NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Tejas: భారత్‌ చేపట్టిన ఐదోతరం యుద్ధ విమానాలకు ఇంజిన్లు సరఫరా చేసేందుకు జీఈ ఆసక్తి 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Tejas: భారత్‌ చేపట్టిన ఐదోతరం యుద్ధ విమానాలకు ఇంజిన్లు సరఫరా చేసేందుకు జీఈ ఆసక్తి 
    భారత్‌ చేపట్టిన ఐదోతరం యుద్ధ విమానాలకు ఇంజిన్లు సరఫరా చేసేందుకు జీఈ ఆసక్తి

    Tejas: భారత్‌ చేపట్టిన ఐదోతరం యుద్ధ విమానాలకు ఇంజిన్లు సరఫరా చేసేందుకు జీఈ ఆసక్తి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 09, 2025
    02:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశం చేపట్టిన ఐదో తరం యుద్ధ విమానాల ప్రాజెక్టు కోసం ఇంజిన్లు తయారుచేయడంలో తమ కంపెనీ ఆసక్తి కలిగి ఉందని అమెరికాకు చెందిన ప్రసిద్ధ ఇంజిన్‌ తయారీ సంస్థ జనరల్ ఎలక్ట్రిక్ సీఈఓ లారీ కల్ప్ తెలిపారు.

    ఈ ప్రాజెక్టుతో పాటు అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(ఆమ్కా)కు అవసరమైన ఇంజిన్ల సరఫరా ఒప్పందం కోసం తమ సంస్థ పోటీ పడుతుందని స్పష్టం చేశారు.

    పౌర,రక్షణ వైమానిక రంగాలలో భారత్‌ను వారు ఒక ముఖ్య వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తున్నారని తెలిపారు.

    ఇకపోతే,తేజస్ మార్క్-1ఏ యుద్ధ విమానాల కోసం ఇప్పటికే ఎఫ్-404 ఇంజిన్ల సరఫరాను వేగవంతం చేయనున్నట్లు జీఈ సంస్థ పేర్కొంది.

    గమనించదగిన విషయం ఏమిటంటే, ఈ ఇంజిన్ల డెలివరీలో ఇప్పటికే భారీగా ఆలస్యం జరిగింది.

    వివరాలు 

    ఏప్రిల్, మే నెలల్లో మెరుగైన పురోగతి

    భారత ప్రభుత్వం మొత్తం 99 ఇంజిన్ల ఆర్డర్ ఇచ్చినప్పటికీ, ఈ ఏడాది మార్చి నాటికి కేవలం ఒక్క ఇంజిన్ మాత్రమే అందించగలిగారు.

    ఉద్దేశించిన షెడ్యూల్‌కి పోలిస్తే ఇది రెండేళ్ల ఆలస్యం. దీనిపై స్పందించిన సీఈవో లారీ కల్ప్, "విభాగాల సరఫరా సామర్థ్యాన్ని పెంచేందుకు మా సరఫరాదారులతో కలిసి కృషి చేస్తున్నాం. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంతో పోల్చితే ఏప్రిల్, మే నెలల్లో మెరుగైన పురోగతి నమోదైంది" అని ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

    అలాగే, భారత్‌లో అనుకూల పరిస్థితులు ఏర్పడిన వెంటనే, వాణిజ్య విమానాల నిర్వహణ, మరమ్మతుల కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన తమకు ఉందని వెల్లడించారు.

    వివరాలు 

    1,400 ఇంజిన్లు వివిధ రకాల విమానాల్లో వినియోగంలో..

    తేజస్ ఎంకే-1ఏ ప్రాజెక్టు ఆలస్యం విషయమై భారత వైమానిక దళం అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఇప్పటికే పలుమార్లు అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం విదితమే.

    ఉత్పత్తి సామర్థ్యంలో ఉన్న పరిమితుల కారణంగా, రక్షణ రంగం మరియు పౌర విమానాల డెలివరీల్లోనూ ఆలస్యం తప్పడం లేదు.

    ప్రస్తుతం భారత్‌లో జనరల్ ఎలక్ట్రిక్ సంస్థకు చెందిన సుమారు 1,400 ఇంజిన్లు వివిధ రకాల విమానాల్లో వినియోగంలో ఉన్నాయని తెలుస్తోంది.

    వీటిలో చిన్నవీ, పెద్దవీ అన్ని రకాల విమానాలూ ఉన్నాయి. భవిష్యత్తులో ఈ సంఖ్య 2,500కి పెరిగే అవకాశముందని అంచనా వేయబడుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా

    తాజా

    Tejas: భారత్‌ చేపట్టిన ఐదోతరం యుద్ధ విమానాలకు ఇంజిన్లు సరఫరా చేసేందుకు జీఈ ఆసక్తి  అమెరికా
    BCCI: బీసీసీఐ నుంచి కీలక అప్‌డేట్‌.. మారిన సౌతాఫ్రికాతో టెస్ట్‌ మ్యాచ్‌ల వేదికలు బీసీసీఐ
    Harish Rao: కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు ముగిసిన మాజీ మంత్రి హరీశ్‌రావు విచారణ తెలంగాణ
    Jyoti Malhotra: హర్యానా కోర్టులో జ్యోతి మల్హోత్రాకు బిగ్ షాక్.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చిన కోర్టు.. జ్యోతి మల్హోత్రా

    అమెరికా

    Donald Trump: వలసదారులపై సుప్రీం తీర్పు అమెరికాకు ముప్పు: ట్రంప్‌ ఫైర్ డొనాల్డ్ ట్రంప్
    Donald Trump: మళ్లీ ట్రంప్‌ నోట జీరో టారిఫ్‌.. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని కీలక వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్
    US Visas: వీసా గడువు కాలం మించితే భారీ జరిమానాలు.. శాశ్వత నిషేధం కూడా విధిస్తామన్న అమెరికా అంతర్జాతీయం
    USA: కాలిఫోర్నియాలో బాంబు పేలుడు కలకలం.. ఒకరు మృతి.. నలుగురికి గాయాలు ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025