NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Bharat brand: భారత్‌ బ్రాండ్‌పై గోధుమ పిండి, బియ్యం విక్రయాలను ప్రారంభించిన కేంద్రం 
    తదుపరి వార్తా కథనం
    Bharat brand: భారత్‌ బ్రాండ్‌పై గోధుమ పిండి, బియ్యం విక్రయాలను ప్రారంభించిన కేంద్రం 
    భారత్‌ బ్రాండ్‌పై గోధుమ పిండి, బియ్యం విక్రయాలను ప్రారంభించిన కేంద్రం

    Bharat brand: భారత్‌ బ్రాండ్‌పై గోధుమ పిండి, బియ్యం విక్రయాలను ప్రారంభించిన కేంద్రం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 05, 2024
    03:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్రం అధిక ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం కల్పించేందుకు చర్యలు తీసుకుంది.

    భారత్‌ బ్రాండ్‌ గోధుమ పిండి, బియ్యం తక్కువ ధరలకు తిరిగి విక్రయించబడుతాయి.

    ఈ సంబంధిత కార్యక్రమం రెండో దశగా మంగళవారం ప్రారంభమైంది. నాఫెడ్‌, ఎన్‌సీసీఎఫ్‌, కేంద్రీయ భండార్‌, ఈ-కామర్స్‌ సంస్థల ద్వారా ఈ విక్రయాలు చేపట్టబడ్డాయి.

    ధరల భారాన్ని తగ్గించేందుకు తాత్కాలికంగా ఈ చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు.

    వివరాలు 

    5, 10 కేజీల ప్యాకెట్స్‌లో గోధుమ పిండి

    రెండో దశలో 3.69 లక్షల టన్నుల గోధుమలు, 2.91 లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా సేకరించినట్లు మంత్రి చెప్పారు.

    కేటాయించిన స్టాక్‌ పూర్తయ్యే వరకు విక్రయాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు.అవసరమైతే అదనపు కేటాయింపులు కూడా జరగవచ్చని పేర్కొన్నారు.

    గోధుమ పిండి కిలో రూ.30కి విక్రయిస్తామని, ఇవి 5, 10 కేజీల ప్యాకెట్స్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.

    అలాగే, బియ్యం కిలో రూ.34 చొప్పున విక్రయించనున్నారు. ఇది కూడా 5, 10 కేజీల ప్యాకెట్ల రూపంలో అందుబాటులో ఉంటుంది.

    వివరాలు 

    జూన్‌ వరకు మొదటి దశలో విక్రయాలు

    గత ఏడాది అక్టోబర్‌ నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు మొదటి దశలో విక్రయాలు జరిగాయి.

    మొత్తం 15.20 లక్షల టన్నుల గోధుమలు మరియు 14.58 లక్షల టన్నుల బియ్యం విక్రయించారు.

    అయితే, ఫేజ్‌-1లో గోధుమపిండి రూ.27.5కి మరియు బియ్యం రూ.29కి విక్రయించబడింది. గతంతో పోలిస్తే, ఈ సారి ధరలను కాస్త పెంచారు.

    తమ ఉద్దేశ్యం వ్యాపారాన్ని కాకుండా వినియోగదారులకు ఉపశమనం కల్పించడం అని జోషి చెప్పారు.

    వినియోగదారులు కోరితే మరింత చిన్న ప్యాకుల్లో కూడా ఈ ఉత్పత్తులు అందించబడతాయని ఆయన పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రహ్లాద్ జోషి

    తాజా

    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు
    US Visas: వీసా గడువు కాలం మించితే భారీ జరిమానాలు.. శాశ్వత నిషేధం కూడా విధిస్తామన్న అమెరికా అమెరికా
    Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్‌కు డేట్ ఫిక్స్.. మేకర్స్ ట్వీట్‌తో హైప్‌! హరిహర వీరమల్లు

    ప్రహ్లాద్ జోషి

    జనవరి 31నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, ఏప్రిల్ 6న ముగింపు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
    జులై 30 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు  రాజ్యసభ
    సెప్టెంబర్‌లో ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు  భారతదేశం
    ఈ నెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు.. కేంద్రం ఏం చేయబోతోంది పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025