NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Infosys: మరోసారి లేఆఫ్స్ ప్రకటించిన ఇన్ఫోసిస్.. 240 మంది ఉద్యోగుల తొలగింపు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Infosys: మరోసారి లేఆఫ్స్ ప్రకటించిన ఇన్ఫోసిస్.. 240 మంది ఉద్యోగుల తొలగింపు 
    మరోసారి లేఆఫ్స్ ప్రకటించిన ఇన్ఫోసిస్.. 240 మంది ఉద్యోగుల తొలగింపు

    Infosys: మరోసారి లేఆఫ్స్ ప్రకటించిన ఇన్ఫోసిస్.. 240 మంది ఉద్యోగుల తొలగింపు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 18, 2025
    12:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థ తీసుకుంటున్న తాజా నిర్ణయాలు పరిశ్రమవర్గాల్లో ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

    కంపెనీ ఒకవైపు 2025-26 ఆర్థిక సంవత్సరంలో 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే యోచనలో ఉండగా, మరోవైపు శిక్షణలో తగిన ప్రతిభ కనబర్చలేని 240 మంది ట్రైనీలను సంస్థ నుండి తొలగించిన విషయం వెలుగులోకి వచ్చింది.

    ఈ విషయాన్ని సంబంధిత ఉద్యోగులకు ఏప్రిల్ 18న పంపిన ఈమెయిల్ ద్వారా తెలియజేశారు.

    ఈ తొలగింపులు మైసూర్ క్యాంపస్‌లో ఇదివరకే జరిగిన లేఆఫ్స్‌కు కొనసాగింపుగా భావిస్తున్నారు.

    గత ఫిబ్రవరిలోనూ ఇలాంటి పరిస్థితుల్లో సుమారు 300 మందికిపైగా శిక్షణలో ఉన్న ఉద్యోగులను ఇన్ఫోసిస్ వదిలేసింది.

    అయితే, ఉద్యోగాలు కోల్పోయిన వారికి నైపుణ్యాల అభివృద్ధి కోసం సంస్థ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ఉచితంగా అందిస్తోంది.

    వివరాలు 

    BPM విభాగంలో ఉద్యోగ అవకాశాల కోసం 12 వారాల ప్రత్యేక శిక్షణ

    ఈ శిక్షణలు ఎన్‌ఐఐటీ, అప్‌గ్రాడ్ వంటి సంస్థల సహకారంతో నిర్వహించనున్నట్లు సమాచారం.

    ప్రస్తుతం ఇన్ఫోసిస్ డిమాండ్ నెమ్మదింపునకు గురవుతున్న వేళ, ఈ విధంగా ఉద్యోగులను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    సంస్థ 2025 ఆర్థిక సంవత్సరానికి కేవలం 0 నుంచి 3 శాతం మధ్య ఆదాయ వృద్ధిని మాత్రమే ఊహిస్తోంది.

    దీనితో పాటు, గతంలో మైసూర్ క్యాంపస్‌లో మూడు సార్లు నిర్వహించిన అంతర్గత పరీక్షల్లో విఫలమైన సుమారు 400 మంది శిక్షణలో ఉన్న ఉద్యోగులను తొలగించిన విషయం గమనార్హం.

    అయితే, వీరికి BPM విభాగంలో ఉద్యోగ అవకాశాల కోసం 12 వారాల ప్రత్యేక శిక్షణను అందించింది.

    వివరాలు 

    ఇన్ఫోసిస్ నికర లాభం 12 శాతం తగ్గి రూ. 7,033 కోట్లకు..

    ఒకవైపు శిక్షణలో ఫెయిల్ అయిన ఉద్యోగులను సంస్థ నుంచి తొలగిస్తున్నప్పటికీ, కొత్త నియామకాలపై ఇన్ఫోసిస్ శ్రద్ధ చూపుతోంది.

    సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

    గత ఆర్థిక సంవత్సరంలో కూడా ఇలాంటి సంఖ్యలోనే (15,000-20,000) కొత్త ఉద్యోగులను నియమించినట్లు వెల్లడించింది.

    అలాగే, ఉద్యోగులకు వేతనాల పెంపు కూడా జనవరి నుంచి దశలవారీగా అమలవుతోందని పేర్కొంది.

    ఇటీవల విడుదలైన సంస్థ క్యూ4 ఫలితాల ప్రకారం,ఏడాది ప్రాతిపదికన ఇన్ఫోసిస్ నికర లాభం 12 శాతం తగ్గి రూ. 7,033 కోట్లకు పరిమితమైంది.

    అయితే సంస్థ ఆదాయం మాత్రం 7.9 శాతం పెరిగి రూ. 40,925 కోట్లకు చేరుకుంది.

    వివరాలు 

    త్రైమాసికానికి ఉద్యోగుల సంఖ్య 199మంది

    మార్చి 31తో ముగిసిన త్రైమాసికానికి ఉద్యోగుల సంఖ్య 199మందితో పెరిగింది.

    గత సంవత్సరం తులనలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,23,578కి చేరుకున్నట్లు తెలుస్తోంది.

    అదే సమయంలో,సంస్థ అట్రిషన్ రేటు 13.7 శాతం నుండి 14.1 శాతానికి పెరిగినట్లు గణాంకాలు చూపుతున్నాయి.

    ఇన్ఫోసిస్ ఒకవైపు వేల సంఖ్యలో ఫ్రెషర్లను నియమించుకుంటూ,మరోవైపు శిక్షణలో అనుకున్న స్థాయిలో రాణించని ఉద్యోగులను తొలగించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

    కంపెనీ తీసుకుంటున్న ఈ వ్యూహాత్మక నిర్ణయాలు,ప్రస్తుత డిమాండ్ మందగమన పరిస్థితుల్లో ఐటీ రంగంలో విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి.

    అదే సమయంలో,ఐటీ పరిశ్రమలో ఉద్యోగుల అట్రిషన్ రేటు పెరగడం సంస్థలకు మరింత ఆందోళన కలిగించే అంశంగా మారింది.

    ఈప్రభావంతో కొత్తగా ఉద్యోగుల సంఖ్య పెరుగుతున్నట్లు కనిపించకపోవడం గమనించదగిన విషయంగా నిలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇన్ఫోసిస్

    తాజా

     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి చార్మినార్
    Health insurance: హెల్త్‌ బీమా సరిపోతుందా?.. 80శాతం పాలసీదారుల్లో ఆందోళన ఆరోగ్య బీమా
    Ceasefire: పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదు : రక్షణ శాఖ భారతదేశం
    Surya : సూర్య అభిమానులకు శుభవార్త.. 'రెట్రో' ఓటీటీ విడుదల తేదీ లీక్? సూర్య

    ఇన్ఫోసిస్

    Infosys: నెలకు 10 రోజులు ఆఫీస్ కి రావాల్సిందే.. ఉద్యోగులకు ఇన్ఫోసిస్ హుకుం  బిజినెస్
    Infosys: ఉద్యోగులకు 80శాతం బోనస్ ప్రకటించిన ఇన్ఫోసిస్  తాజా వార్తలు
    Narayana Murthy : డీప్‌ఫేక్ వీడియోలపై హెచ్చరించిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి.. నేను అలా అనలేదు, ఎవరూ నమ్మకండి  డీప్‌ఫేక్‌
    Infosys-Wipro-Tcs: విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్‌లలో 63,759 మంది ఉద్యోగాలను కోల్పోయారు  విప్రో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025