NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / India Us Trade: భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు.. హార్లీ డేవిడ్సన్ బైక్స్, బోర్బన్ విస్కీపై సుంకాల కోత..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    India Us Trade: భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు.. హార్లీ డేవిడ్సన్ బైక్స్, బోర్బన్ విస్కీపై సుంకాల కోత..
    హార్లీ డేవిడ్సన్ బైక్స్, బోర్బన్ విస్కీపై సుంకాల కోత..

    India Us Trade: భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు.. హార్లీ డేవిడ్సన్ బైక్స్, బోర్బన్ విస్కీపై సుంకాల కోత..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 26, 2025
    04:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాల ప్రభావం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.

    ఇప్పటికే ఆయన మెక్సికో, కెనడా, చైనా నుండి వచ్చే ఉత్పత్తులపై సుంకాలను పెంచారు.

    ఏప్రిల్ నుంచి పరస్పర సుంకాలను అమలు చేస్తామని హెచ్చరించారు.

    ఈ నేపథ్యంలో, వాణిజ్య ఒప్పందాలు, సుంకాల తగ్గింపు వంటి అంశాలపై భారత్-అమెరికా అధికారులు చర్చలు జరుపుతున్నారు.

    భారత ప్రభుత్వం, అమెరికా ఉత్పత్తులైన హార్లే డేవిడ్సన్ బైకులు, బోర్బన్ విస్కీ, కాలిఫోర్నియా వైన్‌లపై దిగుమతి సుంకాలను తగ్గించే అవకాశం ఉందని సమాచారం.

    వివరాలు 

    సుంకాల సవరణ.. ప్రస్తుత పరిస్థితి 

    గతంలో భారత ప్రభుత్వం హార్లే డేవిడ్సన్ బైకులపై దిగుమతి సుంకాన్ని 50% నుంచి 40%కి తగ్గించింది.

    ఇప్పుడు మరింత తగ్గించే అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఇది ప్రపంచ ప్రీమియం బైకులు భారతీయ మార్కెట్లో మరింత అందుబాటులోకి రావడానికి దోహదపడవచ్చు.

    అలానే, బోర్బన్ విస్కీ దిగుమతి సుంకాన్ని 150% నుంచి 100%కి తగ్గించారు. ప్రస్తుతం కాలిఫోర్నియా వైన్‌పై కూడా సుంకాలను తగ్గించే దిశగా చర్చలు జరుగుతున్నాయి.

    వివరాలు 

    ట్రంప్ ఒత్తిడి.. వాణిజ్య సంబంధాలు 

    భారతదేశంలో 140 కోట్ల మంది వినియోగదారుల మార్కెట్‌ను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో, డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్‌పై ఒత్తిడి పెంచుతున్నారు.

    భారత్ అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలను విధిస్తోందని ఆయన బహిరంగంగానే విమర్శించారు.

    ఈ నేపథ్యంలో, ఇరు దేశాల వాణిజ్య చర్చలు కేవలం మోటార్ సైకిళ్లు, మద్యం పానీయాలకే పరిమితం కాకుండా, భారత ఔషధ ఉత్పత్తులు, రసాయనాల ఎగుమతుల విస్తరణ వంటి అంశాలపైనా చర్చలు సాగుతున్నాయి.

    భారతదేశ ఫార్మాస్యూటికల్ పరిశ్రమ పెరుగుతున్న కొద్దీ, అమెరికా తన మార్కెట్‌ను విస్తరించేందుకు ఆసక్తి చూపుతోంది.

    అదే సమయంలో, భారతదేశం అమెరికాకు ఎగుమతులపై మరింత అనుకూలమైన వాణిజ్య విధానాలను పొందాలని చూస్తోంది.

    వివరాలు 

    భవిష్యత్తులో సుంకాల ప్రభావం.. 

    బోర్బన్ విస్కీ, కాలిఫోర్నియా వైన్‌లపై సుంకాల తగ్గింపు వల్ల భారత మద్యం మార్కెట్లో పోటీ పెరుగుతుంది.

    అయితే, అమెరికా నుండి ఔషధ దిగుమతుల పెరుగుదల ప్రపంచ జెనరిక్ మెడిసిన్ మార్కెట్‌లో కీలక పాత్ర పోషిస్తున్న భారత ఔషధ పరిశ్రమపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం

    తాజా

    Mini Kashmir: కశ్మీర్‌కు బదులుగా ఈ మినీ కశ్మీర్‌కెళ్లండి.. ఇదే రైట్ టైమ్! జమ్ముకశ్మీర్
    Ravindra Jadeja: జడేజాకు టెస్ట్ సారథ్య బాధ్యతలు ఇవ్వాలి : అశ్విన్ జడేజా
    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం  ఇండియా కూటమి
    TVS: 2025 టీవీఎస్ ఐక్యూబ్ లాంచ్.. ధర తగ్గింది.. రేంజ్ పెరిగింది! టీవీఎస్ మోటార్

    భారతదేశం

    India-China: భూటాన్‌లోని డోక్లామ్ సమీపంలో చైనా గ్రామాలు .. శాటిలైట్‌ చిత్రాల్లో వెల్లడి చైనా
    Bipin Rawat: 'మానవ తప్పిదం' కారణంగా 2021 ఛాపర్ క్రాష్ CDS బిపిన్ రావత్ మృతి: పార్ల్ ప్యానెల్ నివేదిక భారతదేశం
    Veer Bal Diwas: ఆ చిన్నారుల ధైర్యానికి గుర్తుగా వీర్ బాల్ దివస్ ప్రపంచం
    GST increase: జీఎస్టీ పెంపుతో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్‌పై పెరిగిన ఒత్తిడి జీఎస్టీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025