NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Crypto : రూ.2,500 కోట్ల భారీ క్రిప్టో స్కామ్.. ఎక్కడ,ఎలా జరిగిందో తెలుసా
    తదుపరి వార్తా కథనం
    Crypto : రూ.2,500 కోట్ల భారీ క్రిప్టో స్కామ్.. ఎక్కడ,ఎలా జరిగిందో తెలుసా
    రూ.2,500 కోట్ల భారీ క్రిప్టో స్కామ్

    Crypto : రూ.2,500 కోట్ల భారీ క్రిప్టో స్కామ్.. ఎక్కడ,ఎలా జరిగిందో తెలుసా

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 10, 2023
    06:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హిమాచల్ ప్రదేశ్‌లో కనీవినీ ఎరుగని రీతిలో కుంభకోణం జరిగింది. ఈ మేరకు దాదాపు రూ.2500 కోట్ల మాయమయ్యాయి.

    అయితే ఈ పథకంలో నష్టపోయిన లక్ష మంది పెట్టుబడిదారుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే సుమారుగా 4,000 నుంచి 5,000 మంది సర్కారు ప్రతినిధులు ఉన్నట్లు తెలుస్తోంది.

    హిమాచల్ ప్రదేశ్‌లో రూ. 2,500 కోట్ల క్రిప్టో కరెన్సీ కుంభకోణం వెనుక మోసగాళ్లు, రోడ్డు ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం సేకరించిన భూమికి పరిహారం పొందిన వ్యక్తులనే టార్గెట్ గా ఎంచుకున్నారు.

    ఇదే సమయంలో అగ్రశ్రేణి ఏజెంట్లకు విదేశీ పర్యటనలకు పంపడం ద్వారా కార్పొరేట్ తరహా కార్యకలాపాలు సాగించారని సిట్ విచారణలో వెల్లడించింది.

    details

    ఏకంగా 2 వేలకుపైగా ఫారిన్ ట్రిప్స్

    గరిష్ట సంఖ్యలో పెట్టుబడిదారులను తీసుకువచ్చి ఉత్తమ పనితీరు కనబరిచిన ఏజెంట్లను థాయిలాండ్, దుబాయ్ సహా ఇతర ప్రదేశాల్లో విదేశీ పర్యటనల కోసం ఎంపిక చేశారని తెలిపింది.

    ఏకంగా 2,000కిపైగా విలాస పర్యటనలు జరిగాయని సిట్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లేందుకు రూ. 3.5 కోట్లు వెచ్చించారని సిట్‌కు నేతృత్వం వహిస్తున్న ఉత్తర శ్రేణి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిఐజ) అభిషేక్ ధుల్లార్ మంగళవారం తెలిపారు.

    రాష్ట్రంలో నాలుగు లేన్ల ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం తమ భూమిని సేకరించిన తర్వాత పరిహారం పొందిన అనేక మందిని మండి, హమీర్‌పూర్ కాంగ్రా జిల్లాల్లోని నేరగాళ్లు తమ డబ్బును క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఎర వేశారని చెప్పారు.

    DETAILS

    ఇవి నకిలీ క్రిప్టోకరెన్సీ : సిట్   

    ఈ మేరకు అవి నకిలీ క్రిప్టోకరెన్సీ అని కుంభకోణంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పోలీసులు తేల్చేశారు.

    ఈ క్రమంలోనే దాదాపుగా రూ. 2,500 కోట్ల భారీ మొత్తాన్ని హిమాచల్ క్రిప్టో స్కామ్ వెనుక ఏజెంట్లు పెట్టుబడిదారులను లక్ష్యంగా చేసుకున్నారని వివరించారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 18 మందిని అరెస్టు చేశామన్నారు.

    ఈ కేసుకు సంబంధించి నలుగురు కీలక నిందితులు హేమరాజ్, సుఖ్‌దేవ్, అరుణ్ గులేరియా, అభిషేక్ లను అరెస్ట్ చేశారు.

    ఇందులో నలుగురు పోలీస్ సిబ్బంది, ఒక ఫారెస్ట్ గార్డు ఉండటం గమనార్హం. అయితే ప్రధాన నిందితుడు కింగ్‌పిన్ సుబాష్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్రిప్టో కరెన్సీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    క్రిప్టో కరెన్సీ

    2022 లో క్రిప్టో, మాల్వేర్ దాడులు వంటి సైబర్ నేరాల పెరుగుదల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    క్రిప్టో మార్కెట్‌ను తగ్గిస్తున్న సిల్వర్‌గేట్ గురించి తెలుసుకుందాం ఫైనాన్స్
    మూసివేత దిశగా వెళ్తున్న సిల్వర్‌గేట్ బ్యాంక్ బ్యాంక్
    క్రిప్టోలో పెట్టుబడి పెట్టి ఇబ్బందుల్లో పడిన ప్రముఖులు నష్టం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025