NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / India -US:WTO నోటీసులకు స్పందించని అమెరికా.. ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచనలోభారత్‌ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    India -US:WTO నోటీసులకు స్పందించని అమెరికా.. ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచనలోభారత్‌ 
    WTO నోటీసులకు స్పందించని అమెరికా.. ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచనలోభారత్‌

    India -US:WTO నోటీసులకు స్పందించని అమెరికా.. ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచనలోభారత్‌ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 02, 2025
    11:50 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా నుండి దిగుమతయ్యే కొన్ని ఉత్పత్తులపై ప్రతీకార చర్యల రూపంలో ప్రత్యేక సుంకాలు విధించబోతున్నట్టు భారత్‌ ఇటీవల ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)కు తెలియజేసింది.

    ఇది ప్రధానంగా భారత ఉక్కు (స్టీల్),అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా విధించిన దిగుమతి సుంకాలకు ప్రతిస్పందనగా తీసుకున్న నిర్ణయం.

    ఈ మేరకు WTO ద్వారా అమెరికాకు అధికారిక నోటీసులు పంపింది భారత్‌.

    అయితే, వాటిని అమెరికా తిరస్కరించింది. ఈ సుంకాలు బహుపాక్షిక వాణిజ్య ఒప్పందాలకు విరుద్ధమని, భారత్‌ పేర్కొన్నట్లుగా అవి 'భద్రతా చర్యలు' కాదని, తన జాతీయ భద్రత అవసరాలపై ఆధారపడి ఉన్నవని తెలిపింది.

    వివరాలు 

    అమెరికా నుండి వచ్చే లోహాలపై అధిక సుంకాలు

    ఈ అంశంపై న్యూఢిల్లీతో ఎలాంటి చర్చలకు తమకు ఆసక్తి లేదని ట్రంప్‌ పరిపాలనలోని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

    దీనితో, అమెరికా నుండి దిగుమతులపై ఇస్తున్న మినహాయింపులు, రాయితీలను భారత ప్రభుత్వం పునఃపరిశీలించాలని యోచిస్తోంది.

    అంతేకాక, అమెరికా నుండి వచ్చే లోహాలపై అధిక సుంకాలు విధించేందుకు చర్యలు ప్రారంభించినట్టు సమాచారం.

    ట్రంప్‌ మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై భారీఎత్తున టారిఫ్‌లు విధించారు.

    భారత్‌ నుండి దిగుమతి అవుతున్న ఉక్కు, అల్యూమినియంపై తొలుత 25 శాతం టారిఫ్ విధించిన అమెరికా, తాజాగా ఆ సుంకాలను 2025 జూన్‌ 4 నుంచి 50 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది.

    వివరాలు 

    భారత్‌ ఎగుమతులపై భారీ ప్రభావం

    ఈనిర్ణయం వల్ల భారత్‌ ఎగుమతులపై భారీ ప్రభావం పడనుంది. సుమారుగా 7.6బిలియన్‌ డాలర్ల విలువైన భారత ఉత్పత్తులపై దీనివల్ల ప్రతికూల ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది.

    ఈ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అత్యంత రక్షణాత్మక విధానాన్ని అనుసరిస్తోందని భారత్‌ తీవ్రంగా విమర్శిస్తూ WTOని ఆశ్రయించింది.

    ఇదిలా ఉండగా,భారతదేశం - అమెరికా మధ్య కొత్త వాణిజ్య ఒప్పందానికి చర్చలు చివరి దశకు చేరుకున్నట్టు వార్తలొస్తున్న తరుణంలో,ఇటువంటి పరిణామాలు చోటుచేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

    ఈ ఒప్పందం ద్వారా అమెరికా వాణిజ్య లోటును తగ్గించేందుకు భారత్‌ పలు మినహాయింపులు, వాణిజ్య లాభాలు అందించేందుకు సిద్ధంగా ఉందన్న ప్రచారం సాగింది.

    అయితే అమెరికా తాజా విధానాల నేపథ్యంలో ఆ రాయితీలపై కోతలు వచ్చే అవకాశాన్ని భారత్‌ పరిగణలోకి తీసుకుంటోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా

    తాజా

    India -US:WTO నోటీసులకు స్పందించని అమెరికా.. ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచనలోభారత్‌  అమెరికా
    MI vs PBKS : శ్రేయస్-హార్దిక్‌లకు బీసీసీఐ షాక్‌.. ఇద్దరికి బారీ జరిమానా!  శ్రేయస్ అయ్యర్
    Revanth Reddy: 'మేము బాధ్యతలు చేపట్టేనాటికి ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం': రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి
    Telugu Movies This week: థగ్ లైఫ్‌ నుంచి గ్యాంబ్లర్స్‌ వరకు.. జూన్‌ ఫస్ట్ వీక్‌లో థియేటర్‌, ఓటీటీలో వచ్చే సినిమాలివే టాలీవుడ్

    అమెరికా

    India - Pakistan: పాక్‌కు అమెరికా సూచన.. భారత్‌తో తక్షణం చర్చలు జరపండి భారతదేశం
    Trump: ఫార్మాపై ట్రంప్ టార్గెట్‌? దిగుమతులపై పన్నుల భారమా! డొనాల్డ్ ట్రంప్
    US- china trade deal: టారిఫ్‌ వార్‌కు తాత్కాలిక విరామం.. 90 రోజుల సమయం ఇచ్చిన అమెరికా, చైనా చైనా
    Trump: అమెరికాలో మందుల ధరల తగ్గింపుకు మార్గం: ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై  ట్రంప్‌ సంతకం  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025