NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / తొలిసారిగా 20,000 మార్కును తాకిన నిఫ్టీ ; డబ్బును కుమ్మరిస్తున్న దేశీ, విదేశీ పెట్టుబడిదారులు 
    తదుపరి వార్తా కథనం
    తొలిసారిగా 20,000 మార్కును తాకిన నిఫ్టీ ; డబ్బును కుమ్మరిస్తున్న దేశీ, విదేశీ పెట్టుబడిదారులు 
    తొలిసారిగా 20,000 మార్కును తాకిన నిఫ్టీ

    తొలిసారిగా 20,000 మార్కును తాకిన నిఫ్టీ ; డబ్బును కుమ్మరిస్తున్న దేశీ, విదేశీ పెట్టుబడిదారులు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 11, 2023
    04:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఫ్రంట్‌లైన్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ సోమవారం గణనీయమైన లాభాలతో ముగిశాయి.సెషన్‌లో నిఫ్టీ తాజా రికార్డు గరిష్టాన్ని తాకింది.

    ఆల్ రౌండ్ కొనుగోళ్లపై సెన్సెక్స్ 67,000 మార్కును తిరిగి పొందింది. తొలిసారిగా 20,000 మార్క్‌ను దాటిన నిఫ్టీ సోమవారం ఇంట్రాడే ట్రేడ్‌లో తాజా రికార్డు గరిష్ట స్థాయి 20,008.15ను తాకింది.

    నిఫ్టీ చివరి ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 19,991.85. ఇది ఈ సంవత్సరం జూలై 20 న తాకింది. అందువలన, ఇది 36 సెషన్లలో తాజా శిఖరాన్ని స్కేల్ చేసింది.

    ఈ ఏడాది జూలై 20న సెన్సెక్స్ తన ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 67619.17ను తాకింది. ప్రస్తుతం ఈ స్థాయికి 492 పాయింట్ల దూరంలో ఉంది.

    Details 

    వచ్చే ఎన్నికల నాటికి 25,000 పాయింట్లకు  నిఫ్టీ 

    జీ20 సదస్సు విజయవంతముగా భారత్ నిర్వహించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపుతున్నాయి.

    జి20 ఢిల్లీ డిక్లరేషన్‌కు ఆమోదం లభించడం వల్ల మార్కెట్ సెంటిమెంట్‌కు ఊతం లభించిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వికె విజయకుమార్ అభిప్రాయపడ్డారు.

    వచ్చే ఎన్నికల నాటికి నిఫ్టీ 25,000 పాయింట్ల మైలురాయిని చేరే అవకాశముందని మార్కెట్ నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    ప్రపంచ నేతల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి మద్ధతు లభించడంతో భారత పారిశ్రామిక వర్గాల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది.

    Details 

    7.8 శాతం నమోదైన జీడీపీ 

    ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు బ్యారల్ 90 డాలర్లకు చేరుకొని దేశీయ ఇండస్ట్రియలిస్టులను కాస్త కలవరపాటుకు గురి చేసినా జీ20 సదస్సు సక్సస్ కావడంతో భారత ఆర్థిక వ్యవస్థపై ఇటు దేశీయ మదుపర్లు, అటు విదేశీ మదుపర్లు నమ్మకాన్ని ఉంచుతున్నారు.

    గత వారం ప్రకటించిన 2023-24 వార్షిక సంవత్సరపు తొలి త్రైమాకికంలో జీడీపీ వృద్ధిరేటు అంచనాలను మించి 7.8 శాతంగా నమోదు అవ్వడంతో దేశీయ మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సెన్సెక్స్

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    సెన్సెక్స్

    బడ్జెట్ ప్రకటన తరువాత మిశ్రమంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్
    చరిత్ర సృష్టించిన స్టాక్ మార్కెట్లు.. లైఫ్ టైమ్ రికార్డు కొట్టిన సెన్సెక్స్ స్టాక్ మార్కెట్
    భారీ నష్టాల్లో ఇండియన్ స్టాక్ మార్కెట్లు.. దాదాపు రూ. 2 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్
    నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 299.48, నిఫ్టీ 72.65 పాయింట్ల క్షీణత  స్టాక్ మార్కెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025