NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Techie Suicide: 'అతను ముగ్గురు వ్యక్తుల పని చేసాడు'.. పని ఒత్తిడితో బెంగళూరులో టెక్కీ ఆత్మహత్య..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Techie Suicide: 'అతను ముగ్గురు వ్యక్తుల పని చేసాడు'.. పని ఒత్తిడితో బెంగళూరులో టెక్కీ ఆత్మహత్య..
    పని ఒత్తిడితో బెంగళూరులో టెక్కీ ఆత్మహత్య..

    Techie Suicide: 'అతను ముగ్గురు వ్యక్తుల పని చేసాడు'.. పని ఒత్తిడితో బెంగళూరులో టెక్కీ ఆత్మహత్య..

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 19, 2025
    01:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఓలా కంపెనీకి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగమైన "క్రుత్రిమ్"లో పనిచేస్తున్న ఒక యువ ఇంజనీర్ మే 8న తీవ్రమైన పని ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.

    ఈ సంఘటన మొదట రెడ్డిట్‌లో పోస్టు రూపంలో బయటపడింది. ఆ పోస్ట్ వైరల్ కావడంతో ఈ ఘటనపై దృష్టి కేంద్రీకృతమైంది.

    దీనివల్ల కంపెనీలో కొనసాగుతున్న పని వాతావరణంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

    పూర్తి వివరాల్లోకి వెళితే... ఆ యువ ఇంజనీర్‌ను నిఖిల్ సోమవంశీగా గుర్తించారు.

    ఇటీవలే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, దాదాపు పది నెలల క్రితమే క్రుత్రిమ్‌లో చేరారు.

    వివరాలు 

    అసలైన సమస్య క్రుత్రిమ్‌లోని పని వాతావరణం

    నిఖిల్ మానసికంగా ఒత్తిడికి గురవుతూ చివరికి తన మరణానికి రెండు వారాల ముందే ఆఫీసుకు రాకుండా ఉన్నారని ఓలా క్రుత్రిమ్‌లో పనిచేస్తున్న ఒక ప్రతినిధి ధృవీకరించారు.

    "నిఖిల్ అత్యంత ప్రతిభావంతుడైన యువ ఇంజనీర్. ఆయన మరణం మమ్మల్ని బాగా కలిచివేసింది. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి, సన్నిహితులకు మా గాఢ సానుభూతి తెలుపుతున్నాము" అని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

    ఇక అసలైన సమస్య క్రుత్రిమ్‌లోని పని వాతావరణం గురించి.

    సమాచారం ప్రకారం, నిఖిల్ ఒక కీలక ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న మూడుగురు సభ్యుల బృందంలో ఒకరిగా ఉన్నారు.

    అయితే, మిగతా ఇద్దరు సభ్యులు ఉద్యోగం వీడిన తర్వాత ఆ ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం బాధ్యత నిఖిల్ ఒక్కడిపై పడింది.

    వివరాలు 

    రెడ్డిట్‌లో చేసిన పోస్టులోనూ ఇదే ఆరోపణలు

    ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ పూర్తవ్వడంలో జాప్యం జరుగుతుండటంతో, సీనియర్ మేనేజర్ అయిన రాజ్‌కిరణ్ తరచూ ఫ్రెషర్లను, ముఖ్యంగా నిఖిల్‌ను తీవ్రంగా దూషించేవారని ఓ మాజీ ఉద్యోగి ఆరోపించారు.

    "రాజ్‌కిరణ్‌కు నాయకత్వ లక్షణాలు లేవు. ఆయన నిరంతరం ఉద్యోగులపై అరుస్తూ ఉండేవారు. ఆఫీసు మీటింగ్‌లు జరుగుతున్న సమయంలో కూడా అనుచితంగా ప్రవర్తించేవారు" అని చెప్పారు.

    ఈ వ్యాఖ్యలకు బలంగా, రెడ్డిట్‌లో చేసిన పోస్టులోనూ ఇదే ఆరోపణలు ఉన్నాయి.

    ఆ మాజీ ఉద్యోగి ఆ ఆరోపణలను ధృవీకరించారు. కంపెనీలో కొనసాగుతున్న పని ఒత్తిడి, అనుచిత వ్యవహార శైలి వంటి అంశాలు నిఖిల్ ఆత్మహత్యకు దారితీసిన కారణాల్లో ముఖ్యమైనవి కావచ్చని పరిశీలనలో భాగంగా ఊహాగానాలు వస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఓలా

    తాజా

    Techie Suicide: 'అతను ముగ్గురు వ్యక్తుల పని చేసాడు'.. పని ఒత్తిడితో బెంగళూరులో టెక్కీ ఆత్మహత్య.. ఓలా
    Yusuf Pathan : కేంద్రాన్ని త‌ప్పుప‌ట్టిన తృణ‌మూల్ కాంగ్రెస్‌.. దౌత్య బృందం నుంచి తప్పుకున్న యూసుఫ్ ప‌ఠాన్  తృణమూల్ కాంగ్రెస్‌
    Systematic Investment Plan: తక్కువ జీతం.. పెద్ద సంపద? SIP పెట్టుబడితో సాధ్యమే! జీవనశైలి
    Haryana: హర్యానాలోని నుహ్‌లో పాకిస్తాన్ 'గూఢచారి' నెట్‌వర్క్ గుట్టురట్టు.. రెండు రోజుల్లో రెండో అరెస్టు హర్యానా

    ఓలా

    ఐదుగురు ట్విటర్‌ వినియోగదారులు ఓలా S1 హోలీ ఎడిషన్‌ను గెలుచుకునే అవకాశం ఆటో మొబైల్
    EV Chargers: ఓలా, ఎథర్, హీరో, టీవీఎస్ కస్టమర్లకు డబ్బు రీఫండ్ ఎలక్ట్రిక్ వాహనాలు
    Ola S1 Air : ఓలా ఎస్​1 ఎయిర్​లో ఫీచర్స్ మాములుగా లేవుగా..! ఎలక్ట్రిక్ వాహనాలు
    ఓలా కీలక నిర్ణయం.. ఇకపై హైదరాబాద్‌లోనూ ప్రైమ్ ప్లస్ సేవలు హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025