NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / అమెరికాకు భారత్ గుడ్ న్యూస్.. G-20కి ముందు వస్తువులపై అదనపు సుంకం ఎత్తివేత 
    తదుపరి వార్తా కథనం
    అమెరికాకు భారత్ గుడ్ న్యూస్.. G-20కి ముందు వస్తువులపై అదనపు సుంకం ఎత్తివేత 
    G-20కి ముందు వస్తువులపై అదనపు సుంకం ఎత్తివేత

    అమెరికాకు భారత్ గుడ్ న్యూస్.. G-20కి ముందు వస్తువులపై అదనపు సుంకం ఎత్తివేత 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 07, 2023
    04:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    G-20 శిఖరాగ్ర సమావేశానికి ముందు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన అమెరికాకు చెందిన పలు ఉత్పత్తులపై అదనపు సుంకాలను ఎత్తివేసేందుకు నిర్ణయించింది.

    ఈ మేరకు 6 రకాల అమెరికా ఉత్పత్తులపై విధిస్తున్న అదనపు సుంకాలను భారత్ ఎత్తివేసింది.వీటిలో శెనగలు, ఉల్వలు, యాపిల్స్, వాల్‌నట్స్‌, బాదం లాంటి ఆహార ఉత్పత్తులున్నాయి.

    2019లో భారత్ లో ఉత్పత్తి అయ్యే ఉక్కు,అల్యూమినియంపై అగ్రరాజ్యం సుంకాలను పెంచింది. బదులుగా భారత్‌ సైతం పలు ఉత్పత్తులపై అదనపు సుంకాలను ప్రవేశపెట్టింది.

    తాజాగా జీ-20 సమావేశానికి ముందు వాటిలో కొన్నింటికి మినహాయింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీ-20 సమావేశం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో ప్రధాని మోదీ కీలక ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.

    DETAILS

    వాణిజ్య వివాదాలను పరిష్కారానికి ఇరు దేశాలు గ్రీన్ సిగ్నల్

    ఈ నేపథ్యంలో భారత్ సర్కార్ తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. గత జూన్‌లో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించారు.

    ఈ మేరకు ఆరు ఆంశాలకు సంబంధించి వాణిజ్య వివాదాలను పరిష్కరించేందుకు ఇరు దేశాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఇందులో అదనపు సుంకాల అంశం కూడా ఉండటం గమనార్హం.

    మరోవైపు అమెరికా బాదం, వాల్‌నట్స్‌, శెనగలు, ఉల్వలు, యాపిల్స్ , వైద్య పరీక్షల రీఏజెంట్స్, బోరిక్‌ యాసిడ్‌పై కొనసాగుతున్న అదనపు సుంకాలను ఎత్తివేస్తామని జులైలో రాజ్యసభలో కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్‌ ప్రకటించారు.

    ఈ నిర్ణయం ఫలితంగా భారత్‌కు నష్టమేం లేదని ఆమె స్పష్టం చేశారు. 2022- 23లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సరకుల వాణిజ్యం 128.8 బిలియన్‌ డాలర్లకు చేరుకోవడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    కేంద్ర ప్రభుత్వం
    అమెరికా

    తాజా

    Salman khan: సల్మాన్ ఖాన్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తి.. అరెస్టు సల్మాన్ ఖాన్
    Kawasaki Versys-X 300: భారత్‌లో 2025 కవాసాకి వెర్సిస్-ఎక్స్ 300 లాంచ్.. అడ్వెంచర్ బైక్ ! ఆటో మొబైల్
    Bomb Threat: పంజాబ్‌, హర్యానా హైకోర్టుకు బాంబు బెదిరింపు పంజాబ్
    Prashant Varma: కొత్త బిజినెస్‌లోకి ఎంట‌ర్ అయిన ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వర్మ.. హనుమాన్ జ‌యంతి కానుక‌గా లిమిటెడ్ ఎడిషన్ హను-మాన్

    భారతదేశం

    జీ-20 సమావేశాలకు రష్యా డుమ్మా.. పుతిన్ రావట్లేదని ప్రకటన రష్యా
    B20 సదస్సులో నిర్మలా సీతారామన్.. ద్రవ్యోల్బణం కట్టడికే తొలి ప్రాధాన్యం నిర్మలా సీతారామన్
    భారత్ భళా..2030 నాటికి ఉపాధి రంగంలో మరో ఘనత : మెకిన్సే నివేదిక ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు
    వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదనే రిసీవ్ చేసుకోవడానికి రావొద్దని చెప్పాను: కాంగ్రెస్ విమర్శలకు మోదీ జవాబు  నరేంద్ర మోదీ

    కేంద్ర ప్రభుత్వం

    పెట్రోల్ ధరల్లో ఏపీ టాప్.. చమురు ధరల నివేదికను పార్లమెంట్ కు అందజేసిన కేంద్రం లోక్‌సభ
    బియ్యం ధరల కట్టడికి కేంద్రం కళ్లెం.. ఎగుమతులపై నిషేధం విధింపు భారతదేశం
    ఏపీ, బాంబే హైకోర్టులకు కొత్త సీజేలు.. కొలిజీయం సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదం ఆంధ్రప్రదేశ్
    రూ.2 వేల నోట్ల మార్పిడిపై కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన ఆర్థిక శాఖ మంత్రి

    అమెరికా

    విలాసవంతమైన ఫ్లాట్ ను అమ్ముకున్న ముకేశ్‌ అంబానీ.. ధర ఎంతో తెలుసా న్యూయార్క్
    చైనాపై అమెరికా ఆంక్షలు.. సాంకేతిక పెట్టుబడులపై నిషేధాజ్ఞలు జో బైడెన్
    అమెరికాలో కొత్త కరోనా వేరియంట్ కలకలం.. కొవిడ్ కేసుల్లో ఈజీ5ది 17 శాతం  కరోనా వేరియంట్
    ఉత్తర కొరియా టాప్ జనరల్ తొలగింపు.. యుద్ధానికి సిద్ధం కావాలని కిమ్ జోంగ్ పిలుపు ఉత్తర కొరియా/ డీపీఆర్‌కే
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025