NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Ashwini Vaishnaw: ఉత్తరప్రదేశ్‌లో ఆరో సెమీ కండక్టర్‌ యూనిట్‌ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Ashwini Vaishnaw: ఉత్తరప్రదేశ్‌లో ఆరో సెమీ కండక్టర్‌ యూనిట్‌ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ 
    ఉత్తరప్రదేశ్‌లో ఆరో సెమీ కండక్టర్‌ యూనిట్‌ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌

    Ashwini Vaishnaw: ఉత్తరప్రదేశ్‌లో ఆరో సెమీ కండక్టర్‌ యూనిట్‌ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 14, 2025
    04:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో సెమీకండక్టర్ రంగంలో స్వయం సమృద్ధిని సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.

    ఈ ప్రయాణంలో భాగంగా, కేంద్ర కాబినెట్‌ తాజాగా మరో సెమీకండక్టర్ యూనిట్‌కు ఆమోదం తెలిపింది.

    ఈ యూనిట్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లోని జెవార్ ప్రాంతంలో రూ.3,707 కోట్ల పెట్టుబడితో స్థాపించనున్నారు.

    ఈ ప్రాజెక్టును ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల రంగంలో ప్రసిద్ధి పొందిన హోన్ హాయ్ టెక్నాలజీ గ్రూప్‌కు చెందిన ఫాక్స్‌కాన్, భారతీయ ఐటీ దిగ్గజ సంస్థ హెచ్‌సీఎల్ సంయుక్తంగా ఏర్పాటు చేయనుండగా, ఇందుకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టతనిచ్చారు.

    ఈ యూనిట్‌లో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఆటోమొబైల్ ఉత్పత్తులు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అవసరమైన డిస్‌ప్లే డ్రైవర్ చిప్‌లను తయారు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

    వివరాలు 

    2,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు

    సెమీకండక్టర్ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

    ఈ యూనిట్ నిర్మాణం పూర్తయిన తర్వాత దాదాపు 2,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

    అంతేకాక, ఈ ప్లాంట్ నెలకు సుమారుగా 3.6 కోట్ల చిప్‌లను ఉత్పత్తి చేయగలదని మంత్రి వెల్లడించారు.

    సెమీకండక్టర్‌ల తయారీలో అవసరమయ్యే పరికరాలను కూడా భారత్‌లోనే తయారు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

    ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ పరికరాల ఉత్పత్తిలో సుమారుగా 60 శాతం వాటా అమెరికా కంపెనీలదేనని పేర్కొన్నారు.

    వివరాలు 

    దేశవ్యాప్తంగా 270 విద్యా సంస్థల్లో సెమీకండక్టర్ సాంకేతికతపై శిక్షణ

    ఈ రంగంలో దేశీయంగా అభివృద్ధి చెందుతున్న ప్రతిభను ప్రోత్సహించేందుకు సుమారు 70 స్టార్టప్‌లు పనిచేస్తున్నాయని తెలిపారు.

    కొత్త విద్యా విధానం ద్వారా అకడమిక్ విద్య మరియు పరిశ్రమల మధ్య అనుసంధానం ఏర్పడుతున్నదని, దీనివల్ల విద్యార్థులు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సిద్ధమవుతున్నారని చెప్పారు.

    ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 270 విద్యా సంస్థల్లో సెమీకండక్టర్ సాంకేతికతపై శిక్షణ అందిస్తున్నారు.

    విద్యార్థులు రూపొందించిన చిప్‌లను మొహాలీలో ఉత్పత్తి చేసినట్లు చెప్పారు. వీటి తయారీలో నాణ్యతతో కూడిన గణనీయమైన మార్పులు వచ్చాయని ఆయన వివరించారు.

    అదేవిధంగా, టెలికాం రంగ అభివృద్ధికి యూనివర్సిటీల్లో 5జీ ల్యాబ్‌లను స్థాపిస్తున్నట్లు చెప్పారు.

    ప్రస్తుతం యూనివర్సిటీల్లో స్టార్టప్‌లు ప్రారంభించేందుకు ఇన్‌క్యుబేటర్లు కూడా ఏర్పాటవుతున్నాయని మంత్రి తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    అశ్విని వైష్ణవ్

    తాజా

    Ashwini Vaishnaw: ఉత్తరప్రదేశ్‌లో ఆరో సెమీ కండక్టర్‌ యూనిట్‌ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌  ఉత్తర్‌ప్రదేశ్
    Mango: ప్రపంచంలోని టాప్ 20 మామిడి వంటకాలలో భారత్‌కు అగ్రస్థానం.. తయారీ విధానం కూడా చాలా సులువు! వేసవి కాలం
    Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఈ నెలాఖరులోగా ఖాతాల్లో నిధులు జమ తెలంగాణ
    Gold Rates: అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో.. కుప్పకూలిన బంగారం ధర.. తులం రేటు ఎంతంటే ? బంగారం

    ఉత్తర్‌ప్రదేశ్

    PM Modi: మహ కుంభమేళాలో ప్రధాని మోదీ పాల్గొనే పూర్తి షెడ్యూల్ ఇదే! నరేంద్ర మోదీ
    Kumbh stampede: 'కుంభమేళా తొక్కిసలాట పెద్ద ఘటనేమి కాదు'.. హేమ మాలిని వ్యాఖ్యలపై దుమారం  భారతదేశం
    BombThreat: నోయిడాలోని 4 పాఠశాలలకు బాంబు బెదిరింపు..  బాంబు బెదిరింపు
    Milkipur Bypoll: మిల్కిపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం  భారతదేశం

    అశ్విని వైష్ణవ్

    త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు రానున్నాయ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    భారతీయ రైల్వే 'షవర్ సౌకర్యం'; ఏసీ కోచ్‌ పైకప్పు లీక్ కావడంపై నెటిజన్లు ఫైర్ సోషల్ మీడియా
    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో కొత్త ఫీచర్లు; ప్రయాణం మరింత సౌకర్యవంతం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    Vishwakarma Yojana: 5శాతం వడ్డీతో రూ.1లక్ష రుణం అందించాలని కేంద్రం నిర్ణయం  కేంద్ర ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025