోజుల్లో పీఎఫ్‌పై వడ్డీ తగ్గే అవకాశం ఉంది.

    ఉద్యోగుల భవిష్యనిధిపై వడ్డీ రేట్లను మరోసారి పరిశీలించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

    FY 2021-22లో ఈపీఎఫ్‌ఓ ​​మిగులు నిధులను అంచనా వేసినా నష్టాన్ని చవిచూసింది. రూ. 449.34 కోట్ల మిగులు ఉంటుందని భావించినప్పటికీ రూ. 197.72 కోట్ల లోటు ఏర్పడినట్లు సమాచారం.

    ఈ నేపథ్యంలోనే పీఎఫ్‌పై ఇస్తున్న వడ్డీ రేట్లను పునఃపరిశీలించేందుకు కేంద్ర ఆర్థిక సమాయత్తమవుతోంది. ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వడ్డీ రేటును 8.15 శాతంగా ఈపీఎఫ్‌ఓ నిర్ణయించింది.

    DETAILS

    వడ్డీ రేట్లను మరోసారి సమీక్షించాలని భావిస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ

    నష్టాలను దృష్టిలో ఉంచుకుని, వడ్డీ రేట్లను మరోసారి సమీక్షించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్లు సమాచారం.

    ప్రస్తుతం పీఎఫ్‌పై వడ్డీ రేటు మార్కెట్‌తో పోల్చితే కాస్త ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పీఎఫ్‌పై అధిక వడ్డీ రేట్లను తగ్గించేందుకు ఆర్థిక శాఖ కసరత్తులు చేస్తోంది. ఈ సందర్భంగా మార్కెట్ రేట్లతో సమానంగా వడ్డీ రేట్లను ఉంచాల్సిన సమయం వచ్చిందని పేర్కొంది.

    చాలా పొదుపు పథకాల్లో పీఎఫ్‌పై చెల్లించే వడ్డీ కంటే తక్కువగానే ఉంది. ఫలితంగా పీఎఫ్ వడ్డీని 8 శాతం లోపే కట్టడి చేయాలని నిర్ణయం తీసుంది.

    కోట్ల మంది ఉద్యోగుల సామాజిక భద్రతకు ఈపీఎఫ్ఓనే అతిపెద్ద ఆధారం. ప్రస్తుతం పీఎఫ్ అకౌంట్ ఉన్న వారి సంఖ్య 6 కోట్లకుపైగా ఉండటం కొసమెరుపు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఈపీఎఫ్ఓ
    కేంద్ర ప్రభుత్వం
    ఉద్యోగులు

    తాజా

    2025 Suzuki V-Strom 800DE: భారత్ లో విడుదలైన 2025 సుజుకి V-స్ట్రోమ్ 800DE.. రూ.10,30,000 ఎక్స్-షోరూమ్ ధర ఆటో మొబైల్
    Elon Musk: కొత్త పార్టీ పెట్టేందుకు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. మస్క్ పెట్టిన పోల్‌కు భారీ రెస్పాన్స్..  ఎలాన్ మస్క్
    Chenab bridge: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ ..  నరేంద్ర మోదీ
    Home loan: గృహ రుణాలదారులకు ఊరట.. వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్‌బీఐ  ఆర్ బి ఐ

    ఈపీఎఫ్ఓ

    పీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.. ఈ-నామినేషన్ లేకుంటే రూ.7 లక్షలు గల్లంతే పెన్షన్
    ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లు ఖరారు.. 8.15 శాతం ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ బిజినెస్
    EPFO: ఈపీఎఫ్ఓలో భారీగా పెరిగిన సభ్యులు; జూన్‌లో 17.89 లక్షల మంది చేరిక  ఉద్యోగులు
    ETFలో తిరిగి ఇన్వెస్ట్ చేసేందుకు EPFO ఆసక్తి..ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు బిజినెస్

    కేంద్ర ప్రభుత్వం

    వివాహం,శుభకార్యాల్లో ప్లే చేసే పాటలకు కాపీరైట్ వర్తించదు: కేంద్రం కీలక ప్రకటన సినిమా
    ఈడీ డైరెక్టర్ ఎస్‌కే మిశ్రా పదవీకాలాన్ని సెప్టెంబర్ 15 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    మణిపూర్ అమానుష వైరల్ వీడియో కేసు సీబీఐ చేతికి.. సుప్రీంకు కేంద్రం వివరణ మణిపూర్
    Telangana: వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు తెలంగాణకు కేంద్ర బృందం తెలంగాణ

    ఉద్యోగులు

    అధిక పెన్షన్ దరఖాస్తు గడువును పొడిగించిన EPFO పెన్షన్
    వారానికి 5 రోజుల పనిదినాలని డిమాండ్ కు అంగీకరించిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ బ్యాంక్
    వేమో, జనరల్ మోటార్స్, సిటీ గ్రూప్ తో పాటు మరికొన్ని సంస్థలు ప్రారంభించిన ఉద్యోగ కోతలు ఉద్యోగుల తొలగింపు
    ఈపీఎఫ్ అధిక పింఛనదారుల్లో ఆందోళన; ఉమ్మడి ఆప్షన్‌పై ఆధారాలు సమర్పించాలని ఈపీఎఫ్‌వో నోటీసులు పెన్షన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025