NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / PF New Rule:ఈపీఎఫ్‌వో కొత్త రూల్ ఏంటి? అది ఎలా పనిచేస్తుంది?
    తదుపరి వార్తా కథనం
    PF New Rule:ఈపీఎఫ్‌వో కొత్త రూల్ ఏంటి? అది ఎలా పనిచేస్తుంది?
    ఈపీఎఫ్‌వో కొత్త రూల్ ఏంటి? అది ఎలా పనిచేస్తుంది?

    PF New Rule:ఈపీఎఫ్‌వో కొత్త రూల్ ఏంటి? అది ఎలా పనిచేస్తుంది?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 17, 2025
    05:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) పాలసీలో కొత్త మార్పును తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.

    ఈ కొత్త మార్గదర్శక ప్రకారం, మీకు పీఎఫ్ అకౌంట్ ఉంటే, మీ పీఎఫ్ కంట్రిబ్యూషన్‌పై స్థిరమైన వడ్డీ రేటు లభించేలా చేయనుంది.

    దీనికోసం ప్రభుత్వం వడ్డీ స్థిరీకరణ రిజర్వ్ ఫండ్ అనే ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసే యోచనలో ఉంది.

    జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, ఈ మార్పుతో 6.5 కోట్ల మంది ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది.

    వివరాలు 

    వడ్డీ స్థిరీకరణ రిజర్వ్ ఫండ్ - దీని ప్రాముఖ్యత ఏమిటి? 

    ఈపీఎఫ్‌వో వడ్డీ స్థిరీకరణ రిజర్వ్ ఫండ్ అనే ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని పరిశీలిస్తోంది.

    దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, ఈపీఎఫ్‌వో పెట్టుబడులపై వచ్చే ఆదాయం ఎంతైనా వడ్డీ రేటును స్థిరంగా ఉంచడం.

    ప్రస్తుతం, ఈపీఎఫ్‌వో వడ్డీ రేటు మార్కెట్‌లో పెట్టుబడుల ద్వారా వచ్చిన ఆదాయంపై ఆధారపడి ఉంటుంది.

    ఆదాయం ఎక్కువగా ఉంటే వడ్డీ రేటు కూడా పెరుగుతుంది. కానీ ఆదాయం తగ్గినప్పుడు వడ్డీ రేటు కూడా తగ్గుతుంది.

    వివరాలు 

    ఈ కొత్త ఫండ్ వల్ల కలిగే ప్రయోజనాలు 

    ఈపీఎఫ్‌వో రాబడి ఎక్కువగా ఉన్నప్పుడు కొంత నిధిని ఈ ప్రత్యేక ఫండ్‌లో నిల్వ చేసి, రాబడి తక్కువగా ఉన్న సమయంలో ఖాతాదారులకు స్థిరమైన వడ్డీ రేటును అందించనుంది.

    మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావాన్ని తగ్గించేందుకు ఈపీఎఫ్‌వో స్థిరమైన వడ్డీ రేటును అందించేందుకు ముందుకు వస్తోంది.

    రాబడులు తగ్గినప్పటికీ, ఖాతాదారులకు నష్టమయ్యే పరిస్థితి ఉండదు.

    వివరాలు 

    ఈ కొత్త రూల్ ఎప్పుడు అమలులోకి వస్తుంది? 

    ప్రస్తుతం ఈ కొత్త మార్పు ప్రాథమిక చర్చల దశలో ఉంది. ఈ ఏడాది చివరిలో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొత్త నిబంధనలను 2026-2027 నాటికి అమలు చేయనున్నట్లు అంచనా.

    ఈపీఎఫ్‌వో వడ్డీ రేట్ల పై తాజా సమాచారం

    గత కొన్ని ఏళ్లుగా ఈపీఎఫ్‌వో వడ్డీ రేట్లు హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి.

    2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌వో 8.25% వడ్డీ రేటును ఖరారు చేసింది.

    ఇకపై 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 28న జరిగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో కొత్త వడ్డీ రేటు నిర్ణయించే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఈపీఎఫ్ఓ

    తాజా

    PM Modi: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. భద్రతా అంశాలపై చర్చించనున్న ప్రధాని కేంద్ర కేబినెట్
    Odisha: ఒడిశా ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. నర్సు తప్పుడు ఇంజెక్షన్‌.. ఐదుగురు రోగులు మృతి ఒడిశా
    Iran: ఇరాన్‌లో తప్పిపోయిన ముగ్గురు భారతీయులు క్షేమం.. రాయబార కార్యాలయం వెల్లడి  ఇరాన్
    AAP: తరగతి గదుల నిర్మాణాల్లో అవినీతి.. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లకు సమన్లు మనీష్ సిసోడియా

    ఈపీఎఫ్ఓ

    పీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.. ఈ-నామినేషన్ లేకుంటే రూ.7 లక్షలు గల్లంతే పెన్షన్
    ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లు ఖరారు.. 8.15 శాతం ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ బిజినెస్
    EPFO: ఈపీఎఫ్ఓలో భారీగా పెరిగిన సభ్యులు; జూన్‌లో 17.89 లక్షల మంది చేరిక  తాజా వార్తలు
    ETFలో తిరిగి ఇన్వెస్ట్ చేసేందుకు EPFO ఆసక్తి..ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025