
Telsa In India: భారత్లో తొలి టెస్లా షోరూం.. జూలై నుంచి ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టెస్లా (Tesla) ఇప్పుడు భారత్ మార్కెట్లో అడుగుపెట్టనుంది. తొలి షోరూం ముంబైలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జూన్ నెలలో ముంబై కేంద్రంగా 'మోడల్ వై రేర్ వీల్ డ్రైవ్ ఎస్యూవీ' విక్రయాలను ప్రారంభించేందుకు టెస్లా సన్నాహకాలు చేస్తోంది. డిమాండ్ అనుకూలిస్తే తదుపరి దశలో ఢిల్లీలో కూడా షోరూం ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న బ్లూమ్బర్గ్ (Bloomberg) వార్తా సంస్థ తాజాగా వెల్లడించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా పర్యటన సందర్భంగా టెస్లా భారత్ విస్తరణపై పునాదులు పడ్డాయని బ్లూమ్బర్గ్ తెలిపింది.
Details
ప్రణాళికలు సిద్ధం చేసిన టెస్లా
యూరప్, చైనా మార్కెట్లలో అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతో భారత్ను తదుపరి ముఖ్య కేంద్రంగా ఎంచుకోవాలని ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా నిర్ణయించింది. ఇందుకోసం ముంబైలో తొలి షోరూం ఏర్పాటు చేయడానికి టెస్లా ప్రణాళికలు చకచకా అమలు చేస్తోంది. వచ్చే నెలలోనే విక్రయాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న టెస్లా ఇప్పటికే చైనా, అమెరికా నుంచి సూపర్ చార్జర్లు, కార్ యాక్సెసరీస్, ఇతర విడిభాగాలను భారత్కు పెద్ద ఎత్తున రప్పించింది. అంతేకాకుండా షాంఘైలోని టెస్లా ఫ్యాక్టరీ నుంచి మోడల్ వై రియర్ వీల్ డ్రైవ్ ఎస్యూవీ మోడళ్లను భారత్ తీసుకువచ్చింది.