NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Vikram Misri: పాకిస్థాన్‌కు ఆర్థిక సహాయంపై ఐఎంఎఫ్‌లో తన వాదన వినిపించనున్న భారత్ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Vikram Misri: పాకిస్థాన్‌కు ఆర్థిక సహాయంపై ఐఎంఎఫ్‌లో తన వాదన వినిపించనున్న భారత్ 
    పాకిస్థాన్‌కు ఆర్థిక సహాయంపై ఐఎంఎఫ్‌లో తన వాదన వినిపించనున్న భారత్

    Vikram Misri: పాకిస్థాన్‌కు ఆర్థిక సహాయంపై ఐఎంఎఫ్‌లో తన వాదన వినిపించనున్న భారత్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 09, 2025
    11:01 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF)బోర్డు ప్రస్తుతం పాకిస్థాన్‌కు సంబంధించి 1.3బిలియన్ డాలర్ల బేల్‌ఔట్‌ ప్యాకేజీ గురించి ఆలోచనలో ఉంది.

    ఈరుణాన్ని మంజూరు చేయాలా వద్దా అన్న దానిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

    ఇందులో భాగంగా కొద్ది గంటల్లో ఐఎంఎఫ్‌ సమావేశం జరగనుంది. ఇదే సమయంలో భారత్‌ మాత్రం ఈ రుణాన్ని మంజూరు చేయకూడదని IMF‌ను విజ్ఞప్తి చేస్తోంది.

    పాకిస్తాన్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థిక సహాయం అందించరాదని భారత ప్రభుత్వం గట్టిగా చెప్పింది.

    భారత్‌ వాదన ప్రకారం, ఐఎంఎఫ్‌ నుంచి విడుదలయ్యే నిధులు ఉగ్రవాదుల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.

    ఉగ్రవాద శిబిరాలను స్థాపించి భారతదేశంపై దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్‌కు అంతర్జాతీయంగా ఒంటరిని చేయాలనే ఉద్దేశంతో భారత్‌ కఠిన వైఖరిని తీసుకుంది.

    వివరాలు 

    ఇలాంటి చర్యలు పాకిస్తాన్‌కు అలవాటైపోయాయి

    అంతేకాదు, పాకిస్తాన్‌ గతంలో ఐఎంఎఫ్‌ నుంచి పొందిన నిధులను వేరేదారి మళ్లించినట్లు ఉన్న ఆధారాలను కూడా భారత్‌ సమర్పించిన సంగతి తెలిసిందే.

    ఇక, ఇటీవల జరిగిన ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా హతమైన ఉగ్రవాదులకు పాకిస్తాన్‌ సైన్యం అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించిన విషయంపై భారత్‌ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది.

    ఇలాంటి చర్యలు పాకిస్తాన్‌కు అలవాటైపోయాయని భారత ప్రభుత్వం విమర్శించింది.

    గురువారం నాడు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ విషయాలపై విశదీకరణ ఇచ్చారు.

    విక్రమ్ మిస్రీ వెల్లడించిన వివరాల ప్రకారం,పాక్‌ భూభాగంలో లష్కరే తోయిబా నేతృత్వంలోని ఉగ్రవాదులను,వారితో కలిసి ఉన్న సైనికులు,పోలీసులు,ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన ఫొటోలను కూడా ఆయన చూపించారు.

    వివరాలు 

    ఫోటోల్లో శవపేటికలపై పాకిస్తాన్‌ జాతీయ జెండా 

    ఈ చర్యల ద్వారా పాకిస్తాన్‌ ఏ సందేశం ఇవ్వాలనుకుంటోందని ఆయన ప్రశ్నించారు.

    భారత్‌ దాడుల్లో సాధారణ పౌరులు చనిపోయారన్న పాక్‌ వాదనను ఖండించారు."వాస్తవంగా పౌరులే చనిపోయి ఉంటే,ఈ ఫోటోల్లో శవపేటికలపై పాకిస్తాన్‌ జాతీయ జెండా ఎందుకు ఉంది? పౌరులకి ఇలా అధికారికంగా అంత్యక్రియలు నిర్వహిస్తారా?"అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

    ఆ దాడుల్లో చనిపోయినవారు పూర్తిగా ఉగ్రవాదులేనని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

    వివరాలు 

    భారత్‌తో పాటు మరెన్నో దేశాల వద్ద ఆధారాలు

    "ఉగ్రవాదంతో ముడిపడి ఉన్న పాకిస్తాన్‌ ఇప్పుడు తమకు శుద్ధి సాధించాలనుకుంటోంది.కానీ, ఆ దేశంలో ఉగ్రవాదులు లేరని ప్రచారం చేసే వారే తాము చెప్పిన మాటలకు గట్టి సవాళ్లు ఎదుర్కొంటున్నారు," అని మిస్రీ వ్యాఖ్యానించారు.

    అంతేకాదు, పాకిస్తాన్‌ ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా మారిందని గతంలో అనేక సందర్భాల్లో నిరూపణ కూడా జరిగిందని, దీనికి సంబంధించిన ఆధారాలు భారత్‌తో పాటు మరెన్నో దేశాల వద్ద ఉన్నాయని ఆయన వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆపరేషన్‌ సిందూర్‌

    తాజా

    Virender Sehwag: పాక్‌కు మర్చిపోలేని సమాధానం అందుతుంది.. భారత సైన్యానికి సెహ్వాగ్ మద్దతు వీరేంద్ర సెహ్వాగ్
    Vikram Misri: పాకిస్థాన్‌కు ఆర్థిక సహాయంపై ఐఎంఎఫ్‌లో తన వాదన వినిపించనున్న భారత్  ఆపరేషన్‌ సిందూర్‌
    Pakistan: భారతదేశంతో ఉద్రిక్తతల మధ్య.. ఆర్థిక సహాయం కోసం పంచ బ్యాంకు'ను సంప్రదించిన పాకిస్తాన్  పాకిస్థాన్
    Omar Abdullah: అత్యవసరంగా జమ్మూకు ఒమర్‌ అబ్దుల్లా.. పరిస్థితిని సమీక్షించనున్న సీఎం  ఒమర్ అబ్దుల్లా

    ఆపరేషన్‌ సిందూర్‌

    Operation Sindoor: ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులతో విరుచుకుపడ్డ భారత్ భారతదేశం
    Operation Sindoor: పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై 'ఆపరేషర్‌ సిందూర్‌'.. దేశవ్యాప్తంగా అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులు  భారతదేశం
    Vyomika Singh and Sophia Qureshi:ఆపరేషన్ సింధూర్..ఎవరి..సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ ? భారతదేశం
    Operation Sindoor: పాక్‌లో ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడి.. మాజీ, ప్రస్తుత క్రికెటర్ల స్పందనలివే!  క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025