NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / India's poverty: దేశంలో క్రమంగా తగ్గుతున్న పేదరికం.. స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక
    తదుపరి వార్తా కథనం
    India's poverty: దేశంలో క్రమంగా తగ్గుతున్న పేదరికం.. స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక
    దేశంలో క్రమంగా తగ్గుతున్న పేదరికం.. స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక

    India's poverty: దేశంలో క్రమంగా తగ్గుతున్న పేదరికం.. స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 10, 2025
    12:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలోని పేదరిక స్థాయి క్రమంగా తగ్గుతోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజా నివేదిక స్పష్టంగా వెల్లడించింది.

    2022-23 ఆర్థిక సంవత్సరంలో పేదరిక స్థాయి 5.3శాతంగా ఉండగా,2023-24లో అది 4.6 శాతానికి తగ్గిందని ఈ నివేదిక పేర్కొంది.

    పేదరికంపై ఎస్‌బీఐ చేసిన ఈ విశ్లేషణ ప్రపంచ బ్యాంక్‌ నివేదికతో సైతం సమానంగా ఉంది.

    ప్రపంచ బ్యాంక్ కూడా ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ,2023లో దేశంలో పేదరికం 5.3 శాతంగా ఉండగా,ప్రస్తుతం అది 4.6 శాతానికి చేరిందని స్పష్టం చేసింది.

    ఇది దేశం పేదరిక నిర్మూలన దిశగా మంచి పురోగతిని సాధిస్తున్నదానికి ఓ స్పష్టమైన సంకేతమని ఎస్‌బీఐ పేర్కొంది.

    అంతకుముందు,2011-12ఆర్థిక సంవత్సరంలో దేశంలో పేదరికం 27.1శాతంగా ఉన్నదని ఎస్‌బీఐ తన నివేదికలో వెల్లడించింది.

    వివరాలు 

     పేదల్లో 65 శాతం మంది ఈ రాష్ట్రాల్లోనే..

    ఇక మరోవైపు, ప్రపంచ బ్యాంక్ గ్లోబల్ పావర్టీ లైన్‌ (అంతర్జాతీయ పేదరిక రేఖ)కు ఇటీవల మార్పులు చేసింది.

    గతంలో రోజుకు 2.15అమెరికన్ డాలర్ల కంటే తక్కువ ఆదాయం కలిగిన వారిని పేదలుగా పరిగణించగా,ఇప్పుడు ఈ పరిమితిని 3 డాలర్లకు పెంచింది.

    దాంతో రోజుకు సుమారు రూ.260 కన్నా తక్కువ సంపాదించే వారిని పేదులుగా గుర్తిస్తున్నారు.

    ప్రపంచ బ్యాంక్ డేటా ప్రకారం,2011-12లో దేశంలోని మొత్తం పేదల్లో సుమారు 65 శాతం మంది ఉత్తరప్రదేశ్‌,బీహార్‌,పశ్చిమ బెంగాల్‌,మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోనే ఉన్నారు.

    2011-12లో గ్రామీణ భారత్‌లో పేదరికం స్థాయి 18.4శాతంగా ఉండగా,2022-23 నాటికి అది 2.8శాతానికి తగ్గింది.

    అదే విధంగా పట్టణ ప్రాంతాల్లో 2011-12లో 10.7శాతం పేదరికం ఉండగా, 2022-23 నాటికి అది కేవలం 1.1 శాతానికి పడిపోయింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

    తాజా

    India's poverty: దేశంలో క్రమంగా తగ్గుతున్న పేదరికం.. స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
    Harish Rao: హరీశ్‌రావుకు హైకోర్టులో భారీ ఊరట.. ఎన్నికల పిటిషన్‌ను తోసిపుచ్చిన న్యాయస్థానం బీఆర్ఎస్
    Shubhanshu Shukla: శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర ఆక్సియం-4 కోసం భారతదేశం ఎంత ఖర్చు చేస్తోందో తెలుసా ? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం
    WTC Final: కోహ్లీ, రోహిత్ రికార్డులపై కన్నేసిన ట్రావిస్ హెడ్!  వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

    అన్ని బ్యాంకుల ఖాతాదారులకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్..కార్డు లేకున్నా నగదు డ్రా చేసుకోవచ్చు బిజినెస్
    ఎస్‌బీఐ చైర్మన్ జీతం తెలిస్తే షాక్.. వెల్లడించిన మాజీ సారథి రజనీష్ కుమార్ బ్యాంక్
    ఎస్​బీఐతో జట్టు కట్టిన రిలయెన్స్.. కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను ప్రారంభించేందుకు సన్నాహాలు రిలయెన్స్
    SBI MCap: ఒక్కరోజే 10% పెరిగిన ఎస్‌బీఐ షేరు.. ఏకంగా రూ.8 లక్షల కోట్ల మార్కుతో ఘనత!  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025