NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. లాభ-నష్టాల మధ్య ఊగిసలాట
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. లాభ-నష్టాల మధ్య ఊగిసలాట
    ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. లాభ-నష్టాల మధ్య ఊగిసలాట

    Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. లాభ-నష్టాల మధ్య ఊగిసలాట

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 13, 2025
    09:59 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాల కారణంగా మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు గురైంది.

    వాణిజ్య యుద్ధ భయాలతో వరుస నష్టాల్లోకి జారుకున్న సూచీలు ప్రస్తుతం లాభ-నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి.

    మార్కెట్ ప్రారంభంలోనే నిఫ్టీ 23,100 వద్ద ట్రేడింగ్‌ను మొదలుపెట్టగా, సెన్సెక్స్ 190 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది.

    ఉదయం 9:30 గంటల సమయంలో, సెన్సెక్స్ 28 పాయింట్ల నష్టంతో 75,142 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు తగ్గి 23,024 వద్ద కొనసాగింది.

    Details

    స్వల్ప నష్టాలతో డోజోన్స్

    కోటక్ మహీంద్రా బ్యాంక్, సన్‌ఫార్మా, ఎంఅండ్‌ఎం, బజాజ్ ఫిన్‌సర్వ్, అదానీ పోర్ట్స్, జొమాటో, టాటా స్టీల్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

    టెక్‌మహీంద్రా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టైటాన్, హెచ్‌యూఎల్, ఎల్‌అండ్‌టీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

    డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.85 వద్ద కొనసాగుతుండగా, అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 74.46 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

    బంగారం ఔన్సు ధర 2,942.50 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది.

    అమెరికా మార్కెట్లు గత ట్రేడింగ్ సెషన్‌లో మిశ్రమంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ 500, డోజోన్స్ స్వల్ప నష్టాలతో ముగియగా, నాస్‌డాక్ ఫ్లాట్‌గా ముగిసింది.

    Details

    లాభాల్లో ఆసియా-పసిఫిక్ ప్రధాన సూచీలు

    ఆసియా-పసిఫిక్ ప్రధాన సూచీలు నేడు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

    ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ 0.20%, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 1.45%, జపాన్ నిక్కీ 1.30% లాభంతో ట్రేడవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు

    బుధవారం నికరంగా రూ.4,969 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు నికరంగా రూ.5,929 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్
    వ్యాపారం

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    స్టాక్ మార్కెట్

    Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు.. లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 23,000 బిజినెస్
    Stock market : లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 566, నిఫ్టీ 130 పాయింట్లు బిజినెస్
    Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@23,000 బిజినెస్
    Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 23,200 ఎగువన నిఫ్టీ  బిజినెస్

    వ్యాపారం

    Myntra: క్విక్ కామర్స్‌లోకి మింత్రా.. 30 నిమిషాల్లో ఉత్పత్తుల డెలివరీ  బిజినెస్
    IPO: ధన్ లక్ష్మి క్రాప్ సైన్స్ ఐపీఓ: మంచి గ్రోత్, ప్రైస్ బాండ్‌తో ఇన్వెస్టర్లకు ఆహ్వానం ఐపీఓ
    Year Ender 2024:  ప్రపంచవ్యాప్తంగా 2024లో దివాళా తీసిన పలు కంపెనీలు జాబితా ఇదే! సంవత్సరం ముగింపు 2024
    Swiggy: స్విగ్గీలో ప్రీమియం మెంబర్‌షిప్‌.. ధర, ఫీచర్లు వివరాలివే! స్విగ్గీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025