NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / పసిడి ధరలు మళ్లీ పైపైకి.. ఒక్కరోజే రూ.2000 పెరిగిన వెండి
    పసిడి ధరలు మళ్లీ పైపైకి.. ఒక్కరోజే రూ.2000 పెరిగిన వెండి
    1/2
    బిజినెస్ 0 నిమి చదవండి

    పసిడి ధరలు మళ్లీ పైపైకి.. ఒక్కరోజే రూ.2000 పెరిగిన వెండి

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 10, 2023
    12:22 pm
    పసిడి ధరలు మళ్లీ పైపైకి.. ఒక్కరోజే రూ.2000 పెరిగిన వెండి
    పసిడి ధరలు మళ్లీ పైపైకి.. ఒక్కరోజే రూ.2000 పెరిగి దూసుకెళ్తున్న వెండి

    బులియన్ మార్కెట్లో పసిడి ధరలు హెచ్చుతగ్గులకు గురవుతోంది. నిన్న ఉన్న ధరలు నేడు ఉండట్లేదు. ధరలు రోజుకో తీరులో ఎప్పటికప్పుడు మారుతున్నాయి. కిందటి సెషన్‌లో భారీగా తగ్గిన బంగారం రేట్లు శనివారం కాస్త పెరిగాయి. బంగారం, వెండి ధరలు క్రమంగా పుంజుకుంటున్నాయి. దేశీయంగా వెండి ధరలు వినియోగదారులకు ఝలక్ ఇచ్చాయి. ప్రస్తుతం స్వచ్ఛమైన మేలిమి బంగారం రూ.61 వేలకు దూసుకెళ్తోంది. ఆభరణాల తయారీకి ఉపయోగించే గోల్డ్ రూ.56 వేలపైకి పరుగులు తీస్తోంది. హైదరాబాద్ గోల్డ్ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ఇవాళ ఒక్కరోజే రూ.400కు ఎగబాకడం విశేషం.

    2/2

    హైదరాబాద్ లో బంగారం ధర, దిల్లీలో వెండి ధర తక్కువ

    ప్రస్తుతం 10 గ్రాములకు రూ.55 వేల 600గా కొనసాగుతోంది. 10 గ్రాములకు 24 క్యారెట్ల ధర రూ.60 వేల 680కు దూసుకెళ్లింది. ఈ లెక్కన దాదాపుగా రూ.460 పెరిగింది. హైదరాబాద్ తో పోల్చేతే దిల్లీలోనే పసిడి ధరలు కాస్త అధికంగా ఉన్నాయి. మరోవైపు దిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.400 పెరిగి ప్రస్తుతం రూ.55 వేల 750గా నమోదైంది. ఇక 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ రేట్ రూ.460 పెరిగి రూ.60 వేల 830కు చేరింది. హైదరాబాద్ లో వెండి ఒక్కసారిగా కిలోకి రూ.2000 పెరిగి ప్రస్తుతం రూ.79 వేల 700 పలకడం గమనార్హం. ఇక దిల్లీలో వెండి రేటు నెమ్మదిస్తూ రూ.1100 పెరిగి రూ.74 వేల 500 వద్ద కొనసాగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ప్రపంచం
    ఆర్థిక శాఖ మంత్రి

    ప్రపంచం

    సింగపూర్ ఓపెన్‌లో భారత షట్లర్లకు చుక్కెదురు టెన్నిస్
    ప్రపంచ స్థాయి డేటా సెంటర్లకు నిలయంగా హైదరాబాద్  సాఫ్ట్ వేర్
    ఉలిక్కిపడ్డ ఆఫ్ఘనిస్తాన్‌.. మరోసారి బాంబు పేలుడు గవర్నర్
    8 మందిపై క‌త్తితో విరుచుకుపడ్డ సైకో.. ముగ్గురు చిన్నారుల పరిస్థితి ఆందోళనకరం ఫ్రాన్స్

    ఆర్థిక శాఖ మంత్రి

    కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి గుర్తుగా రూ.75 నాణెం విడుదల నరేంద్ర మోదీ
    భారత్‌లో ముస్లింలను విస్మరిస్తే వారి జనాభా ఎలా పెరుగుతుంది?: నిర్మలా సీతారామన్ నిర్మలా సీతారామన్
    'వంటగ్యాస్ ధరను తగ్గించాలి'; ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు నిరసన సెగ నిర్మలా సీతారామన్
    ద్రవ రూపంలో ఉండే బెల్లం, పెన్సిల్ షార్పనర్‌లపై పన్ను తగ్గించిన జిఎస్‌టి కౌన్సిల్ జీఎస్టీ
    తదుపరి వార్తా కథనం

    బిజినెస్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Business Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023