NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Nitin Gadkari:  వచ్చే రెండేళ్లలో భారతదేశ లాజిస్టిక్స్ ఖర్చు సింగిల్ డిజిట్‌కు తగ్గుతుంది: గడ్కరీ
    తదుపరి వార్తా కథనం
    Nitin Gadkari:  వచ్చే రెండేళ్లలో భారతదేశ లాజిస్టిక్స్ ఖర్చు సింగిల్ డిజిట్‌కు తగ్గుతుంది: గడ్కరీ
    వచ్చే రెండేళ్లలో భారతదేశ లాజిస్టిక్స్ ఖర్చు సింగిల్ డిజిట్‌కు తగ్గుతుంది: గడ్కరీ

    Nitin Gadkari:  వచ్చే రెండేళ్లలో భారతదేశ లాజిస్టిక్స్ ఖర్చు సింగిల్ డిజిట్‌కు తగ్గుతుంది: గడ్కరీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 18, 2024
    08:32 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, తమ మంత్రిత్వ శాఖ అనేక హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మిస్తుండటంతో,రానున్న రెండేళ్లలో భారతదేశ లాజిస్టిక్స్ ఖర్చు జీడీపీలో 9 శాతానికి తగ్గిపోతుందని తెలిపారు.

    నీతి ఆయోగ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ,ప్రస్తుతం భారతదేశంలో లాజిస్టిక్స్ ఖర్చు 14శాతంగా ఉందని,యూరప్,అమెరికాలో లాజిస్టిక్స్ ఖర్చు సుమారు 12శాతంగా ఉందని వివరించారు.

    చైనాలో ఈ ఖర్చు 8 శాతమేనని కూడా చెప్పారు.

    వివరాలు 

    ప్రపంచ సగటు 8 శాతం కంటే ఎక్కువ

    గడ్కరీ పేర్కొన్నట్లు,మన దేశంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో లాజిస్టిక్స్ ఖర్చు జీడీపీలో 7.8 శాతం నుంచి 8.9 శాతం మధ్య ఉండగా, 2022-23లో ఇది 14-18 శాతం వరకు పెరిగిందని చెప్పారు.

    ఇది ప్రపంచ సగటు 8 శాతం కంటే ఎక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

    ఆయన ఇంకా ప్రత్యామ్నాయ ఇంధనాలు, జీవ ఇంధనాల ఎగుమతికి భారత్‌కు గొప్ప అవకాశాలు ఉన్నాయని అన్నారు.

    మిథనాల్ ఉత్పత్తిలో నాణ్యత లేని బొగ్గు కూడా ఉపయోగపడుతుందని చెప్పారు.

    భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలో నంబర్ వన్ స్థానంలో నిలపాలన్న లక్ష్యం తనదని గడ్కరీ తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నితిన్ గడ్కరీ

    తాజా

    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    #NewsBytesExplainer: అంతరిక్షం నుండి కనిపించే ఏకైక మానవ నిర్మాణం ... ఎక్కడ ఉందంటే..? అంతరిక్షం

    నితిన్ గడ్కరీ

    2024 నాటికి 15 లక్షల కోట్లకు చేరుకునే లక్ష్యం దిశగా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్: నితిన్ గడ్కరీ ఆటో మొబైల్
    'రోడ్డుపై ప్రయాణిస్తే విమానాల కంటే వేగంగా వెళ్లొచ్చు', నితిన్ గడ్కరీ కామెంట్స్ బీజేపీ
    మొదటి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సదుపాయాన్ని ప్రారంభించిన టాటా మోటార్స్ టాటా
    కొన్ని రోడ్లపై వేగంగా వెళ్లాలంటున్న కేంద్ర ప్రభుత్వం రవాణా శాఖ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025