Page Loader
Gold Rates: ఊరటకే పరిమితం.. నేడు మళ్లీ పెరిగిన బంగారం ధరలు!
ఊరటకే పరిమితం.. నేడు మళ్లీ పెరిగిన బంగారం ధరలు!

Gold Rates: ఊరటకే పరిమితం.. నేడు మళ్లీ పెరిగిన బంగారం ధరలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 21, 2025
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు కొంత ఊరటనిచ్చినా ఇవాళ మళ్లీ ఉసూరుమనిపించాయి. శుక్రవారం తులం పసిడి ధర రూ. 270 పెరిగింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకు రూ. 10,075 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకు రూ. 9,235 వద్ద ట్రేడ్ కావడం గమనార్హం. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 250 పెరిగి రూ. 92,350 కు చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ. 270 పెరిగి రూ. 1,00,750 వద్దకు చేరుకుంది.

Details

వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేదు

విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో పెరుగుదల కనబడింది. అక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 250 పెరిగి రూ. 92,500 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 270 పెరిగి రూ. 1,00,900 వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక వెండి ధరలు మాత్రం నేడు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 1,20,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కూడా కిలో వెండి ధర రూ. 1,10,000 వద్ద ట్రేడవుతోంది.